కరోనా వైరస్ కారణంగా మార్చి 25వ తేదీ నుండి లాక్ డౌన్ ప్రారంభమైంది. ఆ నెలలో ఇండియా పారిశ్రామికోత్పత్తి (IIP) భారీగా పడిపోయింది. ఎనిమిదేళ్ల కనిష్టానికి తగ్గింది. 2019 మార్చి నెల IIPతో పోలిస్తే 16.7 శాతం కుదించుకుపోయింది. ఈ మేరకు ఎన్ఎస్ఓ గణాంకాలు వెల్లడించాయి. తయారీ, విద్యుత్ రంగాలు డీలా పడ్డాయి. 2012 ఏప్రిల్ తర్వాత పారిశ్రామికోత్పత్తి ఇంత ఘోరంగా పడిపోవడం ఇదే మొదటిసారి.

కీలక రంగాల ఉత్పత్తిలో క్షీణత
తయారీ రంగం ఉత్పత్తి గత ఏడాది మార్చి నెలలో 3.1% వృద్ధి చెందగా, ఈసారి మైనస్ 20.6కు దిగజారింది. విద్యుదుత్పత్తి 2019లో 2.2% ఉండగా ఈసారి మైనస్ 3.1% ఉంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఏడు నెలల గరిష్టస్థాయి 4.5 శాతం వృద్ధిని నమోదు చేసింది. గత ఏడాది మార్చిలో 2.7% వృద్ధి నమోదు చేసింది. పరిశ్రమల శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం మార్చిలో పారిశ్రామికోత్పత్తికి కీలకమైన 8 రంగాలు 6.47% క్షీణతను నమోదు చేశాయి.

ఏయే రంగాలు ఎలా..
తయారీ రంగం 20.6%, ఆటోమొబైల్ -49.6% (మైనస్), విద్యుత్ పరికరాలు -31% (మైనస్), హార్డ్వేర్, ఆప్టికల్ ఎక్విప్మెంట్ -41.7% (మైనస్), యంత్రపరికరాలు -35.6% (మైనస్), కన్స్యూమర్ డ్యూరబుల్స్ -33.1% (మైనస్) క్షీణించాయి. IIP భారీ క్షీణత ప్రభావం ఈ నెల ద్వితీయార్ధంలో విడుదల కానున్న జీడీపీ గణాంకాలపై కూడా భారీగా ఉండనుంది. మొత్తం 23 పారిశ్రామిక విభాగాల్లో 7 విభాగాలు మాత్రమే వృద్ధిని నమోదు చేశాయి.

ఏప్రిల్ రిటైల్ ద్రవ్యోల్భణ వివరాల్లేవు
గణాంకాల సేకరణ సాధ్యపడకపోవడం వల్ల ఏప్రిల్ నెల రిటైల్ ద్రవ్యోల్భణం గణాంకాలు ప్రకటించలేదని అధికారవర్గాలు వెల్లడించాయి. లాక్ డౌన్ కొనసాగుతున్నందున అధికారులు ధరల సమాచారాన్ని సేకరించలేకపోవడమే ఇందుకు కారణం. సాధారణంగా ధరల డేటాను 1,114 పట్టణ, 1,181 గ్రామీణ విపణులలో జాతీయ గణాంక కార్యాలయం - ఆపరేషన్స్ విభాగంలోని క్షేత్ర సిబ్బంది సేకరిస్తుంది. టెలిఫోన్ ద్వారా వివరాలు సేకరించగా పాలు, పండ్లు, కూరగాయల ధరలు మార్చితో పోలిస్తే ఏప్రిల్లో పెరిగినట్లు గుర్తించారు.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications