FDI: ఒక దేశ ఆర్థికాభివృద్ధిలో విదేశీ పెట్టుబడుల ప్రాముఖ్యత ఎంతో ఉంటుంది. వివిధ దేశాల నుంచి ఇండియాలోకి భారీగా FDIలు తరలి వస్తుంటాయి. గత ఏడాది మేలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)తో మనదేశం సమగ్ర స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని అమలు చేసింది. తద్వారా 2022-23 మధ్యకాలంలో ఇండియాలో నాల్గవ అతిపెద్ద పెట్టుబడిదారుగా ఆదేశం ఉద్భవించింది.
గత ఆర్థిక సంవత్సరంలో UAE నుంచి ఇండియాకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (FDI) మూడు రెట్లు పెరిగాయి. 2021-22లో 1.03 బిలియన్లుగా ఉన్న ఈ మొత్తం 3.35 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయని పరిశ్రమ మరియు అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక విభాగం (DPIIT) డేటా చెబుతోంది. 2021-22లో ఏడవ స్థానంలో ఉన్న UAE.. 2022-23లో నాల్గవ స్థానానికి చేరినట్లు తెలిపింది.

FY23లో 17.2 బిలియన్ల పెట్టుబడితో భారతదేశంలో సింగపూర్ అతిపెద్ద పెట్టుబడిదారుగా ఉంది. మారిషస్ 6.1 బిలియన్ డాలర్లతో మరియు US 6 బిలియన్ డాలర్లతో తర్వాతి స్థానాల్లో నిలిచాయి. మన దేశంలో UAE పెట్టుబడులు ప్రధానంగా సేవలు, సముద్ర రవాణా, విద్యుత్ మరియు నిర్మాణ రంగాల్లో ఉన్నాయి.
"ఇండియా మరియు UAE మధ్య ద్వైపాక్షిక సంబంధాలు, పెట్టుబడి సహకారం వేగంగా బలోపేతం కావడానికి పలు విధాన సంస్కరణలు కారణమని చెప్పవచ్చు" అని శార్దూల్ అమర్చంద్ మంగళదాస్ & కో భాగస్వామి రుద్ర కుమార్ పాండే అభిప్రాయపడ్డారు. మే 1, 2022 నుంచి అమలులోకి వచ్చిన సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం (CEPA)పై ఇరు దేశాలు సంతకం చేయడం ఇందుకు ప్రధాన కారణంగా తెలిపారు.
More From GoodReturns

వెండి ధరలు బిగ్ క్రాష్.. దెబ్బకు నిలిచిపోయిన ట్రేడింగ్.. లబోదిబోమంటున్న పెట్టుబడిదారులు

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..



Click it and Unblock the Notifications