ఎన్నారైలకు డబుల్ ట్యాక్సేషన్ నుండి ఇలా ఊరట
ఎన్నారైలు భారత్కు తిరిగి వచ్చినప్పుడు, సాధారణంగా విదేశీ పదవీ విరమణ ఖాతాలలో సంపాదించిన కార్పస్కు సంబంధించిన పన్ను సమస్యలను ఎదుర్కొంటారు. ఇదే విషయాన్ని కేంద్ ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు. విదేశీ పదవీ విరమణ ఖాతాల్లో వచ్చే డబ్బుపై ఎన్నారైలకు డబుల్ ట్యాక్సేషన్ నుండి ఉపశమనం కల్పిస్తున్నట్లు 2021-12 ఆర్థిక సంవత్సరానికి ప్రవేశ పెట్టిన బడ్జెట్లో ప్రతిపాదించారు.
ప్రస్తుతం భారత్కు, విదేశాలకు ఈ పన్ను చెల్లింపు సమయంతో పాటు, పన్ను వర్తించే విధానంలో వ్యత్యాసం కారణంగా ఈ సమస్య ఉంటోంది. ఈ సమస్య పరిష్కారం కోసం ఆ నిర్దిష్ట ఖాతా నుండి పేర్కొన్న వ్యక్తి ఆదాయానికి కేంద్రం సూచించిన విధంగా కొత్త సెక్షన్ 89ఏ ప్రకారం పన్ను విధించే విధానాన్ని ప్రకటించారు.
అకౌంట్ తెరిచిన సంవత్సరంలో/కాంట్రిబ్యూషన్ చేసే సంవత్సరంలో ఉద్యోగులు ఎన్నారైలుగా ఉంటారు. మెచ్యూరిటీ లేదా ఖాతా మూసివేసే సమయానికి తిరిగి వస్తారు. వారు అప్పటికే భారత్లో పన్ను నివాసితులుగా ఉంటారు. దీంతో పదవీ విరమణ ఆదాయంపై భారత్లో, విదేశాల్లో పన్ను.. రెండుసార్లు పన్ను ఇబ్బందికరంగా మారింది. ఇప్పుడు దీని నుండి మినహాయించారు.