స్టుపిడ్ ట్రేడ్: మరోసారి భారత్ టారిఫ్పై డొనాల్డ్ ట్రంప్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల పలుమార్లు భారత్ విధించే పన్నుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా, శనివారం లాస్వెగాస్లో జరిగిన రిపబ్లికన్ జెవిష్ కొలిషన్లో ఆయన మాట్లాడారు. ఆమెరికాకు చెందిన చాలా వస్తువులపై భారత్ వంద శాతం టారిఫ్ విధిస్తోందన్నారు. అదే సమయంలో అమెరికా అలాంటి వస్తువులపై అలా పన్ను విధించడం లేదని చెప్పారు. ఈ స్టుపిడ్ ట్రేడ్ పైన వర్కవుట్ చేయాలని తన అడ్మినిస్ట్రేషన్కు సూచించారు.
పిక్సెల్ 3 లైట్ను పొరపాటున కన్ఫర్మ్ చేసిన గూగుల్, తొలగింపు
మనపై ఎక్కువ పన్ను విధించే ప్రత్యేక దేశం భారత్ అని, వాట్ ఏ గ్రేట్ కంట్రీ, గ్రేట్ ఫ్రెండ్.. ప్రధాని మోడీ.. మనపై ఎన్నో వస్తువులపై 100 శాతం విధిస్తున్నారని ట్రంప్ పేర్కొన్నారు. అదే సమయంలో ఈ ట్యాక్స్ పైన వర్కవుట్ చేయాలని సూచించారు. భారత్ ట్యాక్స్ క్రేజీ థింగ్ అని, స్టుపిడ్ ట్రేడ్ అని, మనకు ఇలాంటి స్టుపిడ్ ట్రేడ్ చాలా ఉందన్నారు.
ఇది స్టుపిడ్ ట్రేడ్ అని, అది సరైన వ్యాపారం కాదని ట్రంప్ అన్నాడు. అలాగే అమెరికాతో ప్రధాని నరేంద్ర మోడీ బ్యాలెన్స్ లేని వ్యాపారం చేస్తున్నారని అభిప్రాయపడ్డారు.
అమెరికాకు చెందిన వస్తువులపై భారత్ ఎక్కువ టారిఫ్ విధిస్తుందని, భారత్ టారిఫ్ కింగ్ అని గతంలోను ట్రంప్ ఎద్దేవా చేశారు. ప్రపంచంలోనే ఎక్కువ పన్ను విధించే దేశాల్లో భారత్ ఒకటి అన్నాడు.