Air India: భారత విమాన రంగంలో కొత్త చరిత్ర సృష్టించేందుకు టాటా గ్రూప్ అవిశ్రాంతంగా పనిచేస్తోంది. తమ మహారాజా ఎయిర్ ఇండియాను తిరిగి కొనుగోలు చేసిన తర్వాత భారీగా ఫ్లీట్ సంఖ్యను పెంచుతోంది.
ఈ క్రమంలోనే ఏవియేషన్ కంపెనీ ఎయిర్ ఇండియా వచ్చే ఆరు నెలల్లో 30కి పైగా కొత్త విమానాలను ప్రవేశపెట్టనుంది. కంపెనీ వారానికి 400 విమానాల సర్వీసులను సైతం జోడించవచ్చు. దేశం వెలుపల నాలుగు కొత్త గమ్యస్థానాలకు విమానాలను ప్రారంభించే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం ఉన్న నెట్వర్క్, ఫ్లీట్ను విస్తరించేందుకు చేస్తున్న ప్రయత్నాల గురించి సమాచారాన్ని అందజేస్తూ టాటా గ్రూప్ ఎయిర్లైన్స్ ఉత్తర అమెరికా, యూరప్, ఆగ్నేయాసియాలో అంతర్జాతీయ విస్తరణకు ప్రణాళికలు వేసినట్లు ప్రకటించింది.

వింటర్ కార్యక్రమంలో భాగంగా మార్చి 2024 నాటికి దేశీయ-అంతర్జాతీయ నెట్వర్క్కు 400 కంటే ఎక్కువ వారపు విమానాలను జోడించాలని భావిస్తున్నట్లు ఎయిర్ ఇండియా తెలిపింది. ఈ ఏడాది శీతాకాలపు షెడ్యూల్ అక్టోబర్ 29 నుంచి వచ్చే ఏడాది మార్చి 30 వరకు అమల్లో ఉంటుంది. రాబోయే ఆరు నెలల్లో ప్రతిపాదిత కొత్త ఎయిర్క్రాఫ్ట్ ఇండక్షన్ ఆధారంగా, ఎయిర్ ఇండియా అనేక దేశీయ మార్గాల్లో 200 వారానికి పైగా విమానాలను, అంతర్జాతీయ నెట్వర్క్లో 200 వారానికి పైగా విమానాలను జోడించాలని లక్ష్యంగా పెట్టుకుంది. వీటిలో 80కి పైగా వారపు విమానాలు ఇప్పటికే సర్వీసులను అందిస్తున్నాయి.
ఇప్పటి నుంచి మార్చి 2024 మధ్య కాలంలో ఎయిర్ ఇండియా 30 కంటే ఎక్కువ వైడ్-బాడీ, నారో బాడీ విమానాలను తన ఫ్లీట్లో చేర్చుకోవాలని భావిస్తున్నట్లు ఎయిర్ ఇండియా తెలిపింది. ఈ క్రమంలో ఆరు A350లు, నాలుగు B777లు, 20 A320neo విమానాలు ఉండనున్నాయి. అలాగే ఎయిర్ ఇండియా ఈ ఏడాది ఎయిర్ బస్, బోయింగ్ నుంచి 470 కొత్త విమానాలను ఆర్డర్ చేసింది.


Click it and Unblock the Notifications