Pakistan Crisis: పాకిస్థాన్ లో పరిస్థితులు దారుణాతిదారుణంగా ఉన్నాయి. అసలు అక్కడి ప్రజలు ఏం తింటున్నారు. ఎలా జీవిస్తున్నారు అనే అనుమానాలు కలుగుతున్నాయి.

ద్రవ్యోల్బణం ఎఫెక్ట్..
ప్రస్తుతం ఆ దేశంలో ద్రవ్యోల్బణం దాదాపు 33 శాతంగా ఉందని గణాంకాలు చెబుతున్నాయి. ఈ క్రమంలోనే పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి పెరిగాయి. కొత్త ధరలు ఫిబ్రవరి 17 నుంచి అమలులోకి వస్తున్నాయి. ప్రస్తుతం పాకిస్థాన్ ఫారెక్స్ రిజర్వ్ దాదాపుగా ఖాళీ అయ్యాయి. దీంతో ఆహార పదార్థాల నుంచి పెట్రోలియం ఉత్పత్తుల వరకు పాకిస్థాన్ దిగుమతులు చేసుకోలేని పరిస్థితి ఏర్పడింది. రేపటి నుంచి లీటరు పెట్రోల్ ధర రూ.272, లీటరు డిజిల్ ధర రూ.196కి చేరుకోగా.. స్పీడ్ డీజిల్ లీటరు ధర రూ.280కి చేరుకుంది. ఇక లీటరు కిరోసిన్ ధర చూస్తే రూ.202.73కి చేరింది.

గ్యాస్ ధరలు..
ప్రజలకు చాలా ముఖ్యమైన గ్యాస్ ధరలు సైతం ఆకాశాన్ని అంటాయి. పైగా గృహ వినియోగదారులకు గ్యాస్ ధరను 112 శాతం పెంచాలని ఎకనామిక్ కోఆర్డినేషన్ కమిటీ నిర్ణయించింది. ఇక కమర్షియల్ సిలిండర్ ధరలను సైతం 29 శాతం మేర పెంచారు. గోధుమ పిండి కిలో రూ.120, బియ్యం కిలో రూ.200, పాలు లీటరు రూ.210, బంగాళదుంప కిలో రూ.70, టమాటా కిలో రూ.130, చికెన్ కిలో రూ.780కి అమ్ముడవుతున్నాయి. ఈ తరుణంలో అప్పుకోసం ఐఎంఎఫ్ షరతులను అంగీకరించేందుకు పాక్ సిద్ధంగా ఉంది.

మూడీస్ నివేదిక..
అయితే పాక్ ఆర్థిక పరిస్థితికి ప్రమాద ఘంటికలు మోగించనుందని గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీ మూడీస్ నివేదించింది. సంక్షోభం నుంచి బయటపడేందుకు పాకిస్థాన్లోని షాబాజ్ షరీఫ్ ప్రభుత్వం అనేక దేశాలకు చేరువైంది. కానీ అన్ని వైపుల నుంచి వారికి నిరాశే ఎదురైంది. 2019లో పాక్ 6 బిలియన్ డాలర్లను IMF నుంచి పొందేందుకు బెయిలవుట్ ప్యాకేజీపై సంతకం చేసింది. ఆ నిధులు ప్రస్తుతం విడుదల కాలేదు. ప్రస్తుత పరిస్థితుల్లో పట్టాలు తప్పిన ఆర్థిక వ్యవస్థను తిరిగి ట్రాక్లోకి తీసుకురావడానికి బెయిలవుట్ నిధులు ఏమాత్రం సరిపోవని మూడీస్ అంచనా వేసింది.

అప్పుల కుప్పలు..
రాబోయే కొన్నేళ్లపాటు దేశాన్ని నడపడానికి నిధులను కూడగట్టుకునే పాకిస్థాన్ సామర్థ్యం కూడా ప్రమాదంలో పడింది. ప్రస్తుతం దాయాది రుణాలు మెుత్తంగా 60 ట్రిలియన్ పాకిస్థాన్ రూపాయల కంటే ఎక్కువకు చేరుకుంది. ఇవి పాక్ జీడీపీలో దాదాపు 89 శాతానికి సమానవైనవి. శ్రీలంక మాదిరిగానే పాకిస్థాన్ అప్పుల్లో సింహభాగం చైనాకు చెల్లించాల్సినవే. ఈ పరిస్థితులను చూసిన చైనా సైతం ఆందోళన చెందుతోంది.

ప్రజలు పారిపోవాల్సిందే..
అప్పుల ఊబిలో కూరుకుపోతున్న పాక్ పరిస్థితి చూస్తుంటే 2022లో శ్రీలంక విషయంలో జరిగిందే కనిపిస్తోందని అందరూ అభిప్రాయపడుతున్నారు. ఈ సంక్షోభ సమయంలో అక్కడి ప్రజలు దేశం వదిలి పారిపోవడం ప్రారంభించారు. పాకిస్థాన్ నుంచి విదేశాలకు వెళ్లే వారి సంఖ్య ఒక్కసారిగా పెరుగుతోంది. 2022లో పాకిస్తాన్లో 8,32,339 మంది దేశం విడిచిపెట్టారు. గణాంకాల ప్రకారం గత ఏడాది పాక్ విడిచి వెళ్లిన పౌరుల సంఖ్య దాదాపు 200% పెరిగింది.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications