కేంద్ర ఆర్థికమంత్రిత్వ శాఖ రాష్ట్రాలకు రూ.46,038 కోట్ల నిధులను ట్రాన్సుఫర్ చేసింది. కరోనా మహమ్మారిపై పోరు కోసం ఏప్రిల్ నెలలో చెల్లించాల్సిన సెంట్రల్ ట్యాక్స్, డ్యూటీస్లో రాష్ట్రాల వాటాను ఆయా రాష్ట్రాలకు పంపించింది. అంతకుముందు ఈ నెల ప్రారంభంలో వివిధ రాష్ట్రాలకు డిజాస్టర్ రెస్పాన్స్ మిటిగేషన్ ఫండ్ (SDRMF) కింద రూ.17,287 కోట్లు విడుదల చేసింది. కరోనా కారణంగా లాక్ డౌన్ ఉండటంతో కేంద్రానికి, రాష్ట్రాలకు రాబడి భారీగా తగ్గిన విషయం తెలిసిందే.

29.5 శాతం వాటా తగ్గింది
లాక్ డౌన్ కారణంగా రాబడిపై ప్రభావం పడటంతో ఏప్రిల్ నెలకు గాను రాష్ట్రాలకు ఇచ్చే పన్నుల వాటాలో కేంద్ర ఆర్థిక శాఖ 29.5 శాతం మొత్తాన్ని తగ్గించింది. 15వ ఆర్థిక సంఘం మధ్యంతర నివేదిక ఆధారంగా ఈ ఏప్రిల్ నుండి రాష్ట్రాలకు ఇచ్చే కేంద్ర పన్నుల వాటాను కేంద్రం బడ్జెట్లో పేర్కొంది. ఆ మొత్తం పూర్తిగా వస్తుందని భావించాయి. కానీ ఇప్పుడు తగ్గింది.

తెలుగు రాష్ట్రాలకు షాక్
ఏప్రిల్ నెలలో తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర పన్నుల వాటాగా రూ.1,195 కోట్ల నిధులు రావాలి. కానీ రూ.982 కోట్లు మాత్రమే వచ్చాయి. ఆంధ్రప్రదేశ్కు రూ.2,686 కోట్లు రావాల్సి ఉండగా రూ.1,892 కోట్లు మాత్రమే విడుదల చేసింది. తెలంగాణ రాష్ట్రానికి రూ.212 కోట్లు, ఏపీకి రూ.794 కోట్లు కోత పడింది. మొత్తంగా రెండు రాష్ట్రాలకు రూ.1,000 కోట్లు కోత పడింది.

చెప్పింది ఎంత.. ఇచ్చింది ఎంత
ఈ ఆర్థిక సంవత్సరం (2020-21)లో తెలంగాణకు పన్నుల వాటాగా రూ.16,726 కోట్లు అందుతుందని బడ్జెట్లో తెలిపారు. ఈ లెక్కన రూ.1,393 కోట్లు అందాల్సి ఉంది. ఏపీకి రూ.32,237 కోట్లు అందుతుందని తెలిపింది. కానీ రూ.1,892 కోట్లు ట్రాన్సుఫర్ చేసింది.

ఆశలు పెట్టుకున్న రాష్ట్రాలు
లాక్ డౌన్ నేపథ్యంలో రాష్ట్రాలకు పన్నులు, పన్నేతర రాబడులు పడిపోయాయి. దీంతో కేంద్రం నుండి వచ్చే నిధులపై రాష్ట్రాలు ఆశలు పెట్టుకున్నాయి. కానీ నిధులు తగ్గి రావడం ఇబ్బందికరమే. కానీ కరోనా లాక్ డౌన్ ప్రభావం కేంద్ర నిధులపై కూడా భారీగానే పడింది.

రూ.19,312 కోట్లు కోత
28 రాష్ట్రాలకు ఏప్రిల్ నెలకు గాను రూ.65,348 కోట్లు ఇవ్వాల్సి ఉండగా, కేంద్ర ఆర్థిక శాఖ రూ.46,036 కోట్లు మాత్రమే విడుదల చేసింది. మొత్తంగా రూ.19,312 కోట్ల కోత విధించింది. దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తర ప్రదేశ్కు రూ.8,255 కోట్లు, బీహార్కు రూ.4,632 కోట్లు, మధ్యప్రదేశ్కు రూ.3,630.6, మహారాష్ట్రకు రూ.2,824.5 కోట్లు ట్రాన్సుఫర్ అయ్యాయి.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!



Click it and Unblock the Notifications