పశ్చిమాసియాలో నెలకొన్న తీవ్రమైన ఉద్రిక్తతల నేపథ్యంలో.. ఇంధన సరఫరాలో అంతరాయం ఏర్పడితే భారతదేశం అవసరాలను నెరవేర్చేందుకు తాము సిద్ధంగా ఉన్నామని Russia దౌత్య వర్గాలు స్పష్టం చేశాయి. గల్ఫ్ ప్రాంతంలో కొనసాగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ప్రపంచ చమురు ప్రవాహాలపై ప్రభావం చూపే అవకాశం ఉండటంతో.. మాస్కో భారత్కు నిరంతర ఇంధన సరఫరాలను హామీ ఇస్తూ బ్యాకప్ ఏర్పాట్లను కూడా అందించేందుకు ముందుకొచ్చినట్లు వర్గాలు తెలిపాయి.
ప్రస్తుత సరఫరా మార్గాలు దీర్ఘకాలికంగా ప్రభావితమైతే జోక్యం చేసుకునేందుకు తాము సిద్ధంగా ఉన్నామని రష్యా స్పష్టంగా సంకేతాలు ఇచ్చినట్లు దౌత్య వర్గాలు వెల్లడించాయి. దేశీయ ఇంధన అవసరాలను తీర్చుకోవడానికి దిగుమతులపై అధికంగా ఆధారపడే Indiaకు చమురు, వాయు సరఫరాల్లో ఎలాంటి అంతరాయం రాకుండా చూడడమే ఈ ఆఫర్ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.

భారతదేశం దిగుమతి చేసుకునే ముడి చమురు, ద్రవీకృత పెట్రోలియం వాయువు (LPG)లో దాదాపు సగం వరకు Strait of Hormuz ద్వారా రవాణా అవుతాయి. ఇది ప్రపంచంలోని అత్యంత కీలకమైన ఇంధన చోక్పాయింట్లలో ఒకటి. ఇరాన్ లక్ష్యాలపై అమెరికా, ఇజ్రాయెల్ దాడుల అనంతరం ఈ జలసంధి ప్రాంతంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. జలసంధికి దూరంగా నౌకలు ప్రయాణించాలని ఇరాన్ హెచ్చరించడంతో పాటు.. బీమా సంస్థలు కవరేజీని ఉపసంహరించుకుంటున్నాయన్న వార్తలు కూడా వెలువడ్డాయి. దీని ప్రభావంగా ట్యాంకర్ కదలికలు గణనీయంగా తగ్గినట్లు సమాచారం.
ఈ పరిణామాల నేపథ్యంలో.. భారత ప్రభుత్వం పరిస్థితిని రోజువారీ, గంటవారీ ప్రాతిపదికన పర్యవేక్షిస్తున్నట్లు చమురు మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులు తెలిపారు. ప్రస్తుత సంక్షోభం ఒక వారం నుంచి 10 రోజుల వరకు కొనసాగవచ్చన్న అంచనాలు ఉన్నప్పటికీ..దీనిని సమర్థవంతంగా నిర్వహించగలమన్న విశ్వాసాన్ని ప్రభుత్వం వ్యక్తం చేస్తోందని పిటిఐ నివేదించింది.
ప్రస్తుతం భారతదేశంలో సుమారు 25 రోజులకు సరిపడా ముడి చమురు నిల్వలు, అదే స్థాయిలో ఇంధన నిల్వలు ఉన్నాయని అధికారులు తెలిపారు. అదనంగా, మంగళూరు, పాదూర్, విశాఖపట్నంలో ఉన్న వ్యూహాత్మక పెట్రోలియం నిల్వలు, అలాగే వాణిజ్య నిల్వలు కలిపి మొత్తం ముడి చమురు నిల్వలు దాదాపు 100 మిలియన్ బ్యారెళ్లకు చేరుకున్నాయి. ఇవి కలిపి చూస్తే.. ఎలాంటి అంతరాయం ఏర్పడినా సుమారు 40 నుంచి 45 రోజుల దిగుమతులను కవర్ చేయగల సామర్థ్యం భారత్కు ఉందని అంచనా.
ఈ అంశంపై చమురు శాఖ మంత్రి Hardeep Singh Puri మీడియాతో మాట్లాడుతూ.. దేశం ముడి చమురు మాత్రమే కాకుండా పెట్రోల్, డీజిల్, ఎటిఎఫ్ వంటి కీలకమైన పెట్రోలియం ఉత్పత్తుల విషయంలో కూడా పూర్తిగా సిద్ధంగా ఉందని తెలిపారు. మధ్యప్రాచ్య పరిణామాల వల్ల ఏర్పడే స్వల్పకాలిక అంతరాయాలను ఎదుర్కొనేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు ఉన్నాయని చమురు మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
దేశవ్యాప్తంగా పెట్రోలియం ఉత్పత్తుల సరఫరా, నిల్వల పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించేందుకు 24×7 కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేసినట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇదిలా ఉండగా, సంక్షోభం మొదలైనప్పటి నుంచి బ్రెంట్ ముడి చమురు ధర బ్యారెల్కు 80 డాలర్లకు పైగా చేరి దాదాపు 10 శాతం వరకు పెరిగింది. ఇది అంతర్జాతీయ మార్కెట్లలో ఉన్న ఆందోళనలను ప్రతిబింబిస్తోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
More From GoodReturns

చమురు సంక్షోభం వేళ గుడ్ న్యూస్: మంగళూరు తీరానికి చేరుకున్న రష్యన్ క్రూడ్ ట్యాంకర్..

చమురు సంక్షోభంలో స్నేహితుడికి అండగా రష్యా.. భారత రిఫైనరీ కంపెనీలకు 6 కోట్ల బ్యారెళ్ల ముడి చమురు సరఫరా

వెండి ధరలు బిగ్ క్రాష్.. దెబ్బకు నిలిచిపోయిన ట్రేడింగ్.. లబోదిబోమంటున్న పెట్టుబడిదారులు

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications