అమెరికాలో బ్యాంకుకు లక్షల కోట్ల డాలర్లు మోసగించిన కేసులో ఓ భారతీయ అమెరికన్ను దోషిగా తేల్చింది అగ్రరాజ్య న్యాయస్థానం. న్యూజెర్సీకి చెందిన మార్బుల్, గ్రానైట్ హోల్సేల్ వ్యాపారి అరవై ఒక్క సంవత్సరాల రాజేంద్ర 17 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.125 కోట్లు) రుణానికి సంబంధించి బ్యాంకును మోసం చేసే ప్రయత్నాల్లో తన పాత్రను అంగీకరించినట్లుగా యూఎస్ అటార్నీ తెలిపారు. యూఎస్ డిస్ట్రిక్ట్ జడ్జి సుశాన్ డీ విజింటన్ జరిపిన వీడియో కాన్ఫరెన్స్ విచారణలో తన నేరాన్ని అంగీకరించాడని తెలుస్తోంది.

నేరానికి పాల్పడినట్లుగా రుజువు
రాజేంద్ర ఆర్థిక నేరానికి పాల్పడినట్లుగా కోర్టులో రుజువైంది. ప్రస్తుతం ఆయన మూతబడిన లోటస్ ఎగ్జిమ్ ఇంటర్నేషనల్ అనే సంస్థకు అధ్యక్షుడిగా ఉండేవారు. ఆయనకు ఆ సంస్థలో వాటాలు ఉన్నాయి. ఓ అమెరికన్ బ్యాంకు నుండి అక్రమంగా రుణం పొందడానికి నాలుగేళ్ల క్రితం 2016 మార్చి నుండి 2018 మార్చి మధ్య కాలంలో తన ఉద్యోగుల సహకారంతో ప్లాన్ చేశారు. రుణాలు పొందేందుకు తగినన్ని స్థిరాస్తులు లేకపోవడంతో సంస్థలోని ఉద్యోగుల సహకారంతో ఆన్లైన్ మోసానికి పాల్పడ్డాడు.

ఉద్యోగుల పేరుపై నకిలీ ఖాతాలు తెరిచి
ఇందులో భాగంగా సంస్థ ఉద్యోగులే తమ వినియోగదారుల పేరు మీద నకిలీ ఈ-మెయిల్ ఖాతాలను తెరిచారు. సంస్థను గురించి, బ్యాంకు, ఆడిటర్లకు తాము ఈ సంస్థకు భారీ మొత్తాలు బకాయి ఉన్నామని, వాటిని త్వరలో చెల్లిస్తామని పేర్కొన్నారు. ఇది వాస్తవం అని భావించిన బ్యాంకు ఆ సంస్థకు పెద్ద ఎత్తున రుణాలు మంజూరు చేసింది. ఈ ట్రాన్సాక్షన్స్ వల్ల బ్యాంకుకు 17 మిలియన్ డాలర్ల నష్టం సంభవించిందని అమెరికా కోర్టులో రుజువైంది.

30 ఏళ్ల జైలు శిక్ష
ఈ కేసుకు సంబంధించి పలు మోసపూరిత ఖాతాలు ఉండటంతో పాటు, ఇందులో బకాయిలు పెంచి లేదా కల్పితమైనవిగా ఉన్నట్లు గుర్తించారు. ఈ నేరానికి గాను అతనికి గరిష్టంగా 30 సంవత్సరాల జైలు శిక్ష, 1 మిలియన్ డాలర్ల జరిమానాను విధించే అవకాశాలు ఉన్నాయి. ఆయనకు జనవరి 18వ తేదీన శిక్ష ఖరారు చేయాల్సి ఉంది.
More From GoodReturns

Jobs: జాబ్స్ రాకపోవడానికి అసలు కారణం ఇదే! యువతలో ఆ ఒక్కటి తక్కువైంది!

ఇరాన్ మా షరతులకు ఒప్పుకుంది..అణ్వాయుధాలు విడిచిపెడుతోంది..ట్రంప్ సంచలన ప్రకటన..

పాకిస్తాన్లా బ్రోకర్ పనులు భారత్ ఎప్పటికీ చేయదు.. ట్రంప్తో ఫోన్లో ప్రధాని మోదీ మాట్లాడారు: జైశంకర్

ఇరాన్ యుద్ధంపై ట్రంప్ సంచలన ప్రకటన.. చారిత్రాత్మక ఒప్పందంపై ఏమన్నారంటే..

హార్ముజ్ జలసంధిపై ఇరాన్ కీలక ప్రకటన..శత్రుదేశాల నౌకలకు ప్రవేశం లేదని స్పష్టం చేసిన టెహ్రాన్..

అమెరికాతో చర్చలేమి జరగలేదు..ట్రంప్ వ్యాఖ్యలను ఖండించిన ఇరాన్.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిందనే భయంతోనే..

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications