Bonus: ప్రపంచం ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న తరుణంలో చాలా కంపెనీలు తమ ఉద్యోగులకు కనీసం జీతాలు చెల్లించలేని స్థితిలో ఉన్నాయి. మరికొన్ని కంపెనీలు ఉద్యోగులను ఎడాపెడా తొలగిస్తున్నాయి. కానీ ఇవన్నీ మాత్రం ఒక కంపెనీకి వర్తించవు. అవును ఇలాంటి కఠిన సమయంలో కంపెనీ తన ఉద్యోగులపై బోనస్ రూపంలో డబ్బుల వర్షం కురిపించింది.

కంపెనీ వివరాలు..
ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నది తైవాన్లోని అత్యంత ప్రసిద్ధ కార్గో షిప్పింగ్ కంపెనీ ఎవర్గ్రీన్ మెరైన్ గురించి. ఈ షిప్పింగ్ కంపెనీ 2022లో రికార్డ్ స్థాయిలో లాభాన్ని నమోదు చేసింది. అయితే ఈ లాభాలను తన ఉద్యోగులకు సైతం పంచాలని కంపెనీ యాజమాన్యం నిర్ణయించింది. అందుకే వారు కలలో కూడా ఊహించని విధంగా బోనస్ ను ప్రకటించింది.

బోనస్..
చాలా కంపెనీలు సాధారణంగా రోజుల జీతాన్ని బోనస్ రూపంలో అందిస్తుంటాయి. మరికొన్ని చోట్ల గరిష్ఠంగా ఒక నెల జీతాన్ని బోనస్ రూపంలో ఇవ్వటం మనం చూస్తుంటాం. కానీ ఎవర్గ్రీన్ మెరైన్ మాత్రం తన ఉద్యోగులకు ఒక్కొక్కరికి 10 నుంచి 52 వారాల జీతాన్ని బోనస్ రూపంలో చెల్లిస్తోంది. కంపెనీలో ఒక జూనియర్ ఉద్యోగి నెల జీతం NT$40,000గా ఉంటే అతను NT$2 మిలియన్లను బోనస్ రూపంలో అందుకుని ఇంటికి తీసుకెళ్లాడు.

డబ్బులు కుమ్మరిస్తూ..
2021లో ఎవర్గ్రీన్ మెరైన్ తన ఉద్యోగులందరికీ 40 నెలల జీతాన్ని బోనస్ రూపంలో అందించింది. ఇదిలా ఉండగా 2022లో తన పాత రికార్డును తానే బద్దలుకొడుతూ ఏకంగా 52 నెలల పేఅవుట్ను ప్రకటించి ఉద్యోగులందరినీ ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురిచేసింది కంపెనీ. ప్రస్తుతం ఇది తైవాన్కు చెందిన ఎవర్గ్రీన్ మెరైన్ చెల్లించిన అతిపెద్ద బోనస్. ఇది ఎవర్గ్రీన్ మెరైన్ మేనేజ్మెంట్ సాధించిన విజయంగా పరిగణించబడుతోంది.

కరోనా సమయంలో..
కరోనా మహమ్మారి సమయంలో ప్రపంచ దేశాల మధ్య రాకపోకలు ప్రత్యక్షంగా నిలిచిపోయిన తరుణంలో లాక్డౌన్ కారణంగా ఎవర్గ్రీన్ మెరైన్ కంపెనీ వ్యాపారం బాగా ప్రభావితమైంది. అయితే 2022లో అంతర్జాతీయ మార్కెట్లో కొన్ని ప్రధాన సమస్యలు ఉన్నప్పటికీ ఎగుమతులు, దిగుమతులు బాగానే కొనసాగాయి.

మెగా లాభం..
కంపెనీ 2022 మెుదటి మూడు త్రైమాసికాల్లో దాదాపుగా NT$304.35 బిలియన్ల నికర లాభాన్ని నమోదు చేసింది. షిప్పింగ్ రేట్ల పెరుగుదల, పుంజుకున్న వ్యాపారాల కారణంగా కంపెనీ రికార్డు లాభాలను ఆర్జించింది. షిప్పింగ్ విభాగంలోని ఉద్యోగులకు రికార్డు బోనస్ అందించినప్పటికీ.. ముఖ్యంగా ఎయిర్లైన్ వ్యాపార విభాగంలో ఉన్నవారు చాలా తక్కువ బోనస్ మొత్తాలను అందుకున్నట్లు వెల్లడైంది. గ్రౌండ్ స్టాప్ ఆల్ అవుట్ స్ట్రైక్లో పాల్గొన్నప్పుడు న్యూ ఇయర్ వారంలో తైపీ నగరంలోని టాయోవాన్ విమానాశ్రయంలో 4,000 మంది ప్రయాణికులు ప్రభావితమయ్యారు.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!



Click it and Unblock the Notifications