పశ్చిమాసియాలో నెలకొన్న తీవ్రమైన ఉద్రిక్తతల నేపథ్యంలో.. ఇంధన సరఫరాలో అంతరాయం ఏర్పడితే భారతదేశం అవసరాలను నెరవేర్చేందుకు తాము సిద్ధంగా ఉన్నామని Russia దౌత్య వర్గాలు స్పష్టం చేశాయి. గల్ఫ్ ప్రాంతంలో కొనసాగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ప్రపంచ చమురు ప్రవాహాలపై ప్రభావం చూపే అవకాశం ఉండటంతో.. మాస్కో భారత్కు నిరంతర ఇంధన సరఫరాలను హామీ ఇస్తూ బ్యాకప్ ఏర్పాట్లను కూడా అందించేందుకు ముందుకొచ్చినట్లు వర్గాలు తెలిపాయి.
ప్రస్తుత సరఫరా మార్గాలు దీర్ఘకాలికంగా ప్రభావితమైతే జోక్యం చేసుకునేందుకు తాము సిద్ధంగా ఉన్నామని రష్యా స్పష్టంగా సంకేతాలు ఇచ్చినట్లు దౌత్య వర్గాలు వెల్లడించాయి. దేశీయ ఇంధన అవసరాలను తీర్చుకోవడానికి దిగుమతులపై అధికంగా ఆధారపడే Indiaకు చమురు, వాయు సరఫరాల్లో ఎలాంటి అంతరాయం రాకుండా చూడడమే ఈ ఆఫర్ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.

భారతదేశం దిగుమతి చేసుకునే ముడి చమురు, ద్రవీకృత పెట్రోలియం వాయువు (LPG)లో దాదాపు సగం వరకు Strait of Hormuz ద్వారా రవాణా అవుతాయి. ఇది ప్రపంచంలోని అత్యంత కీలకమైన ఇంధన చోక్పాయింట్లలో ఒకటి. ఇరాన్ లక్ష్యాలపై అమెరికా, ఇజ్రాయెల్ దాడుల అనంతరం ఈ జలసంధి ప్రాంతంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. జలసంధికి దూరంగా నౌకలు ప్రయాణించాలని ఇరాన్ హెచ్చరించడంతో పాటు.. బీమా సంస్థలు కవరేజీని ఉపసంహరించుకుంటున్నాయన్న వార్తలు కూడా వెలువడ్డాయి. దీని ప్రభావంగా ట్యాంకర్ కదలికలు గణనీయంగా తగ్గినట్లు సమాచారం.
ఈ పరిణామాల నేపథ్యంలో.. భారత ప్రభుత్వం పరిస్థితిని రోజువారీ, గంటవారీ ప్రాతిపదికన పర్యవేక్షిస్తున్నట్లు చమురు మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులు తెలిపారు. ప్రస్తుత సంక్షోభం ఒక వారం నుంచి 10 రోజుల వరకు కొనసాగవచ్చన్న అంచనాలు ఉన్నప్పటికీ..దీనిని సమర్థవంతంగా నిర్వహించగలమన్న విశ్వాసాన్ని ప్రభుత్వం వ్యక్తం చేస్తోందని పిటిఐ నివేదించింది.
ప్రస్తుతం భారతదేశంలో సుమారు 25 రోజులకు సరిపడా ముడి చమురు నిల్వలు, అదే స్థాయిలో ఇంధన నిల్వలు ఉన్నాయని అధికారులు తెలిపారు. అదనంగా, మంగళూరు, పాదూర్, విశాఖపట్నంలో ఉన్న వ్యూహాత్మక పెట్రోలియం నిల్వలు, అలాగే వాణిజ్య నిల్వలు కలిపి మొత్తం ముడి చమురు నిల్వలు దాదాపు 100 మిలియన్ బ్యారెళ్లకు చేరుకున్నాయి. ఇవి కలిపి చూస్తే.. ఎలాంటి అంతరాయం ఏర్పడినా సుమారు 40 నుంచి 45 రోజుల దిగుమతులను కవర్ చేయగల సామర్థ్యం భారత్కు ఉందని అంచనా.
ఈ అంశంపై చమురు శాఖ మంత్రి Hardeep Singh Puri మీడియాతో మాట్లాడుతూ.. దేశం ముడి చమురు మాత్రమే కాకుండా పెట్రోల్, డీజిల్, ఎటిఎఫ్ వంటి కీలకమైన పెట్రోలియం ఉత్పత్తుల విషయంలో కూడా పూర్తిగా సిద్ధంగా ఉందని తెలిపారు. మధ్యప్రాచ్య పరిణామాల వల్ల ఏర్పడే స్వల్పకాలిక అంతరాయాలను ఎదుర్కొనేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు ఉన్నాయని చమురు మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
దేశవ్యాప్తంగా పెట్రోలియం ఉత్పత్తుల సరఫరా, నిల్వల పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించేందుకు 24×7 కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేసినట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇదిలా ఉండగా, సంక్షోభం మొదలైనప్పటి నుంచి బ్రెంట్ ముడి చమురు ధర బ్యారెల్కు 80 డాలర్లకు పైగా చేరి దాదాపు 10 శాతం వరకు పెరిగింది. ఇది అంతర్జాతీయ మార్కెట్లలో ఉన్న ఆందోళనలను ప్రతిబింబిస్తోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
More From GoodReturns

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు పసిడి రేటు ఎంత వరకు తగ్గిందంటే.. ఏప్రిల్ 13, సోమవారం ధరలు ఇవే..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

విజయవాడ నుంచి హైదరాబాద్కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..



Click it and Unblock the Notifications