భారత ప్రధాని నరేంద్ర మోదీ - కెనడా ప్రధాని మార్క్ కార్నీ మధ్య న్యూఢిల్లీలో జరిగిన ద్వైపాక్షిక చర్చలు భారత్-కెనడా సంబంధాల్లో కీలక మలుపుగా మారాయి. ఈ భేటీ అనంతరం రెండు దేశాలు పౌర అణుశక్తి రంగంలో దీర్ఘకాలిక Uranium సరఫరాకు సంబంధించిన ఒక మైలురాయి ఒప్పందంపై సంతకాలు చేశాయి. అలాగే, సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం (CEPA)ను త్వరలో ఖరారు చేయాలనే దిశగా ముందడుగు వేశాయి అని వార్తా సంస్థ పిటిఐ వెల్లడించింది.
హైదరాబాద్ హౌస్లో జరిగిన ఈ ఉన్నతస్థాయి చర్చల తర్వాత.. ఇరుదేశాలు కీలక ఖనిజాలు, ఇంధనం, వాణిజ్యం, రక్షణ వంటి అనేక రంగాల్లో సహకారాన్ని బలోపేతం చేసే ఒప్పందాలపై అంగీకరించాయి. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. పౌర అణుశక్తి రంగంలో దీర్ఘకాలిక యురేనియం సరఫరాకు సంబంధించిన ఒప్పందం భారత్కు శక్తి భద్రతను మరింత బలోపేతం చేస్తుంది. చిన్న మాడ్యులర్ రియాక్టర్లు, ఆధునిక అణు రియాక్టర్లపై కూడా రెండు దేశాలు కలిసి పనిచేస్తాయని తెలిపారు.

ఈ ఒప్పందం ప్రకారం.. కెనడా భారతదేశానికి యురేనియాన్ని సరఫరా చేయనుంది. అణుశక్తి ద్వారా విద్యుత్ ఉత్పత్తిని పెంచుకోవాలనే భారత్ లక్ష్యాలకు ఇది కీలక మద్దతుగా నిలుస్తుంది. కెనడా ప్రధాని కార్నీ కూడా దీనిని వ్యూహాత్మక ఇంధన భాగస్వామ్యంగా అభివర్ణించారు. CAD 2.6 బిలియన్ల విలువైన యురేనియం సరఫరా ఒప్పందం భారత్ అణు ఆశయాలకు గణనీయమైన తోడ్పాటునిస్తుందని ఆయన తెలిపారు.
అదనంగా.. కెనడా తన పశ్చిమ తీరంనుంచి ద్రవీకృత సహజ వాయువు (LNG)ను విశ్వసనీయంగా సరఫరా చేసే అవకాశాలు కూడా ఉన్నాయని కార్నీ పేర్కొన్నారు. తయారీ, క్లీన్ టెక్నాలజీ, అణు పరిశ్రమలకు అవసరమైన కీలక ఖనిజాల విషయంలో కెనడా భారత్కు ముఖ్యమైన భాగస్వామిగా మారనుందని ఆయన అన్నారు. రెండు దేశాలు రక్షణ పరిశ్రమలు, సముద్ర భద్రత రంగాల్లో పరస్పర అవగాహనను పెంచుకోవాలని నిర్ణయించాయి. ఉగ్రవాదం, తీవ్రవాదం, రాడికలైజేషన్ వంటి సమస్యలు ప్రపంచమంతటికీ ముప్పుగా మారాయని ప్రధాని మోదీ తెలిపారు. ఈ సవాళ్లను ఎదుర్కొనేందుకు భారత్-కెనడా మధ్య సన్నిహిత సహకారం అవసరమని ఆయన స్పష్టం చేశారు.
ద్వైపాక్షిక వాణిజ్యాన్ని గణనీయంగా పెంచే దిశగా కూడా కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రస్తుతం ఉన్న వాణిజ్యాన్ని 2030 నాటికి 50 బిలియన్ డాలర్లకు చేర్చడమే లక్ష్యంగా రెండు దేశాలు ముందుకు సాగనున్నాయి. ఇందుకోసం సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందాన్ని త్వరగా పూర్తి చేయాలని మోదీ తెలిపారు. ఈ ఒప్పందం ద్వారా పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు రెండు దేశాల్లో పెరుగుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
గత కొన్ని సంవత్సరాలుగా రాజకీయ ఉద్రిక్తతల కారణంగా భారత్-కెనడా సంబంధాలు కొంతకాలం వెనకబడ్డాయి. అయితే కార్నీ భారత పర్యటన ఈ సంబంధాలకు కొత్త ఊపునిచ్చిందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇది కేవలం సంబంధాల పునరుద్ధరణ కాదు, భవిష్యత్తు దృష్టితో కూడిన వ్యూహాత్మక భాగస్వామ్యం విస్తరణ అని కార్నీ వ్యాఖ్యానించారు. ఏదేమైనా యురేనియం ఒప్పందం, వాణిజ్య లక్ష్యాలు, రక్షణ సహకారం వంటి అంశాలు భారత్-కెనడా సంబంధాలను కొత్త దశకు తీసుకెళ్లనున్నాయని ఈ భేటీ స్పష్టంగా సూచిస్తోంది.
More From GoodReturns

ఇరాన్ యుధ్ధం.. హార్ముజ్ జలసంధిని దాటిన రెండు భారత ఎల్పీజీ నౌకలు.. ఎలా సాధ్యమయిందంటే..

వెండి ధరలు బిగ్ క్రాష్.. దెబ్బకు నిలిచిపోయిన ట్రేడింగ్.. లబోదిబోమంటున్న పెట్టుబడిదారులు

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?



Click it and Unblock the Notifications