కరోనా మహమ్మారి నేపథ్యంలో ప్రభుత్వం రూ.15 లక్షల కోట్ల తక్షణ ఆర్థిక ప్యాకేజీని ప్రకటించాలని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (CII) కోరింది. కరోనా భారత ఆర్థిక వ్యవస్థను కకావికళం చేసిందని పేర్కొంది. ఈ నేపథ్యంలో జీడీపీలో 7.5 శాతానికి సమానమైన ప్యాకేజీని లేదా రూ.15 లక్షల కోట్లను ప్రకటించాలని కోరింది. ఈ వైరస్ ప్రభావం మరో 12 నుండి 18 నెలల వరకు కొనసాగే అవకాశముందని తెలిపింది. కాబట్టి పరిశ్రమలకు, పేదలకు తక్షణమే ప్రభుత్వం నుంచి మద్దతు అవసరమని పేర్కొంది.

ఇలా సర్దుబాటు చేసుకోవచ్చు
కరోనా - లాక్ డౌన్ పరిస్థితుల నుంచి కోలుకునేందుకు దాదాపు 2 సంవత్సరాలు పడుతుందని CII ఆందోళన వ్యక్తం చేసింది. ప్రభుత్వ పేపర్లను ఆర్బీఐకి విక్రయించడం ద్వారా రూ.2 లక్షల కోట్లు, సెకండరీ మార్కెట్ నుంచి రూ.2 లక్షల కోట్లు, కేంద్ర ప్రాయోజిత పథకాలకు ఖర్చులను గణనీయంగా తగ్గించుకోవడం ద్వారా రూ.4లక్షల కోట్ల వరకు సర్దుబాటు చేసుకోవచ్చునని తెలిపింది.

అంచనాల కంటే మరింత ప్రభావం
50 రోజులుగా ఆర్థిక కార్యకలాపాలు నిలిచిపోయాయని, ముందస్తు అంచనాల కంటే కూడా ఆర్థిక వ్యవస్థ పైన మరింత ప్రభావం పడే అవకాశముందని, దీనిని అధిగమించేందుకు భారీ ఆర్థిక ప్యాకేజీ అవసరమని అభిప్రాయపడింది. భారీ ప్యాకేజీ ద్వారానే ఉద్యోగాలు, జీవనోపాధిని కాపాడుకోవచ్చునని పేర్కొంది. ప్రభుత్వ ప్యాకేజీలో రూ.2 లక్షల కోట్లను జన్ ధన్ అకౌంట్స్కు నగదు బదిలీ రూపంలో అందించడం కూడా భాగమేనని తెలిపింది.

వివిధ అసోసియేషన్స్ కోరిన ఆర్థిక ప్యాకేజీ
ఇతర ఇండస్ట్రీ అసోసియేషన్స్ కూడా పెద్ద మొత్తంలో ఆర్థిక ప్యాకేజీ అవసరమని వెల్లడించాయి. ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంపర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండియా (FICCI) రూ.10 లక్షల కోట్ల ప్యాకేజీని కోరింది. PHD చాంపర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ రూ.16 లక్షల కోట్ల ప్యాకేజీని డిమాండ్ చేసింది. Assocham రూ.14 లక్షల ప్యాకేజీ అడిగింది.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications