కేంద్ర ఆర్థికమంత్రిత్వ శాఖ రాష్ట్రాలకు రూ.46,038 కోట్ల నిధులను ట్రాన్సుఫర్ చేసింది. కరోనా మహమ్మారిపై పోరు కోసం ఏప్రిల్ నెలలో చెల్లించాల్సిన సెంట్రల్ ట్యాక్స్, డ్యూటీస్లో రాష్ట్రాల వాటాను ఆయా రాష్ట్రాలకు పంపించింది. అంతకుముందు ఈ నెల ప్రారంభంలో వివిధ రాష్ట్రాలకు డిజాస్టర్ రెస్పాన్స్ మిటిగేషన్ ఫండ్ (SDRMF) కింద రూ.17,287 కోట్లు విడుదల చేసింది. కరోనా కారణంగా లాక్ డౌన్ ఉండటంతో కేంద్రానికి, రాష్ట్రాలకు రాబడి భారీగా తగ్గిన విషయం తెలిసిందే.

29.5 శాతం వాటా తగ్గింది
లాక్ డౌన్ కారణంగా రాబడిపై ప్రభావం పడటంతో ఏప్రిల్ నెలకు గాను రాష్ట్రాలకు ఇచ్చే పన్నుల వాటాలో కేంద్ర ఆర్థిక శాఖ 29.5 శాతం మొత్తాన్ని తగ్గించింది. 15వ ఆర్థిక సంఘం మధ్యంతర నివేదిక ఆధారంగా ఈ ఏప్రిల్ నుండి రాష్ట్రాలకు ఇచ్చే కేంద్ర పన్నుల వాటాను కేంద్రం బడ్జెట్లో పేర్కొంది. ఆ మొత్తం పూర్తిగా వస్తుందని భావించాయి. కానీ ఇప్పుడు తగ్గింది.

తెలుగు రాష్ట్రాలకు షాక్
ఏప్రిల్ నెలలో తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర పన్నుల వాటాగా రూ.1,195 కోట్ల నిధులు రావాలి. కానీ రూ.982 కోట్లు మాత్రమే వచ్చాయి. ఆంధ్రప్రదేశ్కు రూ.2,686 కోట్లు రావాల్సి ఉండగా రూ.1,892 కోట్లు మాత్రమే విడుదల చేసింది. తెలంగాణ రాష్ట్రానికి రూ.212 కోట్లు, ఏపీకి రూ.794 కోట్లు కోత పడింది. మొత్తంగా రెండు రాష్ట్రాలకు రూ.1,000 కోట్లు కోత పడింది.

చెప్పింది ఎంత.. ఇచ్చింది ఎంత
ఈ ఆర్థిక సంవత్సరం (2020-21)లో తెలంగాణకు పన్నుల వాటాగా రూ.16,726 కోట్లు అందుతుందని బడ్జెట్లో తెలిపారు. ఈ లెక్కన రూ.1,393 కోట్లు అందాల్సి ఉంది. ఏపీకి రూ.32,237 కోట్లు అందుతుందని తెలిపింది. కానీ రూ.1,892 కోట్లు ట్రాన్సుఫర్ చేసింది.

ఆశలు పెట్టుకున్న రాష్ట్రాలు
లాక్ డౌన్ నేపథ్యంలో రాష్ట్రాలకు పన్నులు, పన్నేతర రాబడులు పడిపోయాయి. దీంతో కేంద్రం నుండి వచ్చే నిధులపై రాష్ట్రాలు ఆశలు పెట్టుకున్నాయి. కానీ నిధులు తగ్గి రావడం ఇబ్బందికరమే. కానీ కరోనా లాక్ డౌన్ ప్రభావం కేంద్ర నిధులపై కూడా భారీగానే పడింది.

రూ.19,312 కోట్లు కోత
28 రాష్ట్రాలకు ఏప్రిల్ నెలకు గాను రూ.65,348 కోట్లు ఇవ్వాల్సి ఉండగా, కేంద్ర ఆర్థిక శాఖ రూ.46,036 కోట్లు మాత్రమే విడుదల చేసింది. మొత్తంగా రూ.19,312 కోట్ల కోత విధించింది. దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తర ప్రదేశ్కు రూ.8,255 కోట్లు, బీహార్కు రూ.4,632 కోట్లు, మధ్యప్రదేశ్కు రూ.3,630.6, మహారాష్ట్రకు రూ.2,824.5 కోట్లు ట్రాన్సుఫర్ అయ్యాయి.
More From GoodReturns

Form 16: ఫామ్-16 స్థానంలో ఫామ్-130.. మీ శాలరీ, టాక్స్ వివరాల్లో రాబోతున్న పెద్ద మార్పులివే!

రాజమండ్రి-హైదరాబాద్ విమాన ప్రయాణం..మరో 3 కొత్త సర్వీసులు అందుబాటులోకి..

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?



Click it and Unblock the Notifications