భారత్కు ప్రాధాన్య వాణిజ్య హోదా (GSP-జనరలైజ్డ్ సిస్టమ్ ఆఫ్ ప్రిఫరెన్సెస్)ను పునరుద్ధరించాలని అమెరికా చట్ట సభలకు చెందిన 44 మంది ప్రతినిధులు డొనాల్డ్ ట్రంప్ పాలక వర్గానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు మంగళవారం ట్రంప్ ప్రభుత్వంలోని వాణిజ్య ప్రతినిధి రాబర్ట్ లైట్ హైజర్కు లేఖను అందించారు. గత జూన్ నెలలో జీఎస్పీ జాబితా నుంచి భారత్ను తొలగిస్తూ ట్రంప్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.

డెమోక్రాట్లు, రిపబ్లికన్ల మద్దతు
ఈ మేరకు హౌస్ మెంబర్స్ మంగళవారం యూఎస్ ట్రేడ్ రిప్రజెంటేటివ్ రాబర్డ్కు లేఖ రాశారు. కాంగ్రెస్మెన్ జిమ్ హైమ్స్, రాన్ ఎస్టెస్ నేతృత్వంలోని సభ్యులు సంతకాలు చేసి ఈ లేఖను అందించారు. ఈ లేఖపై 26 మంది డెమోక్రాట్లు, 18 మంది రిపబ్లికన్లు సంతకం చేశారు. ఇరుదేశాల మధ్య వాణిజ్య ప్రయోజనాలను విస్తరించే ఉద్దేశ్యం ఇందులో కనిపిస్తోంది.

దిగుమతులు పెరిగాయి..
అమెరికాలోని రెండు ప్రధాన పార్టీల మద్దతు భారత్కు జీఎస్పీ హోదా కల్పించడానికి మద్దతు ఉన్నట్లుగా స్పష్టంగా అర్థమవుతోంది. భారత్కు జీఎస్పీ హోదా తొలగించడం ద్వారా ఆర్థికంగనే కాకుండా ఉద్యోగాల పరంగాను అమెరికా నష్టపోతోందని ఈ ప్రతినిధులు చెబుతున్నారు. జీఎస్పీ హోదా తొలగింపుతో ఎక్కువ ట్యాక్స్ వేసినప్పటికీ జూన్ - జూలై నెల్లో భారత్ నుంచి 40 శాతం దిగుమతులు పెరిగినట్లు చెబుతున్నారు.

జీఎస్పీ రద్దుతో అమెరికాకే నష్టం
ఇవన్నీ గతంలో జీఎస్పీ అర్హత కలిగిన ఉత్పత్తులేనని చెబుతున్నారు. చైనాతో వాణిజ్య విభేదాల నేపథ్యంలో భారత్కు కంపెనీలు తరలడమే దిగుమతుల పెరుగుదలకు కారణమై ఉంటుందని చెబుతున్నారు. పెరిగిన ట్యాక్స్ కారణంగా అమెరికన్ బిజినెస్మెన్ ఒక మిలియన్ డాలర్ల మేర భారత ఎక్సపోర్టర్స్కు బిల్లులు బకాయిపడ్డట్లు చెప్పారు. కేవలం జూలై నెలలోనే 30 మిలియన్ డాలర్లు చెల్లించవలసి వచ్చిందన్నారు. ఈ నేపథ్యంలో భారత్కు జీఎస్పీ హోదా రద్దు చేయడం ద్వారా అమెరికా భారీగా నష్టపోతుందన్నారు.
More From GoodReturns

ఇరాన్ యుద్ధంపై ట్రంప్ సంచలన ప్రకటన.. చారిత్రాత్మక ఒప్పందంపై ఏమన్నారంటే..

Jobs: జాబ్స్ రాకపోవడానికి అసలు కారణం ఇదే! యువతలో ఆ ఒక్కటి తక్కువైంది!

చమురు సంక్షోభంలో స్నేహితుడికి అండగా రష్యా.. భారత రిఫైనరీ కంపెనీలకు 6 కోట్ల బ్యారెళ్ల ముడి చమురు సరఫరా

పాకిస్తాన్లా బ్రోకర్ పనులు భారత్ ఎప్పటికీ చేయదు.. ట్రంప్తో ఫోన్లో ప్రధాని మోదీ మాట్లాడారు: జైశంకర్

ఇరాన్ మా షరతులకు ఒప్పుకుంది..అణ్వాయుధాలు విడిచిపెడుతోంది..ట్రంప్ సంచలన ప్రకటన..

మాట తప్పిన అమెరికాతో చర్చలు ఇక ఉండవని స్పష్టం చేసిన ఇరాన్.. గల్ఫ్ దేశాల తాగునీటిపై గురి పెట్టిన టెహ్రాన్..

హార్ముజ్ జలసంధిపై ఇరాన్ కీలక ప్రకటన..శత్రుదేశాల నౌకలకు ప్రవేశం లేదని స్పష్టం చేసిన టెహ్రాన్..

అమెరికాతో చర్చలేమి జరగలేదు..ట్రంప్ వ్యాఖ్యలను ఖండించిన ఇరాన్.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిందనే భయంతోనే..

వెండి ధరలు బిగ్ క్రాష్.. దెబ్బకు నిలిచిపోయిన ట్రేడింగ్.. లబోదిబోమంటున్న పెట్టుబడిదారులు

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..



Click it and Unblock the Notifications