Curd: తాజాగా దేశంలో జరిగిన జీఎస్టీ రేట్ల మార్పులో కేంద్ర ప్రభుత్వం పెరుగు, పన్నీర్, లస్సీ వంటి పాల ఉత్పత్తులపై 5 శాతం జీఎస్టీ రేటును అమలులోకి తెచ్చింది. ఈ పెరిగిన రేట్లు జూలై 18 నుంచి దేశవ్యాప్తంగా అమలులోకి వచ్చాయి. దీని అమలులో భాగంగా డెయిరీలు రేట్లను కూడా పెంచాయి. పెరుగు ప్యాకెట్లపై జీఎస్టీ ఐదు శాతం పెరిగినప్పటికీ వాటి రేట్లు మాత్రం 50 శాతం మేర పెరిగిపోయాయి. పెరుగు, పన్నీర్, లస్సీ, హనీ, డ్రై సోయాబీన్, వీట్ వంటి ప్యాక్ చేసిన ఉత్పత్తులపై జీఎస్టీ నిర్ణయం భారంగా మారిందని అనేక మంది అంటున్నారు.

50 శాతం పెరిగిన ధరలు..
ఈ క్రమంలో దేశీయ దిగ్గజ సంస్థ బ్రిటానియాను గమనించినట్లయితే 80 గ్రాముల పెరుగు ప్యాకెట్ ను గతంలో రూ.10కి విక్రయించేది. కానీ ప్రస్తుతం దాని ధరను కంపెనీ ఏకంగా రూ.15కు పెంచేసింది. ఇదే సమయంలో బీహార్ కు చెందిన సుధా కంపెనీ పెరుగు, లస్సీ, మజ్జిగ వంటి పాల ఉత్పత్తుల ధరలను పెంపును ప్రకటించింది. ఇదే సమయంలో ఇతర పాల ఉత్పత్తుల ధరలు సైతం దాదాపుగా 20 శాతం వరకు పెరిగాయి.

ద్రవ్యోల్బణాన్ని పెంచుతున్న వస్తువులు..
అయితే లస్సీ, పెరుగు, పన్నీర్, మజ్జిగ వంటి సామాన్యులు వినియోగించే ఉత్పత్తులపై జీఎస్టీ పెంపు భారంగా మారిందని ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తం చేశాయి. కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించాయి. దీనిపై స్పందించిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ జీఎస్టీ సమావేశంలో అన్ని రాష్ట్రాలు రేటు పెంపుకు అంగీకరించాయని, ఎవ్వరూ వ్యతిరేకించలేదని మంగళవారం రాజ్యసభలో ద్రవ్యోల్బణంపై అడిగిన చర్చకు సమాధానం ఇచ్చారు.

సామాన్యలపై ప్రభావం ఉండదా..?
ప్యాకేజింగ్ చేయని ఆహారంపై జీఎస్టీ వర్తించదు. పాలు, పెరుగు, పనీర్ వంటి ప్యాక్ చేయని ఆహార పదార్థాలపై ఎలాంటి పన్ను వసూలు చేయనందున పేదలు 'జీఎస్టీ' భారాన్ని మోయాల్సిన అవసరం లేదని నిర్మలా సీతారామన్ అన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ శ్రీలంక, బంగ్లాదేశ్ లేదా పాకిస్థాన్ లాగా కుప్పకూలదని ఆమె తెలిపారు. ప్రస్తుతం భారత్ అంతర్జాతీయ సంస్థల నుంచి ఎలాంటి అప్పులు తీసుకోవాల్సిన అవసరం లేదని ఆర్థిక మంత్రి వెల్లడించారు.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..



Click it and Unblock the Notifications