వాషింగ్టన్: ప్రధాన వ్యాపార భాగస్వాముల కరెన్సీ మానిటరింగ్ జాబితా నుంచి భారత కరెన్సీ రూపాయిని అమెరికా తొలగించింది. అమెరికాకు అనుకూలంగా భారత్ చర్యలు చేపట్టింది. దీంతో అగ్రరాజ్యం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ లిస్ట్ నుంచి భారత్తో పాటు స్విట్జర్లాండ్ను కూడా తొలగించారు. గత ఏడాది అక్టోబర్లో భారత్, స్విట్జర్లాండ్ సహా చైనా, జపాన్, జర్మనీ, సౌత్ కొరియాలను ఈ లిస్టులో మరోసారి చేర్చారు. మంగళవారం నాడు భారత్కు అనుకూలంగా నిర్ణయం తీసుకున్నారు. భారత్, స్విట్జర్లాండ్ మినహా దేశాలు ఈ లిస్ట్లో కొనసాగుతున్నాయి. చైనా, జపాన్, జర్మనీ, సౌత్ కొరియాలతో పాటు ఇటలీ, ఐర్లాండ్, సింగపూర్, మలేషియా, వియత్నాంల కరెన్సీలు అలాగే ఉన్నాయి.
ఇండియాను కరెన్సీ మానిటరింగ్ జాబితా నుంచి తొలగించారని, మూడు పరిస్థితుల్లో ఈ లిస్ట్లో పేరు ఉంటుందని, కానీ భారత్కు ఒక్కటి మాత్రమే ఉందని, అది వాణిజ్య మిగులు అని అమెరికా ట్రెజరీ విభాగం తమ సెమీ యాన్యువల్ రిపోర్ట్లో పేర్కొంది. ఇలా వరుసగా రెండుసార్లు ఉందని, కాబట్టి భారత్ను ఈ జాబితా నుంచి తొలగించినట్లు తెలిపింది.

అమెరికా ప్రధాన వ్యాపార భాగస్వామ్య దేశాలకు సంబంధించి మ్యాక్రోఎకనమిక్ అండ్ ఫారెన్ ఎక్స్చేంజ్ పాలసీలను రూపొందించింది. ఈ నివేదికను యూఎస్ కాంగ్రెస్కు పంపించారు. ఈ నివేదిక ప్రకారం IMF ప్రమాణాలను భారత్ పాటిస్తోంది. 2018లో ఈ రెండు దేశాల విదేశీ మారకద్రవ్యం కొనుగోలు గణనీయంగా తగ్గాయని పేర్కొంది.
2017లో భారత్ విదేశీ మారకద్రవ్యాన్ని పర్చేస్ చేసింది. 2018లో క్రమంగా దీనిని విక్రయించింది. ఇది జీడీపీలో 1.7 శాతంగా ఉందని ఈ నివేదికలో పేర్కొన్నారు. భారత్, స్విట్జర్లాండ్లు గత ఏడాది విదేశీ మారకద్రవ్యం కొనుగోలు తగ్గిందని పేర్కొంది. ఈ జాబితాలో చేర్చిన తర్వాత భారత్ చర్యలు చేపట్టింది. దీంతో ఇప్పుడు ఈ లిస్ట్ నుంచి తొలగించారు.
ఈ జాబితాలో భారత్ను గత ఏడాది మే నెలలో తొలిసారి చేర్చారు. అదే సమయంలో చైనా, జర్మనీ, జపాన్, సౌత్ కొరియా, స్విట్జర్లాండ్ దేశాలను చేర్చారు. అనంతరం అక్టోబర్ (2018)లో మరోసారి పొడిగించినప్పటికీ.. భారత్ మెరుగుపడిందని, వచ్చే నివేదికలో తొలగిస్తామని పేర్కొంది.
More From GoodReturns

ఇరాన్ యుద్ధంపై ట్రంప్ సంచలన ప్రకటన.. చారిత్రాత్మక ఒప్పందంపై ఏమన్నారంటే..

హార్ముజ్ జలసంధిపై ఇరాన్ కీలక ప్రకటన..శత్రుదేశాల నౌకలకు ప్రవేశం లేదని స్పష్టం చేసిన టెహ్రాన్..

చమురు సంక్షోభంలో స్నేహితుడికి అండగా రష్యా.. భారత రిఫైనరీ కంపెనీలకు 6 కోట్ల బ్యారెళ్ల ముడి చమురు సరఫరా

అమెరికాతో చర్చలేమి జరగలేదు..ట్రంప్ వ్యాఖ్యలను ఖండించిన ఇరాన్.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిందనే భయంతోనే..

Jobs: జాబ్స్ రాకపోవడానికి అసలు కారణం ఇదే! యువతలో ఆ ఒక్కటి తక్కువైంది!

హార్ముజ్ జలసంధిని దాటిన మరో రెండు భారత LPG నౌకలు.. మరో మూడు షిప్పులు ఇంకా అక్కడే..

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications