కరోనా వైరస్ దెబ్బ, చైనాలో మూతబడిన కంపెనీలు: భారత్ ఆటోకు దెబ్బ
కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. చైనా ఉత్పత్తులపై, ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతోందని భావిస్తున్నారు. చైనా కరోనా వైరస్ ప్రభావం భారత ఆటో మొబైల్ పరిశ్రమపై కూడా పడనుంది. చైనాలో పరిశ్రమలు తాత్కాలికంగా మూసివేయడంతో ఉత్పత్తులు నిలిచిపోయాయి. అక్కడి నుంచి వచ్చే విడిభాగాల సరఫరా ఆగిపోయింది. దీంతో భారత్లోని ఆటో ఉత్పత్తులపై ప్రభావం పడనుందని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
12 ఏళ్లలో 90% హరించుకుపోయిన ఆస్తి: 12 ఏళ్లలో ప్రపంచ కుబేరుడి నుండి జీరోకు పడిపోయిన అనిల్ అంబానీ
ఆటో ఉత్పత్తులు 8.3 శాతం పడిపోవచ్చు
2020 క్యాలెండర్ ఏడాదిలో భారత్లో ఆటో ఉత్పత్తులు 8.3 శాతం మేర పడిపోవచ్చునని ఫిచ్ సొల్యూషన్స్ బుధవారం అంచనా వేసింది. చైనా కరోనా వైరస్ కారణంగా ఆటో పరిశ్రమకు సరఫరా కొరత పెరిగే ప్రమాదం ఉందని పేర్కొంది. భారత్కు కూడా ఈ వైరస్ తాకితే దేశీయ ఉత్పత్తి కూడా పడిపోనుందని అభిప్రాయపడింది.
ఉత్పత్తి నిలిపివేత
కరోనా వైరస్ ఉద్భవించిన చైనాలో ఈ వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ఆటోమేకర్స్ ఉత్పత్తిని తాత్కాలికంగా నిలిపివేశారు. దేశంలో కూడా ఇలాంటి పరిస్థితులు తలెత్తితే భారత్ కూడా ఇదే విధానం అవలంభిస్తుందని అభిప్రాయపడింది. ఇండియా హెల్త్ కేర్ వ్యవస్థ అంత మెరుగ్గా లేదని, అలాంటి పరిస్థితులు ఎదురైతే భారత ఆటో ఇండస్ట్రీపై భారీగా ప్రభావం పడుతుందని పేర్కొంది. చైనాతో పోలిస్తే భారత్లో వైరస్ వ్యాప్తి వేగంగా ఉంటుందని తెలిపింది.
తప్పనిసరిగా ఉత్పత్తి నిలిపివేత
భారత్కు అతిపెద్ద ఆటో విడిభాగాల సరఫరాదారు చైనా. ఇప్పుడు కరోనా వైరస్ కారణంగా అక్కడి పరిశ్రమలు మూతబడటంతో.. భారత్కు సరఫరాలో కొరత ఏర్పడుతుంది. ఇది ఆటో మేకర్స్ ఉత్పత్తిని తగ్గించేందుకు కారణం అవుతుందని ఫిచ్ పేర్కొంది. తప్పనిపరిస్థితుల్లో ఉత్పత్తి నిలిపివేయాల్సి వస్తుందన్నారు.
వరుసగా రెండేళ్లు తగ్గుదల
ఈ లెక్కన భారత్లో 2020లో వాహనాల ఉత్పత్తి 8.3 శాతం మేర తగ్గుతుందని ఫిచ్ సొల్యూషన్స్ అంచనా వేసింది. ఇప్పటికే 2019లో ఇది 13.2 శాతం తగ్గింది. కొత్త వాహనాలకు బలహీనమైన డొమెస్టిక్ డిమాండ్ ఈ ఏడాదిలోను కొనసాగుతుందని అభిప్రాయపడింది.
30 శాతం వరకు చైనా ఉత్పత్తులు
చైనాలో ఉత్పత్తి అయ్యే ఆటో కంపోనెంట్స్లో 10 నుండి 30 శాతం వరకు భారత్కు వస్తాయి. భారతదేశంలో ఎలక్ట్రానిక్ వెహికిల్స్ విషయంలో ఇది రెండు నుండి మూడు రెట్లు ఎక్కువగా ఉండవచ్చు. చైనీస్ ఉత్పత్తుల కారణంగా ఇది ఏ మేరకు ప్రభావం కానుందో తెలిస్తుంది. ఇటీవలి బడ్జెట్లో ఎలక్ట్రిక్ వాహనాలకు అనుకూలంగా విధానాలు ఉన్నాయని పేర్కొంది.