ఆర్థిక మాంద్యం భయాలతో ప్రపంచంలోని దిగ్గజ కంపెనీలు తమ ఖర్చును తగ్గించుకుంటున్నాయి. అందులో భాగంగా ఉద్యోగులను తొలగిస్తున్నాయి. అయితే ఇలాంటి పరిస్థితుల్లో కూడా భారతీయ ఐటీ సేవల రంగం రాణిస్తునే ఉంది. పైగా భారత ఐటీ కంపెనీలు ఎక్కువగా ఉద్యోగులను తొలగించలేదు. ఇటీవల అమెరికా, యూరప్లలో బ్యాంకుల పతనం భారత ఐటీ రంగాన్ని అనేక రకాలుగా ప్రభావితం చేసే అవకాశం ఉంది.

అమెరికా, యూరప్
భారతదేశ IT సేవా పరిశ్రమలో అధిక భాగం ఆదాయం, వ్యాపారం BFSI విభాగం నుంచి వచ్చినప్పటికీ, అమెరికా, యూరప్ వంటి అగ్రరాజ్యం దేశాలలో బ్యాంకులు దివాలా తీయడమే కాకుండా, పెద్ద బ్యాంకులు లిక్విడిటీ సమస్యలను ఎదుర్కొంటున్నాయి. ఈ పరిస్థితిలో భారతీయ ఐటీ సేవల పరిశ్రమలోని బీపీఎం అంటే ఐటీ బిజినెస్ ప్రాసెస్ మేనేజ్మెంట్ రంగం ప్రస్తుతం పెద్ద సంక్షోభాన్ని ఎదుర్కొవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.

బ్యాకింగ్
భారతీయ ఐటీ బిజినెస్ ప్రాసెస్ మేనేజ్మెంట్ పరిశ్రమ $245 బిలియన్ల కాగా ఇందులో దాదాపు 41 శాతం బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్ (BFSI) రంగంపైనే ఆధారపడి ఉంది. ఇప్పుడు అమెరికా, యూరప్లలో బ్యాంకుల పతనం భారతీయ ఐటీ రంగాన్ని అనేక విధాలుగా ప్రభావితం చేసే అవకాశం ఉంది. US, యూరోప్లలో బ్యాంకుల పతనం కారణంగా భారతీయ IT BPM కంపెనీలు తమ ప్రస్తుత వ్యాపారాన్ని కోల్పోతాయి.

టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో
భారతీయ IT BPM కంపెనీలు తాత్కాలికంగా మాత్రమే కాకుండా దీర్ఘకాలిక ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఒకవేళ భారతీయ కంపెనీలపై ఈ ప్రభావం పడితే లేఆఫ్ లు తప్పకపోవచ్చని నిపుణులు చెబుతున్నారు. భారత ఐటీ బీపీఎం సెక్టార్లో టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, ఎల్టీఐమైండ్ట్రీలు యూఎస్ మార్కెట్లో మంచి వాటాను కలిగి ఉన్నాయి. అక్కడి బ్యాంకులు సమస్యలు ఎదుర్కొడం వల్ల ఈ కంపెనీలపై ప్రభావం పడే అవకాశం ఉంది.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..



Click it and Unblock the Notifications