భారత్కు అమెరికా గుడ్ న్యూస్: కరెన్సీ మానిటరింగ్ లిస్ట్ నుంచి తొలగింపు
వాషింగ్టన్: ప్రధాన వ్యాపార భాగస్వాముల కరెన్సీ మానిటరింగ్ జాబితా నుంచి భారత కరెన్సీ రూపాయిని అమెరికా తొలగించింది. అమెరికాకు అనుకూలంగా భారత్ చర్యలు చేపట్టింది. దీంతో అగ్రరాజ్యం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ లిస్ట్ నుంచి భారత్తో పాటు స్విట్జర్లాండ్ను కూడా తొలగించారు. గత ఏడాది అక్టోబర్లో భారత్, స్విట్జర్లాండ్ సహా చైనా, జపాన్, జర్మనీ, సౌత్ కొరియాలను ఈ లిస్టులో మరోసారి చేర్చారు. మంగళవారం నాడు భారత్కు అనుకూలంగా నిర్ణయం తీసుకున్నారు. భారత్, స్విట్జర్లాండ్ మినహా దేశాలు ఈ లిస్ట్లో కొనసాగుతున్నాయి. చైనా, జపాన్, జర్మనీ, సౌత్ కొరియాలతో పాటు ఇటలీ, ఐర్లాండ్, సింగపూర్, మలేషియా, వియత్నాంల కరెన్సీలు అలాగే ఉన్నాయి.
ఇండియాను కరెన్సీ మానిటరింగ్ జాబితా నుంచి తొలగించారని, మూడు పరిస్థితుల్లో ఈ లిస్ట్లో పేరు ఉంటుందని, కానీ భారత్కు ఒక్కటి మాత్రమే ఉందని, అది వాణిజ్య మిగులు అని అమెరికా ట్రెజరీ విభాగం తమ సెమీ యాన్యువల్ రిపోర్ట్లో పేర్కొంది. ఇలా వరుసగా రెండుసార్లు ఉందని, కాబట్టి భారత్ను ఈ జాబితా నుంచి తొలగించినట్లు తెలిపింది.
హెచ్చరిక!: మే 31వ తేదీలోగా మీ అకౌంట్లో రూ.12 ఉండాలి
అమెరికా ప్రధాన వ్యాపార భాగస్వామ్య దేశాలకు సంబంధించి మ్యాక్రోఎకనమిక్ అండ్ ఫారెన్ ఎక్స్చేంజ్ పాలసీలను రూపొందించింది. ఈ నివేదికను యూఎస్ కాంగ్రెస్కు పంపించారు. ఈ నివేదిక ప్రకారం IMF ప్రమాణాలను భారత్ పాటిస్తోంది. 2018లో ఈ రెండు దేశాల విదేశీ మారకద్రవ్యం కొనుగోలు గణనీయంగా తగ్గాయని పేర్కొంది.
2017లో భారత్ విదేశీ మారకద్రవ్యాన్ని పర్చేస్ చేసింది. 2018లో క్రమంగా దీనిని విక్రయించింది. ఇది జీడీపీలో 1.7 శాతంగా ఉందని ఈ నివేదికలో పేర్కొన్నారు. భారత్, స్విట్జర్లాండ్లు గత ఏడాది విదేశీ మారకద్రవ్యం కొనుగోలు తగ్గిందని పేర్కొంది. ఈ జాబితాలో చేర్చిన తర్వాత భారత్ చర్యలు చేపట్టింది. దీంతో ఇప్పుడు ఈ లిస్ట్ నుంచి తొలగించారు.
ఈ జాబితాలో భారత్ను గత ఏడాది మే నెలలో తొలిసారి చేర్చారు. అదే సమయంలో చైనా, జర్మనీ, జపాన్, సౌత్ కొరియా, స్విట్జర్లాండ్ దేశాలను చేర్చారు. అనంతరం అక్టోబర్ (2018)లో మరోసారి పొడిగించినప్పటికీ.. భారత్ మెరుగుపడిందని, వచ్చే నివేదికలో తొలగిస్తామని పేర్కొంది.