ఇటీవలి వరకు భారత్తో అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా చైనా ఉంది. కానీ 2021-22 ఆర్థిక సంవత్సరంలో అమెరికా డ్రాగన్ దేశాన్ని అధిగమించింది. తద్వారా భారత అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా అమెరికా అవతరించింది. గతంలో ఈ స్థానంలో ఉన్న చైనాను అమెరికా అధిగమించింది. ఇరు దేశాల మధ్య ఆర్థిక బంధం బలోపేతానికి ఇది ప్రతీకగా నిలుస్తోంది. కేంద్ర వాణిజ్య శాఖ గణాంకాల ప్రకారం 2021-22 ఆర్థిక సంవత్సరంలో భారత్-అమెరికా ద్వైపాక్షిక వాణిజ్య వ్యాల్యూ 119.42 బిలియన్ డాలర్లు కాగా, 2020-21లో ఇది 80.51 బిలియన్ డాలర్లుగా ఉంది.
2020-21లో భారత్ నుండి అమెరికాకు ఎగుమతుల వ్యాల్యూ 76.11 బిలియన్ డాలర్లకు చేరుకుంది. క్రితం ఏడాది ఇది 51.62 బిలియన్ డాలర్లుగా ఉంది. అదే సమయంలో దిగుమతుల వ్యాల్యూ 29 బిలియన్ డాలర్ల నుండి 43.31 బిలియన్ డాలర్లకు పెరిగింది. చైనాతో 2021-22 ఆర్థిక సంవత్సరంలో ద్వైపాక్షిక వాణిజ్య వ్యాల్యూ 115.42 బిలియన్ డాలర్లుగా నమోదయింది. చైనాకు ఎగుమతులు స్వల్పంగా పెరిగి 21.25 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. దిగుమతుల వ్యాల్యూ 94.16 బిలియన్ డాలర్లుగా నమోదయింది.

రానున్న రోజుల్లో భారత్-అమెరికా మధ్య వాణిజ్య బంధం మరింత బలోపేతం కానుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. భారత విశ్వసనీయ వాణిజ్య భాగస్వామిగా ఎదుగుతోందని, అంతర్జాతీయ కంపెనీలు కూడా చైనాపై ఆధారపడటాన్ని తగ్గిస్తున్నాయని, చెబుతున్నారు. భారత్ వంటి దేశాలకు ఇతర దేశాల కంపెనీల కార్యకలాపాలు విస్తరిస్తున్నాయి.2013-14 నుండి 2017-18 వరకు భారత్కు చైనా అతిపెద్ద వాణిజ్య భాగస్వామి కాగా, అంతకుముందు యూఏఈ ఉంది. 2021-22లో యూఏఈ మూడో స్థానంలో ఉంది.
More From GoodReturns

ఇరాన్ యుద్ధంపై ట్రంప్ సంచలన ప్రకటన.. చారిత్రాత్మక ఒప్పందంపై ఏమన్నారంటే..

హార్ముజ్ జలసంధిపై ఇరాన్ కీలక ప్రకటన..శత్రుదేశాల నౌకలకు ప్రవేశం లేదని స్పష్టం చేసిన టెహ్రాన్..

చమురు సంక్షోభంలో స్నేహితుడికి అండగా రష్యా.. భారత రిఫైనరీ కంపెనీలకు 6 కోట్ల బ్యారెళ్ల ముడి చమురు సరఫరా

అమెరికాతో చర్చలేమి జరగలేదు..ట్రంప్ వ్యాఖ్యలను ఖండించిన ఇరాన్.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిందనే భయంతోనే..

Jobs: జాబ్స్ రాకపోవడానికి అసలు కారణం ఇదే! యువతలో ఆ ఒక్కటి తక్కువైంది!

హార్ముజ్ జలసంధిని దాటిన మరో రెండు భారత LPG నౌకలు.. మరో మూడు షిప్పులు ఇంకా అక్కడే..

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..



Click it and Unblock the Notifications