దూసుకెళ్లనున్న వ్యవసాయ ఆధారిత సంస్థలు.
ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మాట్లాడుతూ తమ ప్రభుత్వం మొదటి ప్రాధాన్యత వ్యవసాయ రంగానికే ఇస్తుందని వెల్లడించారు. ఆర్థిక వృద్ధి లాభాలు కూడా రైతులకు సమానంగా ఉండవచ్చని హామీ ఇచ్చారు.
రానున్న నెలల్లో వ్యవసాయ రంగానికి సంబంధించిన స్టాక్స్ పెరగనున్నాయి,ఈ పథకానికి ప్రభుత్వం ప్రణాళికా వ్యయాన్ని పెంచనుంది.
సాధారణంగా పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ఫిబ్రవరి చివరి రోజుల్లో అనగా 28,29 తేదీల్లో నిర్వహిస్తారు కానీ 2018నుండి ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 1 వ తారీఖునే బడ్జెట్ ప్రవేశపెట్టడం జరుగుతుందని కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు.పార్లమెంటరీ వ్యవహారాలకు సంబంధించిన క్యాబినెట్ కమిటీ బడ్జెట్ తేదీలను దేశ రాష్ట్రపతికి తెలియజేసింది. అంతే కాకుండా జనవరి 29న ప్రారంభమై ఫిబ్రవరి 9న పార్లమెంటరీ బడ్జెట్ మొదటి విడత సమావేశాలు ముగుస్తాయని తెలిపారు. దాని తర్వాత ఒక నెల విరామం ఇచ్చి రెండో దశ సమావేశాలను మార్చి 5న మొదలుపెట్టి ఏప్రిల్ 6న ముగిస్తారని వివరించారు.
గత ఏడాది కేంద్ర బడ్జెట్లో ప్రభుత్వం వచ్చే ఐదు సంవత్సరాలలో రైతు ఆదాయాన్ని రెట్టింపు చేయాలని ప్రణాళిక రూపొందించింది . ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మాట్లాడుతూ తమ ప్రభుత్వం మొదటి ప్రాధాన్యత వ్యవసాయ రంగానికే ఇస్తుందని వెల్లడించారు. ఆర్థిక వృద్ధి లాభాలు కూడా రైతులకు సమానంగా ఉండవచ్చని హామీ ఇచ్చారు. కావేరీ విత్తనాలు, జైన్ ఇరిగేషన్, పిఐ ఇండస్ట్రీస్, రాలిస్ ఇండియా మొదలైన వాటితో పాటు కొన్ని స్టాక్స్ ఈ రంగాల్లో ఇప్పటికే ఉన్నత స్థాయికి వెళ్లిపోయారు. మౌలిక సదుపాయాల నుండి కూడా స్టాక్స్ చూడవచ్చు, రాబోయే బడ్జెట్లో ఇది పుంజుకోవచ్చు. ఏదేమైనా, కొన్ని జాగ్రత్తలు వహించి.సరైన ధర వద్ద స్టాక్స్ కొనుగోలు చేయాలి.