కరోనా మహమ్మారి అగ్రరాజ్యం అమెరికాను చిగురుటాకులా వణికిస్తోంది. ఆ దేశ ఆర్థిక వ్యవస్థ ఛిన్నాభిన్నమవుతోంది. పిట్టల్లా ప్రాణాలు పోతున్నాయి. అగ్ర రాజ్యం ఆర్థిక వ్యవస్థ కనీవినీ ఎరుగని దిగజారిపోతుందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. అమెరికాలో పెద్ద ఎత్తున ఉద్యోగాల కోత, ధరల పెరుగుదల ఉంటుందని భావిస్తున్నారు. అమెరికాలో కరోనా దెబ్బ కారణంగా ఈ ప్రభావం భారత ఐటీ పైన కూడా పడనుంది.

95 శాతం మంది రోడ్లపైకి రావడం లేదు
అమెరికా ముందే మేల్కొని ఉంటే పరిస్థితి ఇంతలా ఉండపోయేది. పెద్ద సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదైనా, వందల సంఖ్యలో చనిపోయినా అగ్రరాజ్యం లాక్ డౌన్ను వద్దనుకుంది. ఇప్పుడు 95 శాతం మంది రోడ్లపైకి రావడం లేదని స్వయంగా ట్రంప్ చెప్పారు. ఇటీవలి వరకు మాత్రం లాక్ డౌన్ చేస్తే ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.

సివిల్ వార్ భయం
లాక్ డౌన్కు ముందు నుండి వెనుకాడటానికి అమెరికాకు వివిధ కారణాలు ఉన్నాయి. ఇక్కడ గన్ కల్చర్. రెండోది ఆర్థిక వ్యవస్థ. ఈ పరిస్థితుల్లో లాక్ డౌన్ ఉంటే అది సివిల్ వార్ దారి తీయవచ్చునని భయపడింది. అమెరికాలో తుపాకులు, రైఫిల్స్, పిస్టల్స్, రివాల్వర్స్ సహా దాదాపు 27 కోట్ల ఆయుధాలు ప్రజల వద్ద ఉన్నట్టు అంచనా. మరో అంతర్జాతీయ అధ్యయనంలో ఒక మనిషి, మహిళ, పిల్లవాడికి ఒక గన్ చొప్పున ఉన్నాయి. అమెరికా వ్యాప్తంగా ఆయుధాలు ఉన్నాయి. లాక్ డౌన్ చేస్తే నిత్యావసరాలు కరువై ఆయుధాలు చేతబట్టి అసాంఘిక కార్యకలాపాలకు దిగవచ్చుననే ఆందోళనలు నెలకొన్నాయి. సూపర్ మార్కెట్లు, గౌడౌన్స్, ఇళ్ల లూటీలు, కొల్లగొట్టడానికి దారితీసి తద్వారా సివిల్ వార్ జరగొచ్చునని ఆందోళన పడింది.

ఆర్థిక విధ్వంసం
లాక్ డౌన్ చేస్తే అమెరికా ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింటుందని కూడా ఆందోళనలు వ్యక్తమయ్యాయి. కొన్ని మినహాయించి మాస్క్, శానిటైజర్, వెంటిలెటర్స్ సహా వివిధ వస్తువులను చైనా నుండి దిగుమతి చేసుకుంటోంది అమెరికా. స్థానికంగా ఉత్పత్తి చేసుకునే సామర్థ్యం ఉంది. కానీ చౌక దిగుమతికి మొగ్గు చూపింది. ఇప్పుడు హఠాత్తుగా ఈ ఉత్పత్తులు చేయలేదు. లాక్ డౌన్ ప్రకటిస్తే ప్రజలు కనీస అవసరాలు తీర్చుకోలేని పరిస్థితి, వ్యాపారాలు మూతబడి ఆర్థిక వ్యవస్థ దిగజారిపోతుందని ఆందోళన పడింది.

భారత్ పైన ప్రభావం
భారత ఐటీ రంగానికి అతిపెద్ద అమెరికా అతిపెద్ద కస్టమర్. ఈ ప్రభావం మన ఐటీ రంగంపై బాగానే చూపనుంది. రిటైల్, ఆర్థిక సేవలు తదితర కీలక రంగాలన్నింటిపై కరోనా ప్రభావం కనిపిస్తోంది. అమెరికాలో నిరుద్యోగం పెరుగుతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో కంపెనీలు ఖర్చులు తగ్గించుకోనున్నాయి. ఐరోపా దేశాల్లోను కరోనా మృత్యుఘంటికలు మోగుతున్నాయి. ఈ ప్రభావం భారత ఆర్థిక వ్యవస్తపై పడనుంది.
More From GoodReturns

భారత్ టైర్ పరిశ్రమను కుదిసేస్తున్న ఇరాన్ యుధ్ద ప్రభావం.. కీలకమైన హెచ్చరిక చేసిన CLSA

Iran war: ఇరాన్లో హై అలర్ట్: ఖమేనీ అంత్యక్రియలు వాయిదా.. ఏం జరుగుతోంది?

Iran war: ఇరాన్ సంచలన నిర్ణయం.. అణు బాంబు తయారీ ఆపేస్తాం! కానీ ఆ ఒక్క కండిషన్!

ఇరాన్ మీద దాడులు.. బట్ట బయలైన అమెరికా కుట్రలు.. ప్రపంచానికి నిజాన్ని తెలిపిన స్పెయిన్..

ఇరాన్ తర్వాత ఈక్వెడార్ మీద గురిపెట్టిన అమెరికా... నార్కో-టెర్రరిస్ట్ గ్రూపులను ఏరిపారేస్తున్న ట్రంప్ సైన్యం..

ఇరాన్–అమెరికా యుద్ధంపై షాకింగ్ న్యూస్.. ఎవరి ఆయుధాలు ముందుగా అయిపోతాయో తెలుసా..

భారత ఆర్థిక వ్యవస్థని కుదిపేస్తున్న గల్ఫ్ యుద్ధ మంటలు.. ప్రమాదంలో 9 కోట్ల మంది పంపే డబ్బు ..

ఇరాన్పై యుద్ధంతో ఖాళీ అవుతున్న అమెరికా ఖజానా.. తొలి 24 గంటల్లోనే రూ. 7 వేల కోట్లకు పైగా ఖర్చు..

మిత్రుడిని అమెరికా చంపేస్తుంటే మౌనంగా చూస్తుండిపోయిన చైనా.. సైలెంట్ వెనక మిస్టరీ ఇదే..

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

Bengaluru: ఒకప్పుడు డబ్బు లేక నేలపై నిద్ర.. నేడు రూ. 800 కోట్ల టర్నోవర్! 23 ఏళ్ల అంజలి ఇన్స్పైరింగ్ జర్నీ!



Click it and Unblock the Notifications