పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు అలాగే కొనసాగుతున్నాయి. ఇరాన్ మీద అమెరికా, ఇజ్రాయెల్ కలిసి చేసిన దాడులతో ప్రపంచ రాజకీయ, భౌగోళిక పరిస్థితులు ఉద్రిక్తకరంగా మారాయి. ఈ దాడులు ఇతర అంశాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి.ముఖ్యంగా చమురు ధరలపై ఈ ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. గత రెండు రోజులను నుంచి క్రూడ్ ఆయిల్ ధరలు విపరీతంగా పెరిగాయి. చమురు సంక్షోభం నెలకొంది. 1970 నాటి చమురు సంక్షోభ పరిస్థితులు వచ్చే అవకాశం ఉందని నిపుణులు కూడా హెచ్చరిస్తున్నారు.
అయితే కాస్త ఊరటనిస్తూ.. మంగళవారం ముడి చమురు ధరలు గణనీయంగా పడిపోయాయి. ఇది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్యప్రాచ్యంలో యుద్ధం త్వరగా ముగియవచ్చని అంచనా వేయడంతో సంభవించింది. ఈ ప్రకటన తర్వాత.. గ్లోబల్ చమురు సరఫరాలకు సంబంధించి దీర్ఘకాలిక అంతరాయాలపై పెట్టుబడిదారుల ఆందోళన తగ్గింది. గత సెషన్లో, చమురు ధరలు మూడు సంవత్సరాలకు పైగా గరిష్ట స్థాయికి చేరిన తర్వాత ఈ భారీ పతనం జరిగింది.

బ్రెంట్ ఫ్యూచర్స్ GMT 0018 వద్ద బ్యారెల్కు 6.51 డాలర్లకు లేదా 6.6 శాతం పడిపోయి 92.45 డాలర్లకి చేరింది. US వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ (WTI) 6.12 డాలర్లు లేదా 6.5 శాతం తగ్గి 88.65 శాతానికి వచ్చింది. సోమవారం బ్రెంట్ ధర 119.50 డాలర్లు, WTI ధర 119.48 డాలర్లకి చేరి.. 2022 మధ్యకాలం తరువాత అత్యధిక స్థాయిలను తాకాయి. ఈ పెరుగుదలు ప్రధానంగా ఇరాన్తో తీవ్రమవుతున్న US-ఇజ్రాయెల్ యుద్ధం.. సౌదీ అరేబియా ఇతర ఉత్పత్తిదారుల ఉత్పత్తి కోతల వల్ల ప్రపంచ సరఫరాకు భయాలను రేకెత్తించడంతో జరిగింది.
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్.. ట్రంప్తో ఫోన్ చర్చలో ఇరాన్ యుద్ధానికి త్వరిత పరిష్కారం లక్ష్యంగా ప్రతిపాదనలు పంచుకున్నారని క్రెమ్లిన్ సహాయకులు తెలిపారు. దీని ఫలితంగా, దీర్ఘకాలిక సరఫరా అంతరాయం గురించి పెట్టుబడిదారుల ఆందోళనలు తగ్గాయి. సోమవారం ట్రంప్ CBS News కు ఇచ్చిన ఇంటర్వ్యూలో.. ఇరాన్పై యుద్ధం చాలా వరకు పూర్తయిందని, వాషింగ్టన్ తన మొదటి అంచనా వేసిన నాలుగు-ఐదు వారాల కాలపరిమితి కంటే ముందుగానే ముగియవచ్చని తెలిపారు.
ట్రంప్ వ్యాఖ్యలకు ప్రతిస్పందనగా..ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ (IRGC) యుద్ధం ముగింపును నిర్ణయిస్తామని ప్రకటించగా.. అమెరికా, ఇజ్రాయెల్ దాడులు కొనసాగితే టెహ్రాన్ ఈ ప్రాంతం నుండి ఒక లీటరు చమురు కూడా ఎగుమతి చేయదని వెల్లడించింది. అయితే, ఈ వ్యాఖ్యలు ధరలను పెంచలేదు. కారణం ఏంటంటే.. ట్రంప్ రష్యాపై చమురు ఆంక్షలను సడలించడం, అత్యవసర ముడి నిల్వలను విడుదల చేయడం వంటి ప్రతిపక్ష చర్యలపై పరిశీలనలు జరుగుతున్నందున, మార్కెట్ ఇంకా ఒత్తిడిలో ఉందని నిపుణులు చెప్పారు.
IG మార్కెట్ విశ్లేషకుడు టోనీ సైకామోర్ అభిప్రాయపడుతున్నట్టుగా..గత 24 గంటల్లో జరిగిన సంఘటనలను పరిగణలోకి తీసుకుంటే, ముడి చమురు చాలా అస్థిరంగా ఉంటుంది, రాబోయే సెషన్లలో $75-$105 మధ్య ట్రేడవుతుందని చెప్పారు.
ఇరాన్పై యుద్ధం గల్ఫ్ చమురు ఉత్పత్తిదారుల ఉత్పత్తి తగ్గింపును ప్రేరేపించింది. ఇరాక్ దక్షిణ చమురు క్షేత్రాలలో ఉత్పత్తిని 70 శాతం తగ్గించి రోజుకు 1.3 మిలియన్ బ్యారెల్లకు క్షీణింపజేసింది. కువైట్ పెట్రోలియం కార్పొరేషన్ కూడా ఉత్పత్తిని తగ్గించడానికి ప్రకటన చేసింది. సౌదీ అరేబియా కూడా ఉత్పత్తి కోతలు అమలు చేయడం ప్రారంభించింది.
అందువల్ల, ప్రపంచ చమురు ధరలు పునరుద్ధరణ కోసం G7 దేశాలు అవసరమైన చర్యలకు సిద్ధంగా ఉన్నప్పటికీ, అత్యవసర నిల్వలను విడుదల చేయడానికి తక్షణ నిర్ణయం తీసుకోలేదు. ఈ పరిస్థితులు ముడి చమురు మార్కెట్లో గణనీయమైన అస్థిరతను సృష్టించాయి. పెట్టుబడిదారులు, పరిశ్రమలు, అంతర్జాతీయ సరఫరా చైన్ ఆందోళన పడుతున్నాయి.
More From GoodReturns

పెట్రోల్, డీజిల్ ధరలపై కేంద్రం కీలక ప్రకటన.. అంతర్జాతీయంగా 110 డాలర్లు దాటిన ముడి చమురు ధరలు..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

చమురు ధరలు పెరిగినా పెట్రోల్, డిజీల్ ధరలు పెరగవు.. సామాన్యులకు కేంద్రం గుడ్ న్యూస్..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

భారత్ టైర్ పరిశ్రమను కుదిసేస్తున్న ఇరాన్ యుధ్ద ప్రభావం.. కీలకమైన హెచ్చరిక చేసిన CLSA

భారీగా పెరిగిన ఎరువుల ధరలు.. సంక్షోభం దిశగా వ్యయసాయ రంగం.. రైతన్న విలవిల..

Iran war: ఇరాన్లో హై అలర్ట్: ఖమేనీ అంత్యక్రియలు వాయిదా.. ఏం జరుగుతోంది?

Iran war: ఇరాన్ సంచలన నిర్ణయం.. అణు బాంబు తయారీ ఆపేస్తాం! కానీ ఆ ఒక్క కండిషన్!

ఇరాన్ మీద దాడులు.. బట్ట బయలైన అమెరికా కుట్రలు.. ప్రపంచానికి నిజాన్ని తెలిపిన స్పెయిన్..

భారత ఆర్థిక వ్యవస్థని కుదిపేస్తున్న గల్ఫ్ యుద్ధ మంటలు.. ప్రమాదంలో 9 కోట్ల మంది పంపే డబ్బు ..

ఇరాన్పై యుద్ధంతో ఖాళీ అవుతున్న అమెరికా ఖజానా.. తొలి 24 గంటల్లోనే రూ. 7 వేల కోట్లకు పైగా ఖర్చు..

హార్ముజ్ జలసంధి మూసివేత.. సముద్ర జల్లాలోకి ఏ దేశం నౌక వచ్చినా పేల్చేస్తామని ఇరాన్ కీలక ప్రకటన..

ఎర్ర సముద్రంలో కల్లోలం..భారత ఎగుమతులపై భారీ ఎఫెక్ట్..తడిసిమోపెడవుతున్న ఛార్జీలు..

మూడో రోజూ కుప్పకూలిన స్టాక్ మార్కెట్..రికార్డు కనిష్టానికి రూపాయి.. పెట్టుబడిదారుల్లో తీవ్ర ఆందోళన..



Click it and Unblock the Notifications
