ముంబై: కరోనా మహమ్మారి కారణంగా బ్యాంకు ఉద్యోగులు, సాఫ్టువేర్ రంగ నిపుణులు.. ఇలా ఎన్నో రంగాల ఉద్యోగులు ఇంటి నుండి పని చేస్తున్నారు. ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో కంపెనీలు కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చాయి. కేంద్ర ప్రభుత్వం కూడా కంపెనీలకు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. కమోడిటీ ఎక్స్చేంజ్, ఎంసీఎక్స్ కూడా కొంతమందికి ఇంటి నుండి పనిచేసే వెసులుబాటు ఇచ్చింది. కొంతమంది ఉద్యోగులు ఆఫీస్ నుండి పని చేస్తున్నారు.

50 మంది ఉద్యోగులు ఆఫీస్లోనే..
కమోడిటీ ఎక్స్చేంజ్, ఎమ్సీఎక్స్ కార్యాలయాల నుంచి విధులు నిర్వర్తించే ఉద్యోగులకు మూడు రెట్ల వేతనం చెల్లించనుంది. ఎమ్సీఎక్స్లో దేశవ్యాప్తంగా 400 మంది పని చేస్తున్నారు. ఒక్క ముంబైలోనే 300 ఉద్యోగులు ఉన్నారు. గత శుక్రవారం నుంచి 50 మంది కీలక ఉద్యోగులు ఆఫీసులోనే ఉంటూ విధులు నిర్వహిస్తున్నట్లు ఎమ్సీఎక్స్ తెలిపింది.

రెట్టింపు, మూడు రెట్ల వేతనాలు
ఆఫీస్లోనే ఉండి పని చేస్తున్న వారికి కావాల్సిన రోజువారీ అవసరాలను సమకూరుస్తున్నామని, ఎక్స్చేంజ్ భవనంలో బస సౌకర్యాలు కల్పిస్తున్నామని ఎంసీఎక్స్ తెలిపింది. ఇంత రిస్క్ తీసుకుంటున్నందుకు వారికి రెట్టింపు జీతం ఇవ్వాలని నిర్ణయించామని తెలిపింది. కొంతమందికి మూడు రెట్లు కూడా ఇవ్వనున్నట్లు చెప్పింది.

1.5 రెట్ల నుండి 3 రెట్ల వేతనాలు
కొవిడ్ మహమ్మారి వంటి క్లిష్ట పరిస్థితుల్లో వారు కార్యాలయంలోనే ఉండి పని చేస్తున్నారని, వారిలో ధైర్యాన్ని పెంచేందుకు, ప్రోత్సాహకం లేదా రివార్డ్ ఇచ్చేందుకు నామినేషన్ అండ్ రెమ్యునరేషన్ కమిటీ ఆమోదించినట్లు తెలిపింది. ఉద్యోగులు వరుసగా వారం రోజులు పని చేసిన వారి నుండి మొదలు బ్రేక్ లేకుండా పని చేసే వారి వరకు వరుసగా 1.5 రెట్ల నుండి 3 రెట్ల వేతనాలు ఇస్తామని తెలిపింది.
More From GoodReturns

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధర పెరిగింది .. కొనుగోలు వెంటనే బంద్ చేయండి.. మార్చి 10, మంగళవారం ధరలు ఇవే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

బంగారం ధరల పెరుగుదలపై షాకింగ్ న్యూస్.. సంచలన విషయాలను వెల్లడించిన SBI రీసెర్చ్..

Gold price: బంగారం, వెండి ధరల్లో మార్పు.. కారణాలివే..

యుద్ధాన్ని వదిలి బంగారంపై కన్నేసిన చైనా.. టన్నుల కొద్ది పసిడి రహస్యంగా కొనుగోలు.. ధరల పెరుగదలపై ఆందోళన..

బంగారం ధరలు: క్రూడ్ ఆయిల్ పతనం తర్వాత బంగారం, వెండి ధరలు ఇలా..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారం, వెండి ధరలు: ఇరాన్ వార్ కారణంగా భారత్లో భారీగా పెరిగిన ధరలు - కారణాలు, ప్రభావాలు



Click it and Unblock the Notifications