వాషింగ్టన్: ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా పర్యటనలో భాగంగా వివిధ కంపెనీల సీఈవోలు ఆయనను కలిశారు. క్వాల్కామ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ క్రిస్టియానో అమోన్, అడోమ్ సీఈవో శంతను తదితరులు మోడీతో భేటీ అయ్యారు. ఆ తర్వాత ఫస్ట్ సోలార్ సీఈవో విడ్మార్ భేటీ అయ్యారు. మోడీతో భేటీ అయిన మూడో సీఈవో. జనరల్ అటామిక్స్ సీఈవో వివేక్ లాల్ కూడా ప్రధానితో భేటీ అయ్యారు.
తొలుత సెమీకండక్టర్ చిప్ తయారీ సంస్థ క్వాల్కామ్ సీఈఓ క్రిస్టియానోతో భేటీ అయ్యారు. సుమారు 15 నిమిషాల పాటు చర్చలు జరిపారు. ఇప్పటికే క్వాల్కామ్ తమ సేవలను భారత్లో అందిస్తోందని ప్రధాని మోడీతో సమావేశం అనంతరం క్రిస్టియానో గుర్తు చేశారు. వైర్లెస్ టెక్నాలజీ, సెమీకండక్టర్స్, ఐటీ సేవలపై ప్రధాన దృష్టి సారించిన ప్రధాని మోడీ, ఇదే అంశంపై క్వాల్కామ్ సీఈఓ చర్చించారు. భారత్లో మరిన్ని పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు. భారత్తో జతకట్టడం చాలా ఆనందంగా ఉందన్నారు క్రిస్టియానో. ప్రధాని మోడీతో 5జీ టెక్నాలజీ పై చర్చించామని, 5జీ సేవలను వేగవంతం చేయాలనే భావనతో మోడీ ఉన్నారన్నారు. భారత్లో పరిశ్రమ రంగాన్ని ప్రోత్సహించేందుకు ప్రధాని మోడీ చొరవ చూపుతున్నారన్నారు.

ఆ తర్వాత అడోబ్ సీఈవో శంతను నారాయణ్ భేటీ అయ్యారు. భారత 75వ స్వాతంత్ర వేడుకల్లో సహకారం అందించేందుకు ఆసక్తిని వ్యక్తం చేశారు. భారత్లో ప్రతి చిన్నారి దరికి వీడియో యానిమిషన్ తీసుకు రావాలని ఆకాంక్షించారు. ప్రతి బిడ్డకు స్మార్ట్ విద్యను అందించాలని ప్రధాని మోడీ ఈ సందర్భంగా శంతను నారాయణ్తో అన్నారు. కోవిడ్ యుగంలో డిజిటల్ విద్యకు మరింత పునాది పడిందని, ఇప్పుడు మరింత ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్నారు. భారత్లో కొన్ని ఏఐ ఎక్సలెన్స్ సెంటర్స్ ఏర్పాటు చేసే అంశంపై ప్రధాని, సీఈవో దృష్టి పెట్టారు.
More From GoodReturns

హార్ముజ్ జలసంధిపై ఇరాన్ కీలక ప్రకటన..శత్రుదేశాల నౌకలకు ప్రవేశం లేదని స్పష్టం చేసిన టెహ్రాన్..

Infosys: ఇన్ఫోసిస్లో భారీ మార్పులు.. సలీల్ పరేఖ్ పదవీ కాలం పెంపు.. తదుపరి చైర్మన్ ఆయనేనా?

Jiostar: జియో సినిమాను నంబర్ వన్ చేసిన వ్యక్తి.. ఇప్పుడు ఏఐ ప్రపంచాన్ని ఏలబోతున్నారా?

అమెరికాతో చర్చలేమి జరగలేదు..ట్రంప్ వ్యాఖ్యలను ఖండించిన ఇరాన్.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిందనే భయంతోనే..

మాట తప్పిన అమెరికాతో చర్చలు ఇక ఉండవని స్పష్టం చేసిన ఇరాన్.. గల్ఫ్ దేశాల తాగునీటిపై గురి పెట్టిన టెహ్రాన్..

అమెరికాకు భారీ షాకిచ్చిన ఇరాన్.. 4 వేల మైళ్ల దూరం నుంచి డియాగో గార్సియా సైనిక స్థావరంపై దాడి..

ఇరాన్ను ఎదిరించలేని పిరికిపందలు..మీ చావు మీరు చావాలంటూ నాటో దేశాలపై విరుచుకుపడిన ట్రంప్..

వెండి ధరలు బిగ్ క్రాష్.. దెబ్బకు నిలిచిపోయిన ట్రేడింగ్.. లబోదిబోమంటున్న పెట్టుబడిదారులు

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదల ఎంతో తెలుసా.. మార్చి 20, శుక్రవారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications