ఉద్యోగుల భవిష్య నిధి(ఈపీఎఫ్)లో దాచుకొనే మొత్తాలకు ఆదాయపన్ను విధించాలన్న ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకుంది. ఈ మేరకు కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ మంగళవారం ప్రకటించారు. 2016-17 బడ్జెట్ ప్రసంగంలో ఈపీఎఫ్లో వెనక్కి తీసుకునే కొంత మొత్తంపై పన్ను విధిస్తామని పేర్కొన్న సంగతి తెలిసిందే.
దీనిపై విపక్షాల నుంచే కాకుండా ఉద్యోగులు, కార్మిక సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. దీంతో ప్రధాని మోడీ నేరుగా రంగంలోకి దిగారు. ఈపీఎఫ్పై పన్ను ప్రతిపాదన విషయంలో పునరాలోచన చేయాలని సూచించారు. దీంతో మంగళవారం పార్లమెంట్లో అరుణ్ జైట్లీ మాట్లాడుతూ ఈపీఎఫ్పై ట్యాక్స్ను ఉపసంహరించుకుంటున్నట్లు పేర్కొన్నారు.
బడ్జెట్లో ఏమన్నారు?
ఈపీఎఫ్లో ఏప్రిల్ 1 తర్వాత నుంచి దాచుకొనే మొత్తాలను వెనక్కి తీసుకోవాలని అనుకున్నప్పుడు 60 శాతం మొత్తం మీద ఆదాయ పన్ను చెల్లించాల్సి ఉంటుందని 2016 సంవత్సరానికి గాను పార్లమెంట్లో సమర్పించిన బడ్జెట్లో పేర్కొన్నారు.

దీనిపై దేశ వ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత రావడంతో ప్రభుత్వం వివరణ ఇచ్చింది. ప్రైవేటు ఉద్యోగుల్లో అధికాదాయ వర్గాలు ఈపీఎఫ్ నుంచి అత్యధికంగా లబ్ధి పొందకుండా చూసేందుకే తాజా నిర్ణయం తీసుకున్నామన్నారు. 3.7 కోట్లమంది ఈపీఎఫ్ చందాదారుల్లో ఎక్కువమందికి తాజా నిర్ణయం ప్రభావం ఏమీ ఉండదని చెప్పారు.
పింఛను కోసమే ఈపీఎఫ్పై పన్ను ప్రతిపాదన చేశామని దానిని సరిగా అర్థం చేసుకోలేదని జైట్లీ వివరణ ఇచ్చారు. పాశ్చాత్య దేశాల మాదిరిగా భారత్ను పింఛనుతో కూడిన సమాజంగా మార్చాలని కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు. అంతేకాదు రిటైర్మెంట్ నాటికి ఈపీఎఫ్లో సమకూరిన నిధిలో 40 శాతం మొత్తానికి ఎలాంటి పన్ను ఉండదని అరుణ్ జైట్లీ ప్రకటించారు.
మరోవైపు 60 శాతం మొత్తం మీద వచ్చే వడ్డీకి మాత్రమే పన్ను చెల్లించాల్సివుంటుందని పీటీఐకి ఇచ్చిన ఇంటర్యూలో రెవెన్యూ శాఖ కార్యదర్శి హసముఖ్ అదియా చెప్పారు. మూలధనానికి పన్ను మినహాయింపు ఉంటుందని స్పష్టం చేశారు. ఏప్రిల్1,2016 నుంచి పీఎఫ్ ఖాతాల్లో జమయ్యే డబ్బులో 60 శాతంపై వచ్చే వడ్డీపైనే పన్ను భారం ఉంటుందన్నారు.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications