Layoffs: వేతన జీవులకు ఈ ఏడాది అంతగా కలిసిరాలేదనే చెప్పాలి. ఆర్థిక మందగమనం దృష్ట్యా పలు దిగ్గజ కంపెనీలు ఉద్యోగుల సంఖ్యలో కోత విధించాయి. కొవిడ్ మహమ్మారితో మొదలైన లేఆఫ్ లు నిరంతరాయంగా కొనసాగుతూనే ఉన్నాయి. ప్రముఖ షూ మాన్యుఫ్యాక్చరర్ తాజాగా 6 వేల మంది సిబ్బందిని తొలగిస్తున్నట్లు ప్రకటించింది.
తైవాన్ బేస్డ్ పౌ చెన్ గ్రూపునకు చెందిన పౌయెన్ వియత్నాం తన ఉద్యోగుల్లో 6 వేల మందికి ఉద్వాసన పలకనున్నట్లు స్థానిక అధికారులకు తెలియజేసింది. వచ్చే నెల చివరికి ఈ ప్రక్రియ పూర్తిచేయనున్నట్లు వెల్లడించింది. నైక్, అడిడాస్ వంటి ప్రముఖ బ్రాండ్లకు ఈ సంస్థ షూ తయారీదారుగా వ్యవహిరిస్తోంది. ఆర్డర్ల మందగమనమే దీనికి కారణమని పేర్కొంది.

దుస్తులు, పాదరక్షలు మరియు ఫర్నిచర్ ఎగుమతి చేసే దేశాలలో వియత్నాం అతిపెద్దది. కానీ యూరప్, USలో వ్యయ సంక్షోభం కారణంగా వినియోగదారుల కొనుగోలు శక్తి తగ్గిపోయింది. తద్వారా ఈ పరిశ్రమ తీవ్రంగా ప్రభావితమైంది. 1996లో హె చి మిన్ సిటీలో పౌయెన్ కార్యకలాపాలు ప్రారంభించినప్పటి నుంచి ఇదే అతిపెద్ద తొలగింపు కావడం గమనార్హం. కార్మిక మంత్రిత్వ శాఖ లెక్కల ప్రకారం గతేడాది వియత్నాంలో 6 లక్షల 30 వేల కార్మికులు ఉద్యోగాలను కోల్పోవడం లేదా పని గంటలు తగ్గించడం జరిగింది.

ఈ సంస్థకు వియత్నాం వాణిజ్య రాజధానిలో 50 వేల మంది కార్మికులు ఉన్నట్లు అంచనా. తద్వారా అక్కడ అతిపెద్ద యాజమాన్య సంస్థగా ప్రసిద్ధి చెందింది. కానీ ఫిబ్రవరిలో దాదాపు 3 వేల మంది శాశ్వత సిబ్బందిని తొలగించింది. మరో 3 వేల మంది తాత్కాలిక ఉద్యోగుల ఒప్పందాలను పునరుద్ధరించలేదు. ఆర్థిక మందగమనం ముఖ్యంగా షూస్, దుస్తులు, నిర్మాణ మరియు ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమలపై ప్రభావం చూపిందని అక్కడి అధికారులు భావిస్తున్నారు.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications