For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

covid 19: అమెరికా స్టాక్ మార్కెట్ల మూసివేతపై తర్జన, బంగారం ధర ఎలా ఉంటుంది?

|

కరోనా మహమ్మారి నుండి ఆర్థిక వ్యవస్థను కాపాడుకునేందుకు ఫెడరల్ రిజర్వ్, అమెరికన్ కాంగ్రెస్ భారీ చర్యలు చేపట్టింది. దీంతో గత వారం అమెరికా మార్కెట్లు కాస్త పుంజుకున్నప్పటికీ వారం చివరలో నష్టపోయాయి. గత కొద్ది రోజులుగా కరోనా కారణంగా అమెరికాలో వందలాది మంది మృత్యువాత పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ ప్రభావం మార్కెట్లపై ఈ వారం ఉంటుందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

కరోనా ఎఫెక్ట్: క్లిష్ట పరిస్థితి... వారికి ఈసారి 3 రెట్ల వేతనంకరోనా ఎఫెక్ట్: క్లిష్ట పరిస్థితి... వారికి ఈసారి 3 రెట్ల వేతనం

అమెరికా స్టాక్ మార్కెట్లు తెరిచేందుకే ట్రంప్

అమెరికా స్టాక్ మార్కెట్లు తెరిచేందుకే ట్రంప్

అమెరికాలో స్టాక్ మార్కెట్ల మూసివేత అంశంపై కూడా చర్చ జరిగింది. అయితే ఇది ఇన్వెస్టర్లకు ఆందోళనలు కలిగిస్తుందని ఫైనాన్షియల్ ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు. అమ్మకాలు భారీగా పెరుగుతున్నందున మార్కెట్లు క్లోజ్ చేయాలని పలువురు రాజకీయ నాయకులు, కామెంటేటర్స్ సూచించారు. తద్వారా ఇన్వెస్టర్లకు తాత్కాలిక ఊరటను ఇవ్వవచ్చునని తెలిపారు. కానీ ట్రంప్ ప్రభుత్వం మాత్రం మార్కెట్లు తెరిచి ఉంచాలని నిర్ణయించింది. ఫిబ్రవరి మధ్య నుండి ఎస్ అండ్ పీ 500 ఏకంగా 25 శాతం మేర పడిపోయింది. మార్చిలో ప్రతి ఇండెక్స్ దాదాపు ప్రతి రోజు 5.2 శాతం మేర పడిపోయింది.

నిఫ్టీ అంచనా

నిఫ్టీ అంచనా

గత వారంలో భారత మార్కెట్లకు స్వల్ప ఊరట దక్కింది. కానీ అంతర్జాతీయ వ్యాప్తంగా కరోనా మృతులు పెరుగుతుండటం, దేశంలోను కేసుల సంఖ్య పెరుగుతుండటంతో మార్కెట్లపై ప్రభావం ఉంటుందని భావిస్తున్నారు. నిఫ్టీ గత వారం 1500 పాయింట్ల మేర రికవరీ సాధించింది. స్వల్పకాలిక అప్ ట్రెండ్ నిలబెట్టుకోవడానికి 8500 వద్ద క్లోజ్ కావాలని నిపుణులు చెబుతున్నారు. 8500 వద్ద విఫలమైతే మరింత డౌన్ ట్రెండ్ ఉండవచ్చునని అంచనా వేస్తున్నారు. మద్దతు స్థాయి 8300 వద్ద నిలదొక్కుకోవాలని, అక్కడ కూడా విఫలమైతే ప్రమాదమేనని అంటున్నారు. మొత్తంగా ఈ వారం నిఫ్టీ 8160 నుండి 9300 మధ్య కదలాడవచ్చునని భావిస్తున్నారు.

బంగారం, వెండి

బంగారం, వెండి

పసిడి శుద్ధి కర్మాగారాలను తాత్కాలికంగా మూసివేశారు. పెట్టుబడులు మాత్రం కొనసాగవచ్చు. బంగారం కాంట్రాక్టుకు రూ.44,800 నుండి రూ.45,540 మధ్య నిరోధం ఎదురుకావొచ్చునని, రూ.38,665 వద్ద స్టాఫ్‌లాస్‌గా పెట్టుకొని ట్రేడింగ్ చేయాలని అంటున్నారు. వెండి కూడా రూ.38,300 కిందకు వస్తే కిలో రూ.37,000కు పడిపోయే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు.

చమురు ధరలు..

చమురు ధరలు..

అంతర్జాతీయస్థాయిలో చమురుకు డిమాండ్ తగ్గింది. మరోవైపు పోటీ నెలకొంది. దీంతో ఏప్రిల్ కాంట్రాక్టు బలహీనంగా ఉండవచ్చునని భావిస్తున్నారు. రష్యా, సౌదీ మధ్య ఒప్పందం కుదిరితే మాత్రం పెరగవచ్చునని భావిస్తున్నారు. సహజవాయువు పరిస్థితి ఇలాగే ఉంటుంది.

English summary

covid 19: అమెరికా స్టాక్ మార్కెట్ల మూసివేతపై తర్జన, బంగారం ధర ఎలా ఉంటుంది? | Coronavirus fears could send the S&P 500 swooning again

Closing stock market could trigger events harmful to investors, financial executives and academics say.
Story first published: Monday, March 30, 2020, 9:51 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X