లేబర్ ఎకనమిక్స్లో ప్రయోగం, ఆర్థిక శాస్త్రంలో వీరికి నోబెల్
అమెరికాలో ఉంటున్న ముగ్గురు ఆర్థికవేత్తలకు ఎకనమిక్స్లో నోబెల్ బహుమతి వచ్చింది. కనీస వేతనం, ఇమ్మిగ్రేషన్, విద్య యొక్క కార్మిక మార్కెట్ ప్రభావాలపై మార్గదర్శక పరిశోధన కోసం గాను ఈ బహుమతి వచ్చింది. ఈ ఏడాది ఆర్థిక శాస్త్రానికి కు సంబంధించి నోబెల్ అవార్డుల కోసం ముగ్గురిని ఎంపిక చేసింది. డేవిడ్ కార్డ్, జోషువా అంగ్రిస్ట్, గైడో ఇంబెన్స్ పేర్లను ప్రకటించింది.
కెనడాలో జన్మించిన డేవిడ్ కార్డ్ (యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, బెర్కెలీ), ఇజ్రాయెలీ-అమెరికన్ జోషువా అంగ్రిస్ట్ (మసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ), డచ్లో జన్మించిన గైడో ఇంబెన్స్ (స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ)కి చెందినవారు. ఈ ముగ్గురికీ కలిపి ఆర్థికశాస్త్రంలో నోబెల్ బహుమతిని ప్రకటించింది రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ప్యానెల్ కమిటీ.
లేబర్ ఎకనమిక్స్లో ప్రయోగాలకు గాను డేవిడ్ కార్డ్ను, కనీస వేతనాలు, వలసలు, విద్య వంటి లేబర్ మార్కెట్ మీద ఎలాంటి ప్రభావాలు చూపిస్తాయనే అంశంపై ఆయన ప్రయోగాలు చేశారు. ఆర్థిక శాస్త్రంలో మెథడలాజికల్ కంట్రిబ్యూషన్ చేసినందుకు జోషువా, గైడో ఇంబెన్స్ను ఎంపిక చేశారు.