Chennai Petroleum: క్యూ4 ఫలితాలతో పాటు చాలా కంపెనీలు తమ ఉద్యోగులకు బోనస్, డివిడెండ్ ప్రకటిస్తూ జోష్ నింపుతున్నాయి. అనేక కంపెనీల షేర్లు ఈ క్రమంలో ఒక్కరోజే అధిక శాతంలో పెరిగిపోతున్నాయి.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది చెన్నై పెట్రోలియం కార్పొరేషన్ కంపెనీ షేర్ల గురించే. నేడు ఇంట్రాడేలో షేర్ ధరలో భారీ పెరుగుదల కనిపించింది. చెన్నై పెట్రోలియం షేర్లు అత్యధికంగా 18 శాతానికి పైగా పెరిగి రూ.1,098 స్థాయికి చేరుకున్నాయి. ఈ ర్యాలీతో కంపెనీ షేర్లు ఆల్ టైమ్ గరిష్ఠ స్థాయికి చేరుకున్నాయి. కంపెనీ షేర్లలో ఈ పెరుగుదల పెద్ద ప్రకటనకు కారణం 2024 ఆర్థిక సంవత్సరానికి ప్రతి షేరుపై కంపెనీ రూ.55 ఫైనల్ డివిడెండ్ ప్రకటించటమే. కంపెనీ షేర్లలో ప్రముఖ ఇన్వెస్టర్ డాలీ ఖన్నా 16 లక్షల షేర్లను హోల్డ్ చేస్తూ భారీ పందెం వేశారు.

చెన్నై పెట్రోలియం కార్పొరేషన్ 2023 ఆర్థిక సంవత్సరానికి డబుల్ డివిడెండ్ ప్రకటించింది. 2023 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ రూ.27 డివిడెండ్ ప్రకటించగా.. 2024 ఆర్థిక సంవత్సరానికి రూ.55 ఫైనల్ డివిడెండ్ ప్రకటించింది. చివరి డివిడెండ్పై కంపెనీ రూ.819 కోట్లు ఖర్చు చేస్తుంది. ఇది చెన్నై పెట్రోలియం కార్పొరేషన్ పూర్తి సంవత్సర లాభం రూ.2,711 కోట్లలో 30%గా ఉంది. అయితే ఫైనల్ డివిడెండ్ కోసం కంపెనీ ఇప్పటి వరకు రికార్డు తేదీని ప్రకటించలేదు.
ఇన్వెస్టర్ డాలీ ఖన్నా చెన్నై పెట్రోలియం కార్పొరేషన్ కంపెనీలో 16.18 లక్షల షేర్లు లేదా కంపెనీలో 1.09% వాటా ఉంది. గత ఏడాది కాలంలో చెన్నై పెట్రోలియం కార్పొరేషన్ షేర్లు 310 శాతానికి పైగా పెరిగాయి. కంపెనీ షేర్లు 24 ఏప్రిల్ 2023న రూ.264.55 వద్ద ఉండగా.. 24 ఏప్రిల్ 2024న రూ.1,098కి చేరుకుంది. గడచిన 6 నెలల కాలంలో కంపెనీ షేర్ ధర 105 శాతం పెరుగుదలను అందించింది. ఈ కాలంలో కంపెనీ షేర్లు రూ.534.35 నుంచి రూ.1,100కి చేరాయి.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications