న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1వ తేదీన కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. కరోనా వైరస్ నేపథ్యంలో ఈ బడ్జెట్ ఎలా ఉంటుందనే ప్రశ్నలు చాలామందిలో ఉన్నాయి. ఏడాది కాలంగా ప్రభుత్వానికి ఆదాయం భారీగా తగ్గింది. దీంతో కేంద్రం రాబడి పెంచుకునే అంశాలపై కూడా దృష్టి సారిస్తుందనే అంచనాలు ఉన్నాయి.
ఇందులో భాగంగా ఇప్పటికే పెట్రోలియం ఉత్పత్తులపై, సంపన్నులపై సెస్ ఉండవచ్చుననే వాదనలు వినిపిస్తున్నాయి. ఇతర ఉత్పత్తులు కూడా భారం అయ్యే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. అయితే దిగుమతి చేసుకునే ఉత్పత్తులపై ఈ భారం పెరిగే అవకాశముంది.

అందుకే పెంపు
రాబోవు కేంద్ర బడ్జెట్లో దిగుమతి చేసుకునే 50కి పైగా ఉత్పత్తులపై సుంకాలను ఐదు శాతం నుండి పది శాతం వరకు పెంచే అంశాన్ని కేంద్రం పరిశీలిస్తోంది. ఇందులో స్మార్ట్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ విడిభాగాలు, రిఫ్రిజిరేటర్స్, ఎయిర్ కండిషనర్స్, ఇతర అప్లియెన్సెస్ ఉన్నాయి. అయితే దిగుమతి చేసుకునే ఉత్పత్తుల పైనే ఈ భారం పడే అవకాశముంది. ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా ప్రధాని మోడీ దిగుమతి సుంకాలు పెంచాలని భావిస్తున్నారని తెలుస్తోంది. అదే సమయంలో కరోనా వల్ల ప్రభుత్వానికి ఆదాయం సమకూరే అవకాశాలు కూడా ఉంటాయి.

స్మార్ట్ ఫోన్, ఎలక్ట్రానిక్ విడిభాగాలు భారం
మేడిన్ ఇండియా ఉత్పత్తులు పెరగాలంటే విదేశీ దిగుమతుల భారం తగ్గాలని, అప్పుడే దేశంలో ఉత్పత్తి పెరుగుతుందని మోడీ ప్రభుత్వం విశ్వసిస్తోంది. అందుకే దిగుమతి ఉత్పత్తులపై వచ్చే బడ్జెట్లో భారం మోపే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇందులో భాగంగా స్మార్ట్ ఫోన్స్, ఎలక్ట్రానిక్ విడిభాగాలపై భారం పడే అవకాశముంది. గత ఏడాది పాదరక్షలు, ఫర్నీచర్, బొమ్మలు, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ వంటి ఉత్పత్తులపై 20 శాతం వరకు దిగుమతి సుంకాలను పెంచారు.

విదేశీ సంస్థలకు భారం
దిగుమతి సుంకం పెంపుతో ఖజానాకు రూ.20వేల కోట్ల వరకు అదనపు ఆదాయం వస్తుందని భావిస్తున్నారు. సుంకాల పెంపు ప్రభావం ఇతర దేశాల నుండి దిగుమతి అయ్యే ఫర్నీచర్, ఎలక్ట్రానిక్ వెహికిల్స్ పైన ప్రభావం పడవచ్చు. టెస్లా, ఐకియా వంటి సంస్థలకు షాక్ తగలవచ్చు.
More From GoodReturns

March 31: రేపటితో ముగియనున్న ఆర్థిక సంవత్సరం.. ఈ 15 పనులు చేయకపోతే భారీ జరిమానా!

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..



Click it and Unblock the Notifications