వాషింగ్టన్: డిసెంబర్ వరకు హెచ్1బీ, ఆ తరహా వీసాలను నిషేధించిన అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ మరో కీలక నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. ఆయన మెరిట్ ఆధారిత ఇమ్మిగ్రేషన్ ఆర్డర్ తీసుకు వచ్చే అంశంపై దృష్టి సారించారని వైట్ హౌస్ తెలిపింది. ఈ ప్రతిభ ఆధారిత వలస ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ తీసుకు వస్తే నష్టపోయే విదేశీయుల్లో భారతీయ సంతతి పిల్లలు ఎక్కువగా ఉంటారు.
కరోనా నేపథ్యంలో అమెరికా యువతకు ఉద్యోగాలు కల్పించే క్రమంలో ఈ ఏఢాది చివరి వరకు వీసాలను బ్యాన్ చేశారు. గ్రీన్ కార్డుల జారీని నిలిపేశారు. ఇటీవల ఆన్లైన్ క్లాసెస్ నిర్వహించే యూనివర్సిటీల్లోని విదేశీ విద్యార్థులు దేశం విడిచి వెళ్లాలని సూచించారు. ఇప్పుడు మరో వలస విధానంపై గురి పెట్టారు.

DACA ప్రోగ్రాంకు స్వస్తీ పలకనుందా?
అంతకుముందు ప్రభుత్వాల వలస విధానాలపై ట్రంప్ మొదటి నుండి వ్యతిరేకతతో ఉన్నారు. వాటిని మార్చివేసే దిశగా అడుగులు వేస్తున్నారు. గత ప్రభుత్వం డిఫర్డ్ యాక్షన్ ఫర్ చైల్డ్హుడ్ అరైవల్స్ ప్రోగ్రాం (DACA)ను తీసుకు వచ్చింది. దీనికి ట్రంప్ పరిపాలనా విభాగం స్వస్తీ పలకనుంది. ఇందుకు సంబంధించి త్వరలో సమగ్ర వలస విధానాన్ని అమలులోకి తీసుకు వస్తున్నట్లు శ్వేతసౌధం అధికారిక ప్రకటన విడుదల చేసింది. స్థానికుల ఉపాధి అవకాశాలను కాపాడటం కోసం ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. అంతకుముందు పటిష్టమైన, కీలకమైన బిల్లును తీసుకు వస్తున్నామని, ప్రతిభ ఆధారిత వలస విధానం రానుందని, అందులో DACA కూడా భాగం కానుందని, దీంతో ప్రస్తుతం DACAకింద లబ్ధిపొందుతున్న వారికి పౌరసత్వం కల్పించానికి వెసులుబాటు కలుగుతుందని, ఈ బిల్ అందరికీ ఆమోదయోగ్యంగా ఉంటుందని వైట్ హౌస్ ఓ మీడియా ఇంటర్వ్యూలో తెలిపింది.

పేరెంట్స్తో వచ్చిన పిల్లల రక్షణ కోసం..
చిన్నతనంలోనే తల్లిదండ్రులతో వచ్చి, చట్టవిరుద్ధంగా అమెరికాలో ఉంటున్న వారికి ప్రభుత్వపరమైన రక్షణ కోసం DACA ఈ పథకాన్ని తీసుకు వచ్చారు. దీనిని రద్దు చేసే కార్యాచరణ ప్రారంభించారు. ఇప్పటికే ఈ విధానాన్ని ట్రంప్ ప్రభుత్వం రద్దు చేయగా, దీనిని అమెరికా అత్యున్నత న్యాయస్థానం తప్పుబట్టింది. దీంతో ఆయన మరో కొత్త విధానంతో ముందుకు రాబోతున్నారు. ప్రతిభ ఆధారిత వలస విధానాన్ని మరింత మెరుగుపరిచేందుకు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ జారీ చేయనున్నట్లు ట్రంప్ స్వయంగా చెప్పారు. అందులో DACA భాగం కానుందన్నారు. అంతిమంగా ఈ ప్రోగ్రాంకు స్వస్తీ పలకడమే లక్ష్యం.

భారతీయులపై ఎక్కువ ప్రభావం
అమెరికాకు వెళ్లిన విదేశీయులతో పాటు వారి పిల్లలకు ఆ దేశంలో స్వేచ్ఛగా నివసించేందుకు, ఉద్యోగాలు చేసుకునేందుకు గత ప్రభుత్వం అవకాశం కల్పించింది. 2012లో ఒబామా హయాంలో దీనిని తీసుకు వచ్చారు. ఇప్పుడు దీనిని రద్దు చేయడం ద్వారా ఎక్కువ ప్రభావం భారతీయుల పైన పడనుంది. అలా వెళ్లిన విదేశీయుల్లో ఆరున్నర లక్షల నుండి 7 లక్షల మంది వరకు వరకు ఉంటారు. వీరిని డ్రీమర్స్ అంటారు. ఇందులో ఆసియా దేశాలవారు ఎక్కువ. అందులోను భారతీయులు మరీ ఎక్కువ. కాబట్టి ఆ ప్రభావం మన వారిపై ఎక్కువగా ఉంటుంది.

చర్చకు ట్రంప్ సిద్ధమంటూ..
ఈ అంశంపై చట్టపరమైన పరిష్కారం చూపే దిశగా కాంగ్రెస్ సభ్యులతో సంప్రదింపులకు తాము సిద్ధమని ట్రంప్ ఇదివరకే చెప్పారు. డీఏసీఏతో పాటు సరిహద్దు భద్రత, శాశ్వత ప్రతిభ ఆధారిత వలస విధాన సంస్కరణలపై చర్చించేందుకు ట్రంప్ మొదటి నుండి ఆసక్తిగా ఉన్నారు.
More From GoodReturns

పాకిస్తాన్లా బ్రోకర్ పనులు భారత్ ఎప్పటికీ చేయదు.. ట్రంప్తో ఫోన్లో ప్రధాని మోదీ మాట్లాడారు: జైశంకర్

హార్ముజ్ జలసంధిపై ఇరాన్ కీలక ప్రకటన..శత్రుదేశాల నౌకలకు ప్రవేశం లేదని స్పష్టం చేసిన టెహ్రాన్..

ఇరాన్ యుద్ధంపై ట్రంప్ సంచలన ప్రకటన.. చారిత్రాత్మక ఒప్పందంపై ఏమన్నారంటే..

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications