నేస్తం నేనున్నా.. భారత్‌కు అండగా నిలిచిన రష్యా.. చమురు సంక్షోభంపై కీలక ప్రకటన..

పశ్చిమాసియాలో నెలకొన్న తీవ్రమైన ఉద్రిక్తతల నేపథ్యంలో.. ఇంధన సరఫరాలో అంతరాయం ఏర్పడితే భారతదేశం అవసరాలను నెరవేర్చేందుకు తాము సిద్ధంగా ఉన్నామని Russia దౌత్య వర్గాలు స్పష్టం చేశాయి. గల్ఫ్ ప్రాంతంలో కొనసాగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ప్రపంచ చమురు ప్రవాహాలపై ప్రభావం చూపే అవకాశం ఉండటంతో.. మాస్కో భారత్‌కు నిరంతర ఇంధన సరఫరాలను హామీ ఇస్తూ బ్యాకప్ ఏర్పాట్లను కూడా అందించేందుకు ముందుకొచ్చినట్లు వర్గాలు తెలిపాయి.

ప్రస్తుత సరఫరా మార్గాలు దీర్ఘకాలికంగా ప్రభావితమైతే జోక్యం చేసుకునేందుకు తాము సిద్ధంగా ఉన్నామని రష్యా స్పష్టంగా సంకేతాలు ఇచ్చినట్లు దౌత్య వర్గాలు వెల్లడించాయి. దేశీయ ఇంధన అవసరాలను తీర్చుకోవడానికి దిగుమతులపై అధికంగా ఆధారపడే Indiaకు చమురు, వాయు సరఫరాల్లో ఎలాంటి అంతరాయం రాకుండా చూడడమే ఈ ఆఫర్ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.

Russia oil supply to India India Russia energy ties West Asia tensions Middle East crisis oil impact India energy security Russian crude oil exports Strait of Hormuz disruption India oil imports news geopolitical tensions oil prices Russia India trade relations Middle East conflict energy crisis India alternative oil sources global oil supply disruption energy lifeline to India Russian crude discount India India oil imports Russia crude exports West Asia instability Strait of Hormuz oil route risk

భారతదేశం దిగుమతి చేసుకునే ముడి చమురు, ద్రవీకృత పెట్రోలియం వాయువు (LPG)లో దాదాపు సగం వరకు Strait of Hormuz ద్వారా రవాణా అవుతాయి. ఇది ప్రపంచంలోని అత్యంత కీలకమైన ఇంధన చోక్‌పాయింట్లలో ఒకటి. ఇరాన్ లక్ష్యాలపై అమెరికా, ఇజ్రాయెల్ దాడుల అనంతరం ఈ జలసంధి ప్రాంతంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. జలసంధికి దూరంగా నౌకలు ప్రయాణించాలని ఇరాన్ హెచ్చరించడంతో పాటు.. బీమా సంస్థలు కవరేజీని ఉపసంహరించుకుంటున్నాయన్న వార్తలు కూడా వెలువడ్డాయి. దీని ప్రభావంగా ట్యాంకర్ కదలికలు గణనీయంగా తగ్గినట్లు సమాచారం.

ఈ పరిణామాల నేపథ్యంలో.. భారత ప్రభుత్వం పరిస్థితిని రోజువారీ, గంటవారీ ప్రాతిపదికన పర్యవేక్షిస్తున్నట్లు చమురు మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులు తెలిపారు. ప్రస్తుత సంక్షోభం ఒక వారం నుంచి 10 రోజుల వరకు కొనసాగవచ్చన్న అంచనాలు ఉన్నప్పటికీ..దీనిని సమర్థవంతంగా నిర్వహించగలమన్న విశ్వాసాన్ని ప్రభుత్వం వ్యక్తం చేస్తోందని పిటిఐ నివేదించింది.

ప్రస్తుతం భారతదేశంలో సుమారు 25 రోజులకు సరిపడా ముడి చమురు నిల్వలు, అదే స్థాయిలో ఇంధన నిల్వలు ఉన్నాయని అధికారులు తెలిపారు. అదనంగా, మంగళూరు, పాదూర్, విశాఖపట్నంలో ఉన్న వ్యూహాత్మక పెట్రోలియం నిల్వలు, అలాగే వాణిజ్య నిల్వలు కలిపి మొత్తం ముడి చమురు నిల్వలు దాదాపు 100 మిలియన్ బ్యారెళ్లకు చేరుకున్నాయి. ఇవి కలిపి చూస్తే.. ఎలాంటి అంతరాయం ఏర్పడినా సుమారు 40 నుంచి 45 రోజుల దిగుమతులను కవర్ చేయగల సామర్థ్యం భారత్‌కు ఉందని అంచనా.

ఈ అంశంపై చమురు శాఖ మంత్రి Hardeep Singh Puri మీడియాతో మాట్లాడుతూ.. దేశం ముడి చమురు మాత్రమే కాకుండా పెట్రోల్, డీజిల్, ఎటిఎఫ్ వంటి కీలకమైన పెట్రోలియం ఉత్పత్తుల విషయంలో కూడా పూర్తిగా సిద్ధంగా ఉందని తెలిపారు. మధ్యప్రాచ్య పరిణామాల వల్ల ఏర్పడే స్వల్పకాలిక అంతరాయాలను ఎదుర్కొనేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు ఉన్నాయని చమురు మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.

దేశవ్యాప్తంగా పెట్రోలియం ఉత్పత్తుల సరఫరా, నిల్వల పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించేందుకు 24×7 కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసినట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇదిలా ఉండగా, సంక్షోభం మొదలైనప్పటి నుంచి బ్రెంట్ ముడి చమురు ధర బ్యారెల్‌కు 80 డాలర్లకు పైగా చేరి దాదాపు 10 శాతం వరకు పెరిగింది. ఇది అంతర్జాతీయ మార్కెట్లలో ఉన్న ఆందోళనలను ప్రతిబింబిస్తోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+