టైలర్ కొడుకు దుమ్ములేపాడు..19 లక్షల ప్యాకేజీ.ఏంటో చూడండి.
పుట్టింది పేదరికంలో తండ్రి ఓ సాధారణ టైలర్ బట్టలు కుడితేగానీ పూట గడవదు. కుటుంబ సంవత్సరాదాయం కేవలం రూ.50వేలు.
జస్టిన్ ఫెర్నాండెజ్
ఆ సరస్వతీ పుత్రుడి చదువు ముందు పేదరికం చిన్నబోయింది. ఓ ప్రభుత్వ కాలేజీలో స్కాలర్షి్పతో బీటెక్ చేసి ఐఐఎం-నాగ్పూర్లో ఎంబీఏ చేస్తూ కాలేజీ చరిత్రలోనే అత్యధికంగా రూ.19లక్షల ప్యాకేజీని సొంతం చేసుకున్నాడు కేరళకు చెందిన జస్టిన్ ఫెర్నాండెజ్(27).
ఐఐఎంలో సీటు
బీటెక్ పూర్తయ్యాక ఫెర్నాండెజ్ ఓ కంపెనీలో ఉద్యోగం చేస్తూనే ఎంబీఏ కోసం ప్రిపేర్ అయ్యాడు. ఐఐఎంలో సీటు దక్కగానే ఉద్యోగం మానేసి కాలేజీలో చేరిపోయాడు. మిగతా విద్యార్థుల కంటే అత్యుత్తమ ప్రతిభా పాటవాలు ప్రదర్శించేవాడు
వాల్యూ ల్యాబ్స్
అతడి ప్రతిభకు మెచ్చిన హైదరాబాద్కు చెందిన వాల్యూ ల్యాబ్స్.ఏకంగా అసోసియేట్ డైరెక్టర్ పదవిని ఆఫర్ చేస్తూ భారీ ప్యాకేజీ అందింజేందుకు ముందుకొచ్చింది. ఇంత భారీ ప్యాకేజీ, పెద్ద పదవి ఫెర్నాండెజ్కు దక్కడం కాలేజీ చరిత్రలోనే తొలిసారి.