తమ పార్టీ అధికారంలోకి వస్తే పేదలకు న్యాయ్ (NYAY) పథకాన్ని తీసుకు వస్తామని ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ ప్రకటించారు. ఈ న్యాయ్ స్కీం ఏమిటి? ఎవరికి ఇస్తారు? ఎంత ఇస్తారు? ఈ పథకం సాధ్యమైనా? అనే చర్చ సాగుతోంది. రాహుల్ సోమవారం ప్రకటించిన మినిమం ఇన్కం గ్యారెంటీ పథకమే న్యాయ్ స్కీం.
5 కోట్ల కుటుంబాలకు ఏడాదికి రూ.72వేలు బ్యాంకులో వేస్తామని రాహుల్ గాంధీ ప్రకటించారు. దేశంలో 20 శాతం మంది నిరుపేదలు ఉన్నారని చెప్పారు. నిరుపేదలపై ఇది చివరి పోరాటం అని కూడా ఆయన వ్యాఖ్యానించారు. నెహ్రూ నుంచి మొదలు ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ దాకా అందరూ గరీబీ హఠావో అంటున్నారని, కానీ కాంగ్రెస్ చేసిందేమీ లేదనే విమర్శల నేపథ్యంలో పేదరికంపై ఇది చివరి పోరాటం అన్నారు. ఈ పథకాన్ని హిందీలో న్యుంతమ్ ఆయ్ యోజన (మినిమమ్ ఇన్కం స్కీం) అని అంటారు. దీనికి అర్థం జస్టిస్. దీనిని చిన్నగా NYAY (ఎన్వైఏవై)గా పిలుస్తున్నారు.

న్యాయ్ పథకం సాధ్యమేనా?
న్యాయ్ పథకం సాధ్యమేనా అనే చర్చ సాగుతోంది. దేశంలో 20 శాతం మంది పేదలు పేద ప్రజలు ఉన్నారని, వారిని కుటుంబాలపరంగా లెక్కిస్తే ఐదు కోట్ల కుటుంబాలు అవుతాయని, ప్రతి కుటుంబం జీవించాలంటే నెలకు కనీసం రూ.12 వేల రూపాయలు అవసరమని, ప్రస్తుతం చాలామందికి నెలకు రూ.6 వేల ఆదాయమే వస్తోందని, అలాంటి వారికి తాము అధికారంలోకి వస్తే నెలకు నేరుగా ప్రతి పేద కుటుంబం ఖాతాలో నెలకు రూ.6 వేలు జమ చేస్తామన్నారు. తద్వారా ప్రతి కుటుంబానికి కనీస ఆదాయం రూ.12వేలుగా ఉండేలా చూస్తామన్నారు.
దేశంలో 5 కోట్ల కుటుంబాలకు.. ఒక్కో కుటుంబానికి ఏడాదికి రూ.72వేలు ఇస్తామని రాహుల్ గాంధీ చెప్పారు. దీంతో ఈ మొత్తం రూ.3.6 లక్షల కోట్లు అవుతుంది. ఇది ప్రభుత్వానికి బర్డెన్ అంటున్నారు. ఏడాది బడ్జెట్లో 12 నుంచి 13 శాతం, అలాగే డీజీపీలో 2 శాతం వాటాకు సమానం.
ఏడాదికి ద్రవ్యలోటు జీడీపీలో 3.3 శాతానికి మించకూడదని కేంద్రప్రభుత్వం పరిమితి విధించుకుంది. ఇప్పటికే ద్రవ్యలోటు 3.4 శాతానికి చేరుకుంది. అలాంటప్పుడు జీడీపీలో రెండు శాతం అంటే రూ.3.6 లక్షల కోట్లు ఎక్కడి నుంచి వస్తాయనేది ప్రశ్న. ఈ ప్రశ్నకు రాహుల్ గాంధీ నుంచి గానీ, ఆ పార్టీ సీనియర్ నాయకుల నుంచిగానీ సరైన సమాధానం లేదని అంటున్నారు. అలాగే, ఆర్థిక వ్యవస్థపై కూడా దీని ప్రభావం ఉంటుందంటున్నారు.
ఈ స్కీం ప్రకటన ఎన్డీయే ప్రభుత్వానికి దెబ్బే అంటున్నారు. గతంలో ఛత్తీస్గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్లలో రైతులకు రుణమాఫీ కూడా ప్రకటించారని గుర్తు చేస్తున్నారు. ఈ పథకంపై కాంగ్రెస్ పార్టీ బాగా ప్రచారం చేస్తే, ప్రజల్లోకి బాగా తీసుకెళ్తే లాభం ఉంటుందని చెబుతున్నారు. రైతులు, పేదలను ఇది ఆకర్షిస్తుందని అంటున్నారు. ఈ స్కీం సాధ్యం కాకపోవచ్చునని కొందరు చెప్పడంతో పాటు కొందరిని పని చేయని విధంగా మార్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. అయితే, ప్రజలు ఏం చేస్తారో చూడాలి. ఎన్డీయేకి తిరిగి అధికారం ఇస్తారా లేక ఈ పథకంతో కాంగ్రెస్ అధికారం చేజిక్కించుకుంటుందా మే 23న తెలుస్తుంది.
More From GoodReturns

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. 10 గ్రాములు ధర ఎంత తగ్గిందంటే.. మార్చి 3, మంగళవారం ధరలు ఇవే..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!



Click it and Unblock the Notifications