న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఇదివరకటికి భిన్నంగా బడ్జెట్ను ప్రవేశ పెడతామని ఇటీవల తెలిపారు. తద్వారా బడ్జెట్ పైన అంచనాలు పెరిగాయి. అలాగే, కరోనా వంటి క్లిష్టమైన సమయంలో బడ్జెట్ను ప్రవేశ పెడుతుండటం వల్ల కూడా భారీ అంచనాలే ఉన్నాయి. అయితే వాస్తవానికి గత రెండేళ్లుగా బడ్జెట్ను పరిశీలిస్తే నిరాశాజనకం కనిపిస్తోందని అంటున్నారు. గత రెండేళ్లలో ప్రభుత్వం తన మొత్తం ఖర్చు లక్ష్యాన్ని కోల్పోయింది లేదా వాటిని తగ్గించింది. కొన్ని ప్రధాన అభివృద్ధి కార్యక్రమ లక్ష్యాలను కూడా చేరుకోలేదు.
ప్రస్తుతం కరోనా నుండి ఆర్థిక వ్యవస్థను వేగంగా పునరుద్ధరించాలంటే ప్రజా వ్యయం పెంపు తప్పనిసరి. అయితే ఇప్పటికే ప్రభుత్వ ఆదాయం భారీగా పడిపోవడంతో స్పెండింగ్స్ పైన కేంద్రం ఆచితూచి వ్యవహరించాల్సి ఉంది. ఇప్పటికే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రుణాలు 13.1 ట్రిలియన్ రూపాయల రికార్డ్ స్థాయికి చేరుకున్నాయి.

పేదరికం తగ్గింపు వ్యూహంలో భాగంగా 2000 సంవత్సరంలో ప్రారంభమైన రహదారుల వృద్ధి పైన కేంద్రం దృష్టి సారించింది. వివిధ కుగ్రామాలకు అనుసంధానించడం, చిన్న వ్యాపారాల వేగవంతమైన కార్యకలాపాల కోసం రోడ్ల నిర్మాణం ఎంతో ఉపయోగపడుతోంది. గత కొన్నేళ్లుగా భారత బడ్జెట్ పెరుగుతున్నప్పటికీ దీని కోసం ఖర్చులు తగ్గిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్థిక వ్యవస్థను నిలబెట్టడం కోసం గ్రామీణ మౌలిక సదుపాయాలపై ఖర్చు ఓ వరంగా చెబుతున్నారు.
రూరల్ ఇండియాలో బ్రాడ్ బాండ్ కోసం భారత్ నెట్ ఇప్పటికి బాలారిష్టాలు ఎదుర్కొంటోంది. ప్రపంచంలోనే ఇంటర్నెట్ వినియోగదారుల్లో భారత్ రెండో స్థానంలో ఉంది. అయినప్పటికీ దేశ జనాభాలో సగం మందికి ఇంటర్నెట్ సదుపాయం లేదు. స్వచ్చ భారత్లో భాగంగా 2014లో అధికారంలోకి వచ్చిన మోడీ ప్రభుత్వం అనతికాలంలోనే పదిలక్షల మరుగుదొడ్లు నిర్మించడం కోసం భారీగా ఖర్చు చేసింది. ప్రారంభ సంవత్సరాల్లో లక్ష్యాలను అధిగమించింది. ఇటీవల కాస్త తగ్గింది. అయితే ప్రస్తుత కరోనా నేపథ్యంలో అన్ని లక్ష్యాలు చేరుకోవచ్చునని భావిస్తున్నారు.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications