For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Boycott China: అంబానీ, టాటా, ప్రేమ్‌జీ, అదానీ, బిర్లా, మహీంద్రా సహా 50 మందికి లేఖ

|

భారత్-చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తల నేపథ్యంలో చాలామంది భారతీయులు చైనీస్ ఉత్పత్తులను కొనుగోలు చేయమని చెబుతున్నారు. అలాగే ట్రేడ్ బాడీ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (CAIT) సినిమా తారలు, క్రికెట్ స్టార్స్‌కు లేఖలు రాస్తూ.. చైనీస్ ఉత్పత్తులకు ప్రచారం చేయవద్దని కోరిన విషయం తెలిసిందే. ఇప్పుడు బడా పారిశ్రామికవేత్తలకు కూడా లేఖలు రాశారు.

నిబంధలకు లోబడి.. భారత్ ప్లాన్: చైనా సహా ఆ దేశాలకు యాంటీ డంపింగ్ డ్యూటీ షాక్నిబంధలకు లోబడి.. భారత్ ప్లాన్: చైనా సహా ఆ దేశాలకు యాంటీ డంపింగ్ డ్యూటీ షాక్

ముఖేష్ అంబానీ సహా 50 మందికి లేఖలు

ముఖేష్ అంబానీ సహా 50 మందికి లేఖలు

CAIT 50 మంది ప్రముఖ వ్యాపారవేత్తలకు లేఖలు రాసింది. ముఖేష్ అంబానీ, రతన్ టాటా, ఆది గోద్రేజ్, అజిమ్ ప్రేమ్‌జీ, కుమార్ మంగళం బిర్లా, ఆనంద్ మహీంద్రా, గౌతమ్ అదానీ, నారాయణమూర్తి, గౌతమ్ అదానీ, అజయ్ పిరమిల్, సునీల్ భారతి మిట్టల్, శివనాడర్, పల్లోంజి మిస్త్రీ తదితరులకు లేఖలు రాశారు. చైనా ఉత్పత్తులను బహిష్కరించాలని వారికి రాసిన లేఖల్లో కోరారు. చైనా ఉత్పత్తులను బహిష్కరించాలనే ఉద్యమానికి మద్దతివ్వాలని, వ్యాపారవేత్తలు కూడా చైనా ఉత్పత్తులు ఉపయోగించకూడదని విజ్ఞప్తి చేసింది.

రాత్రికి రాత్రి సాధ్యం కాదు..

రాత్రికి రాత్రి సాధ్యం కాదు..

చైనా ఆధిపత్యాన్ని తగ్గించడం ద్వారా ప్రపంచ సూపర్ పవర్‌గా భారత ప్రయాణాన్ని పునర్నిర్మించే ఈ ఉద్యమంలో మనస్ఫూర్తిగా పాల్గొనాలని, సంపూర్ణ మద్దతు ఇవ్వాలని CAIT కోరింది. మన దేశం ఎక్కువగా ఆటోమొబైల్స్, ఎలక్ట్రానిక్స్, ఫార్మా, సౌరశక్తి, స్మార్ట్ ఫోన్, పునరుత్పాధక ఇంధనం వంటి వాటి కోసం చైనా దిగుమతులపై ఎక్కువగా ఆధారపడింది. ఈ నేపథ్యంలో చైనా దిగుమతులు, వస్తువుల నిషేధం అంశంపై పరిశ్రమ వర్గాలు ఆసక్తి కనబరచడం లేదు. మారుతీ, బజాజ్ వంటి ఆటో సంస్థలు చైనా నుండి దిగుమతులు తగ్గించడం రాత్రికి రాత్రి సాధ్యం కాదని చెప్పాయి.

చైనాపై ఆధారపడటం క్రమంగా తగ్గించాలి

చైనాపై ఆధారపడటం క్రమంగా తగ్గించాలి

ఏళ్లుగా చైనానుండి పెద్ద ఎత్తున వస్తువులను దిగుమతి చేసుకుంటున్నామని, హఠాత్తుగా మానివేయడం ఎలా అవుతుందని, ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ ఉన్నప్పుడు ప్రత్యామ్నాయం వైపు ఆలోచిస్తామని చెప్పేవారు లేకపోలేదు. అయితే క్రమంగా చైనాపై ఆధారపడటాన్ని తగ్గించాలని చెబుతున్నారు. ఇప్పటికే CAIT నిషేధం బహిష్కరించాల్సిన 500 వస్తువుల జాబితాను విడుదల చేసింది.

English summary

Boycott China: అంబానీ, టాటా, ప్రేమ్‌జీ, అదానీ, బిర్లా, మహీంద్రా సహా 50 మందికి లేఖ | CAIT tells India inc to join boycott China campaign

After roping in chief ministers, politicians, Bollywood celebrities and cricket players, India's largest trader body Confederation of All India Traders (CAIT) has written to 50 top industrialists in India including Mukesh Ambani, Ratan Tata, Adi Godrej, Azim Premji, Kumar Mangalam Birla and Anand Mahindra to support Boycott China campaign and stop using imported Chinese parts in their businesses.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X