భారత ఆర్థిక వ్యవస్థని కుదిపేస్తున్న గల్ఫ్ యుద్ధ మంటలు.. ప్రమాదంలో 9 కోట్ల మంది పంపే డబ్బు ..

పొట్టకూటి కోసం, కడుప మంట చల్లార్చుకోవడానికి చాలామంది భారతదేశం నుండి గల్ఫ్ దేశాలకు వలస వెళుతుంటారు. అలాగే ఉద్యోగాల కోసం అమెరికా, యూకే, ఇటలీ లాంటి దేశాలకు కూడా వెళుతుంటారు. ఇప్పుడు వార్ జరుగుతున్న పశ్చిమాసియాకు కూడా చాలా మంది భారతీయులు పొట్ట కూటి కోసం వలస వెళ్లారు. అయితే ఇప్పుడు అక్కడ యుద్ధభూమిలో చిక్కుకుని బిక్కుబిక్కుమంటూ బతుకు వెళ్లదీస్తున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక అక్కడ కాలం గడుపుతున్నారు. అయితే వీరు మన ఆర్థిక వ్యవస్థకు చాలా మూలాధారం అని చెప్పవచ్చు.

ఆసియాలోని చాలా దేశాల మాదిరిగానే భారతదేశం కూడా పెర్షియన్ గల్ఫ్ మీదుగా రవాణా అయ్యే చమురు, సహజ వాయువు వంటి ఇంధన వనరులపై తీవ్రంగా ఆధారపడుతోంది. అయితే భారత్‌కు గల్ఫ్ ప్రాంతం కేవలం ఇంధన సరఫరాకు మాత్రమే పరిమితం కాదు. దక్షిణ భారత తీరానికి సమీపంలో ఉన్న యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియా, కువైట్, ఖతార్ వంటి దేశాల్లో లక్షలాది భారతీయులు తరతరాలుగా నివసిస్తూ అక్కడే తమ జీవనోపాధిని నిర్మించుకున్నారు. వారి సురక్షిత ప్రయాణం, ఉపాధి కొనసాగడం భారత్‌కు అత్యంత కీలక అంశం.

Indians in Persian Gulf 9 million Indians Gulf Gulf remittances to India Indian migrant workers Gulf money sent home by Indians India remittance inflows Gulf countries Indian workers overseas Indians remittances India economy remittance support migrant workers income India foreign remittances India Gulf jobs Indians Indian diaspora Gulf remittance lifeline India Middle East Indian workers 9

1970ల చమురు సంక్షోభం తర్వాత పెర్షియన్ Gulf ప్రాంతం భారతదేశం, దక్షిణాసియాకు ఆర్థిక విస్తరణగా మారింది. ఈ ప్రాంతంలో ఏర్పడే ఏ పెద్ద అంతరాయం అయినా కేవలం చమురు ధరలకే కాదు, లక్షలాది భారతీయుల ఉద్యోగాలు, జీవనోపాధులు, బిలియన్ల డాలర్ల వాణిజ్యానికి ముప్పుగా మారుతుంది.

అమెరికా, ఇజ్రాయెల్ శనివారం ఇరాన్‌పై బాంబు దాడులు ప్రారంభించడంతో పశ్చిమాసియాలో పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. దానికి ప్రతిగా ఇరాన్ క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేయడం, వాటిని పొరుగుదేశాలు అడ్డుకోవడం వంటి ఘటనలతో పూర్తి యుద్ధ వాతావరణం నెలకొంది. ఈ పరిణామాల మధ్య, ప్రపంచానికి కీలకమైన హార్ముజ్ జలసంధి దాదాపుగా మూసివేయబడటం గ్లోబల్ మార్కెట్లను వణికించింది. గల్ఫ్‌లో వ్యాపారాలకు సురక్షిత కేంద్రాలుగా భావించే దుబాయ్ వంటి నగరాలు స్తంభించాయి. విమానాశ్రయాలు, స్టాక్ మార్కెట్లు తాత్కాలికంగా నిలిచిపోయాయి.

ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యధిక వలస కార్మికులను విదేశాలకు పంపుతున్న దేశం భారత్. మొత్తం 15 మిలియన్లకు పైగా భారతీయులు విదేశాల్లో పనిచేస్తుండగా.. వారిలో సుమారు 9.3 మిలియన్లు కేవలం మూడు గంటల విమాన దూరంలో ఉన్న పెర్షియన్ గల్ఫ్ దేశాల్లోనే నివసిస్తున్నారు. ఇది అమెరికాలో ఉన్న భారతీయుల సంఖ్య కంటే చాలా ఎక్కువ. నిజానికి, కొన్ని గల్ఫ్ దేశాల్లో స్థానిక పౌరుల కంటే భారతీయులే ఎక్కువగా ఉన్నారు.

ఈ భారతీయులు భారత్‌కు ఏటా పంపే రెమిటెన్సులు దేశ ఆర్థిక వ్యవస్థకు ప్రాణాధారంగా మారాయి. ప్రతి సంవత్సరం సుమారు 125 బిలియన్ డాలర్లు భారతదేశానికి వస్తుండగా.. ఇది రూపాయి విలువను నిలబెట్టడంలో కీలక పాత్ర పోషిస్తోంది. ఒకప్పుడు విదేశీ సహాయం ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న భారత్‌కు ఇప్పుడు గల్ఫ్‌లో పనిచేస్తున్న కార్మికులే అతిపెద్ద డాలర్ వనరుగా మారారు.

ఈ ప్రాంతంలో ఉన్న భారతీయులు కేవలం ధనవంతులే కాదు. మెరిసే టవర్లకు దగ్గరగానే నిర్మాణం, రవాణా, గృహ సేవల్లో పనిచేసే తక్కువ వేతన కార్మికులు లక్షల సంఖ్యలో ఉన్నారు. ఒమన్ వంటి దేశాల్లో నెలకు 400 నుంచి 500 డాలర్ల జీతంతో పనిచేసే వారు కూడా తమ ఆదాయంలో 50 నుంచి 70 శాతం వరకు భారత్‌కు పంపుతుంటారు. ఆ డబ్బుతో గ్రామాల్లో ఇళ్లు, పిల్లల చదువులు, చిన్న వ్యాపారాలు నడుస్తున్నాయి.

భారత్ తన అవసరాలకు 90 శాతం వరకు ముడి చమురును దిగుమతి చేసుకుంటుంది. చమురు ధరలు పెరిగినప్పుడు దేశానికి భారీగా డాలర్లు అవసరం అవుతాయి. అటువంటి సమయంలో గల్ఫ్‌లోని భారతీయ కార్మికులే భారత్‌కు అత్యంత విశ్వసనీయ ఆర్థిక ఆధారంగా నిలుస్తున్నారు. వారిని ప్రభావితం చేసే ఏ సంక్షోభమైనా గల్ఫ్ దేశాలకూ, భారతదేశానికీ రెండువైపులా నష్టాన్ని తెచ్చిపెట్టే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+