పశ్చిమ ఆసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ.. ఇరాన్ తన అత్యున్నత నాయకుడు అయాతొల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. గత శనివారం అమెరికా , ఇజ్రాయెల్ సంయుక్తంగా నిర్వహించిన భారీ దాడుల్లో (Operation Epic Fury) ఖమేనీ మరణించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో.. బుధవారం సాయంత్రం జరగాల్సిన వీడ్కోలు వేడుకలను అనివార్య కారణాలతో వాయిదా వేస్తున్నట్లు ఇరాన్ ప్రభుత్వ టెలివిజన్ ప్రకటించింది.

అంత్యక్రియల వాయిదాకు కారణం ఏమిటి?
ఇరాన్ అధికారుల సమాచారం ప్రకారం.. ఖమేనీకి చివరిసారిగా వీడ్కోలు పలికేందుకు దేశవ్యాప్తంగా లక్షలాది మంది ప్రజలు తరలివచ్చే అవకాశం ఉంది. ఇంత భారీ స్థాయిలో ప్రజలు తరలివస్తే వారిని నియంత్రించడం, భద్రతా ఏర్పాట్లు చేయడం ప్రస్తుతం ఒక పెద్ద సవాలుగా మారింది. "అనూహ్యమైన జనసందోహం వచ్చే అవకాశం ఉన్నందున, సరైన మౌలిక సదుపాయాలు , ఏర్పాట్ల కోసం ఈ వేడుకను వాయిదా వేస్తున్నాం. కొత్త తేదీని త్వరలోనే ప్రకటిస్తాం" అని ఇరాన్ ఇస్లామిక్ డెవలప్మెంట్ కోఆర్డినేషన్ కౌన్సిల్ తెలిపింది.
ఇరాన్ యుద్ధం (iran war).. తాజా పరిణామాలు
ఖమేనీ మరణంతో ఇరాన్ చేస్తున్న యుద్ధం (iran war) మరింత తీవ్రతరమైంది. ఇరాన్ ప్రభుత్వం ఇప్పటికే 40 రోజుల జాతీయ సంతాప దినాలను ప్రకటించింది. తొలుత టెహ్రాన్లో నివాళులర్పించిన తర్వాత.. ఖమేనీ భౌతిక కాయాన్ని ఆయన జన్మస్థలమైన పవిత్ర నగరం మషద్కు తరలించి అక్కడ అంత్యక్రియలు నిర్వహించాలని ప్లాన్ చేశారు. అయితే గత ఆరు రోజులుగా టెహ్రాన్ , ఇతర కీలక ప్రాంతాలపై అమెరికా, ఇజ్రాయెల్ క్షిపణి దాడులు కొనసాగిస్తూనే ఉన్నాయి. దీనివల్ల భద్రతా కారణాల రీత్యా కూడా ఈ వాయిదా పడి ఉండవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.
ప్రపంచ దేశాల్లో ఆందోళన
ఖమేనీ మరణం తర్వాత ఇరాన్ నాయకత్వంలో పెద్ద శూన్యం ఏర్పడింది. దీనిని భర్తీ చేసే క్రమంలో ఇరాన్ ప్రతికార దాడులకు దిగుతుండటంతో ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు ధరలు పెరగడం , స్టాక్ మార్కెట్ ఒడిదుడుకులకు లోనవ్వడం జరుగుతోంది. ఇరాన్ తన అణు కార్యక్రమాన్ని వదిలిపెట్టడానికి సిద్ధమని ఒకవైపు దౌత్యపరమైన సంకేతాలు ఇస్తున్నప్పటికీ, మరోవైపు యుద్ధ వాతావరణం మాత్రం తగ్గడం లేదు. ఇరాన్ అంతటా భారీ నిరసనలు, ప్రార్థనలు జరుగుతున్నాయి. 1989లో ఖొమేనీ అంత్యక్రియలకు వచ్చినంత భారీ స్థాయిలో జనం ఇప్పుడు ఖమేనీకి వీడ్కోలు పలికేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
More From GoodReturns

పాకిస్తాన్లా బ్రోకర్ పనులు భారత్ ఎప్పటికీ చేయదు.. ట్రంప్తో ఫోన్లో ప్రధాని మోదీ మాట్లాడారు: జైశంకర్

యుద్దంపై ఇరాన్ కీలక ప్రకటన.. భారీ సైనిక దాడులు చేస్తామంటున్న ట్రంప్.. అసలేం జరుగుతోంది..

చమురు ధరలు పెరుగుదలపై షాకింగ్ న్యూస్.. బ్యారెల్కు 150 డాలర్ల నుంచి 200 డాలర్లకు.. మక్వారీ వార్నింగ్ ఇదే..

ఇరాన్ మా షరతులకు ఒప్పుకుంది..అణ్వాయుధాలు విడిచిపెడుతోంది..ట్రంప్ సంచలన ప్రకటన..

హార్ముజ్ జలసంధిపై ఇరాన్ కీలక ప్రకటన..శత్రుదేశాల నౌకలకు ప్రవేశం లేదని స్పష్టం చేసిన టెహ్రాన్..

అమెరికాతో చర్చలేమి జరగలేదు..ట్రంప్ వ్యాఖ్యలను ఖండించిన ఇరాన్.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిందనే భయంతోనే..

ఇరాన్ను ఎదిరించలేని పిరికిపందలు..మీ చావు మీరు చావాలంటూ నాటో దేశాలపై విరుచుకుపడిన ట్రంప్..

ట్రంప్ మరో భారీ స్కెచ్.. ఇరాన్ హార్ట్ అయిన ఖర్గ్ ద్వీపంపై కన్ను.. ఏ క్షణమైనా మిసైళ్లతో దాడి..

ప్రపంచ ఆర్థిక సంక్షోభం ఎంతో దూరంలో లేదు.. బ్లాక్రాక్ అధినేత సంచలన వ్యాఖ్యలు.. కారణం ఏంటంటే..

చమురు సంక్షోభంలో స్నేహితుడికి అండగా రష్యా.. భారత రిఫైనరీ కంపెనీలకు 6 కోట్ల బ్యారెళ్ల ముడి చమురు సరఫరా

భారతదేశంలో లాక్డౌన్.. గూగుల్లో తెగ వెతికేస్తున్న నెటిజన్లు.. వెస్ట్ ఆసియా దేశాల్లో ఎమర్జెన్సీ ప్రకటన..



Click it and Unblock the Notifications