హైదరాబాద్: సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రయాణీకుల రద్దీని దృష్టిలో పెట్టుకొని సికింద్రాబాద్, కాచిగూడ రైల్వే స్టేషన్లలో ప్లాట్ ఫామ్ టిక్కెట్ ధరలు పెంచనున్నారు. ఈ మేరకు సౌత్ సెంట్రల్ రైల్వే సీపీఆర్వో సీహెచ్ రాకేష్ తెలిపారు. పండుగ సందర్భంగా ప్రయాణీకులతో పాటు ఎక్కువ మంది రైల్వే స్టేషన్స్కు వస్తారని, దీంతో స్టేషన్లలో రద్దీ ఉంటుందన్నారు.
దానిని తగ్గించేందుకు ప్లాట్ ఫారం టిక్కెట్ ధరను పెంచుతున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ప్లాట్ ఫాం టిక్కెట్ ధర రూ.10 ఉంది. దీనిని పండుగ సందర్భంగా రూ.20కి పెంచుతున్నట్లు తెలిపారు. పెంచిన ధరలు 9వ తేదీ (గురువారం) నుంచి 20వ తేదీ వరకు అమలులో ఉంటాయి. కొత్త ఛార్జీలు సికింద్రాబాద్, హైదరాబాదు స్టేషన్లలో అమలులో ఉంటాయి.

ప్లాట్ ఫారం ఛార్జీలు పెంచడం ద్వారా నాన్ ట్రావెలర్స్ రష్ను తగ్గించి, ప్రయాణీకులకు ఇబ్బంది లేకుండా చేయాలని భావిస్తున్నారు. కాగా, సంక్రాంతి, దసరా వంటి పండుగ సందర్భాలలో బస్సు ఛార్జీలను కూడా పెంచడం తెలిసిందే. ఇలాంటి పండుగ సందర్భాలలో బస్సు ఛార్జీలు పెంచడంపై విమర్శలు కూడా ఉన్నాయి.
More From GoodReturns

విజయవాడ నుంచి హైదరాబాద్కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

క్రెడిట్ కార్డ్ లాంజ్ యాక్సెస్ నిబంధనలు మారాయి: ప్రయాణికులకు షాక్

JD Vance: ముగిసిన చర్చలు! ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ఇరాన్.. యుద్ధం మళ్లీ మొదలైనట్టేనా?

Personal loan: బ్యాంకులు మీ లోన్ అప్లికేషన్ను ఎందుకు తిరస్కరిస్తున్నాయి? అసలు గుట్టు విప్పిన ఆర్థిక నిపుణులు!

బంగారం ధరల ఈ స్థాయికి వస్తేనే కుప్పకూలుతాయి..లేదంటే 7 వేల డాలర్ల పైమాటే, స్విస్ బ్యాంక్ నుంచి సంచలన నివేదిక..

Trading: యుద్ధం మీద బెట్టింగ్.. గంటల్లోనే లక్షాధికారులు! అసలేం జరిగిందంటే..



Click it and Unblock the Notifications