ముంబై: స్టాక్ మార్కెట్లు గురువారం కుప్పకూలాయి. కరోనా వైరస్కు అంతర్జాతీయ ముడి చమురు ప్రభావం తోడవడంతో దేశీయ మార్కెట్లు నష్టాల్లో ప్రారంభమయ్యాయి. బాంబే స్టాక్ ఎక్స్చేంజీలో సెన్సెక్స్ దాదాపు 1700 పాయింట్ల నష్టంతో ట్రేడింగ్ ప్రారంభించింది. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజి నిఫ్టీ ఏకంగా 10,000 మార్క్ కిందకి దిగిపోయింది. మధ్యాహ్నం గం.02.51 సమయానికి సెన్సెక్స్ 2,994 పాయింట్లు నష్టపోయి 32,702 వద్ద, నిఫ్టీ 869 పాయింట్లు నష్టపోయి 9,589 పాయింట్ల వద్ద ట్రేడ్ అయింది. అంటే సెన్సెక్స్ ఈ ఒక్కరోజు దాదాపు 3వేల పాయింట్ల వరకు నష్టపోయింది. ఈ ఒక్కరోజు మధ్యాహ్నం 11 గంటల వరకే ఇన్వెస్టర్ల సంపద 11 లక్షల కోట్లు ఆవిరైంది. మార్కెట్లు క్లోజ్ అయ్యే సమయానికి సెన్సెక్స్ 2,919 పాయింట్లు నష్టపోయి 32,778 వద్ద, నిఫ్టీ 868 పాయింట్లు నష్టపోయి 9,590 వద్ద ముగిసింది.

ప్రారంభంలోనే కుప్పకూలిన మార్కెట్లు
ఉదయం గం.09:18 సమయానికి సెన్సెక్స్ 1,672.09 పాయింట్ల నష్టంతో 34,025 పాయింట్ల వద్ద, నిఫ్టీ 490.40 పాయింట్ల నష్టంతో 9,968 పాయింట్ల వద్ద ట్రేడింగ్ ప్రారంభించింది. 87 షేర్లు లాభాల్లో, 924 షేర్లు నష్టాల్లో ట్రేడ్ కాగా, 21 షేర్లలో ఎలాంటి మార్పు లేదు.

కరోనా వైరస్ దెబ్బ
గత రెండు నెలలుగా కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోన్న విషయం తెలిసిందే. దాదాపు నాలుగున్నర వేల మంది మృతి చెందారు. లక్ష మందికి పైగా ఈ వైరస్ సోకింది. ఇది మార్కెట్లను దారుణంగా దెబ్బతీస్తోంది. స్వల్ప కాలంలోనే మార్కెట్లు విలవిలలాడుతున్నాయి. గతంలో ఎన్నడూ లేనంత దారుణస్థాయికి పడిపోతున్నాయి.

కరోనాకు చమురు దెబ్బ
ఓ వైపు కరోనా వైరస్ ప్రపంచ మార్కెట్లను వణికిస్తుంటే కొద్ది రోజులుగా రష్యా - సౌదీ అరేబియా ధరల యుద్ధం కొత్తగా తెరపైకి వచ్చింది. దీంతో చమురు రంగాలు తీవ్ర నష్టాల్లో కూరుకుపోతున్నాయి. సౌదీ అరేబియా ఉత్పత్తి తగ్గించి, చమురు ధరలను భారీగా తగ్గించింది. దీంతో చమురు రంగం విలవిల్లాడుతోంది.

రూపాయి మారకం..
డాలరుతో రూపాయి మారకం విలువ గురువారం 74 కంటే తగ్గి ట్రేడ్ అయింది. 50 పైసలు పడిపోయి 74.17 వద్ద ట్రేడింగ్ ప్రారంభించింది.

భారీ నష్టాల్లో అంతర్జాతీయ మార్కెట్లు
భారత్, ఆసియా సహా అంతర్జాతీయ మార్కెట్లు నష్టాల్లో మునిగిపోయాయి. జపాన్ నిక్కీ, సౌత్ కొరియా, హాంగ్కాంగ్ మార్కెట్లు కుప్పకూలాయి. దాదాపు 4 శాతం పడిపోయాయి. అమెరికా ఫ్యూచర్స్ (డోజోన్స్) 999 పాయింట్లు తగ్గి 22,576 వద్ద ట్రేడ్ అయింది.
More From GoodReturns

ఇరాన్ యుద్ధంలో కొత్త మలుపు.. సైబర్ దాడులను మొదలు పెట్టిన టెహ్రాన్.. బలయిన అమెజాన్..

అప్పుల కుప్పగా అమెరికా.. కొంపలు ముంచబోతున్న 1974 వ ఏడాది నిర్ణయాలు.. కియోసాకి వార్నింగ్..

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

ప్రపంచం ముప్పు ముంగిట్లో ఉంది.. ఈ మూడు ఆస్తులు తప్ప మిమ్మల్ని ఏవీ కాపాడలేవంటున్న కియోసాకి..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..



Click it and Unblock the Notifications