వచ్చే ఆర్థిక సంవత్సరంలో భారత జీడీపీ వృద్ధి రేటు 8 శాతం సాధ్యమయ్యే అంశమేనని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ బుధవారం అన్నారు. పరిస్థితులు ఇలాగే కొనసాగుతుంటే, అంటే అన్ని రంగాలు క్రమంగా కోలుకుంటే వృద్ధి రేటు ముందుకు వెళ్తుందన్నారు. ఈ మేరకు ఆమె ఓ ఇంగ్లీష్ మీడియా ఇంటర్వ్యూలో మాట్లాడారు. ఇప్పటికీ హాస్పిటాలిటీ, కాంటాక్ట్ ఇంటెన్సివ్ రంగాలకు ఆర్థిక మద్దతు అవసరమని అభిప్రాయపడ్డారు. అందుకే 2022-23 ఆర్థిక సంవత్సరానికి గాను నిన్న ప్రవేశపెట్టిన బడ్జెట్లో వీటికి మద్దతిచ్చామన్నారు.
తనకు తెలిసినంతవరకు ప్రభుత్వం, బ్యాంకింగ్ వ్యవస్థలు, ఇతరుల మద్దతుతో ఆయా రంగాలు వారు కోరుకున్న మద్దతు లభిస్తే పునరుద్ధరణ వేగంగా ఉంటుందని నిర్మలమ్మ అభిప్రాయపడ్డారు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు 8 శాతం నుండి 8.5 శాతంగా ఉండవచ్చునని ఆర్థిక సర్వే అంచనాల నేపథ్యంలో నిర్మలమ్మ వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.

రాబోయే ఆర్థిక సంవత్సరంలో భారత్ అనేక సవాళ్లను తట్టుకునే బలమైన స్థితిలో ఉందని నిర్మలమ్మ అన్నారు. 2022 బడ్జెట్లో ప్రకటించిన కాపెక్స్ బూస్ట్ ప్రయివేటు పెట్టుబడులను పెంచుతుందా అంటే ఆశాభావం వ్యక్తం చేశారు. సంస్కరణలు క్రమంగా చేస్తున్నామని అభిప్రాయపడ్డారు. ఉదాహరణకు 2019 లో కార్పోరేట్ పన్ను తగ్గింపును తీసుకు వచ్చామని, ప్రపంచవ్యాప్తంగా బహుశా అత్యల్పాల్లో ఒకటి అన్నారు. పరిశ్రమతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తరుచూ సంప్రదింపులు జరిపారని, ఇది వారికి భరోసాను కల్పిస్తోందన్నారు. ప్రయివేటు పెట్టుబడులు వేగవంతమవుతాయని ధీమా వ్యక్తం చేశారు.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications