Laptop Imports: ల్యాప్టాప్ దిగుమతులపై ఇటీవల భారత ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఇది అనేక దిగ్గజ హార్డ్ వేర్ తయారీ సంస్థలకు నిద్రలేకుండా చేస్తోంది. భారత్ లాంటి అతిపెద్ద మార్కెట్ నుంచి ప్రతికూల పవనాలు రావటంతో లాబియింగ్ మెుదలుపెట్టాయి.
యాపిల్, ఇంటెల్, గూగుల్, లెనోవా, డెల్, హెచ్పితో సహా ప్రధాన టెక్ కంపెనీలు ఐటీ హార్డ్వేర్ దిగుమతులపై భారత్ తీసుకున్న నిర్ణయంతో ఆందోళన చెందుతున్నాయి. ఈ క్రమంలో కొత్త విధానాన్ని సవాలు చేయాలని అమెరికా ప్రభుత్వానికి పిలుపునిచ్చాయి. తమ వ్యాపారాలు దెబ్బతింటాయని గ్రహించి.. ల్యాప్టాప్ దిగుమతులపై పునరాలోచనకు భారతదేశాన్ని పురికొల్పాలని యూఎస్ను కోరుతున్నాయి.

టెక్ సంస్థలు, ఎనిమిది US ఆధారిత వాణిజ్య సంస్థలతో పాటు, ఈ లైసెన్సింగ్ చర్యల కారణంగా వాణిజ్య భాగస్వామిగా భారత విశ్వసనీయత గురించి ఆందోళన వ్యక్తం చేశాయి. ఈ చర్యలు ప్రపంచ సరఫరా గొలుసుల్లో వాణిజ్, ఏకీకరణకు గణనీయంగా అంతరాయం కలిగిస్తుందని వారు చెబుతున్నారు. ఈ క్రమంలో పరిమితులను మార్చడానికి లాబీ చేసేందుకు అందుబాటులో ఉన్న ప్రతి ఫోరమ్ను ఉపయోగించమని అమెరికా ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
పరిశ్రమ పుష్బ్యాక్ను అనుసరించి.. భారత ప్రభుత్వం లైసెన్సింగ్ అవసరాల కోసం గడువును నవంబర్ 1 వరకు పొడిగించింది. అయితే తయారీ ప్రక్రియలను స్థాపించడానికి మరింత సమయం అవసరమని పేర్కొంటూ కంపెనీలు 9-12 నెలల పొడిగింపును కోరుతున్నాయి. కొత్త లైసెన్సింగ్ నిబంధనల ప్రకారం మినహాయింపుల పరిధిపై మరింత స్పష్టతను అభ్యర్థించాయి. ఈ చర్యలు డేటా సెంటర్ పెట్టుబడులకు హాని కరిగించవచ్చని వాణిజ్య సంస్థలు హెచ్చరించాయి.
తాజాగా తెస్తున్న చర్య లైసెన్స్ రాజ్కు తిరిగి రావడం గురించి కాదని, టెక్ ఎకోసిస్టమ్ విశ్వసనీయ మూలాల నుంచి వచ్చే హార్డ్వేర్ను ఉపయోగిస్తుందని నిర్ధారించడానికి "మరింత దిగుమతి నిర్వహణ వ్యవస్థ" అని కేంద్ర ఐటీ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ స్పష్టం చేశారు. అలాగే దేశీయంగా తయారీని పెంచే విధానంలో భాగమని ఆయన అన్నారు. ఊహాగానాల ప్రకారం రానున్న కాలంలో ల్యాప్టాప్ల తర్వాత.. కెమెరాలు, ప్రింటర్లు కూడా దిగుమతి అడ్డంకులను ఎదుర్కోవచ్చని ఆందోళనలు ఉన్నాయి.


Click it and Unblock the Notifications