Pepsico: ప్రస్తుతం అమెరికా, ఐరోపాలో ఆర్థిక మాంద్యం ప్రభావం కనిపిస్తోంది. దీంతో కంపెనీలు సైతం భారీగా ఉద్యోగుల కోతకే మెుగ్గుచూపుతున్నాయి. ఈ క్రమంలో యూఎస్ కు చెందిన మల్టీనేషనల్ కంపెనీ పెప్సికో తన ప్రధాన కార్యాలయంలో వందలాది మందిని తొలగించింది. కంపెనీ స్నాక్స్, శీతలపానీయాల వ్యాపారంలో ప్రపంచఖ్యాతి పొందింది.

ఇండియాలో ఉద్యోగాలు..
అమెరికాలో ఉద్యోగులను తగ్గిస్తున్న ఈ కంపెనీ ఇండియాలో మాత్రం ఉద్యోగుల నియామకానికి ఉపక్రమించింది. భారత్ లో తన వ్యాపారాన్ని మరింతగా విస్తరించాలని కంపెనీ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా వచ్చే ఏడాదిన్నర కాలంలో హైదరాబాద్లో తన వ్యాపారాన్ని విస్తరించేందుకు కంపెనీ కొత్తగా 1,200 మందిని నియమించుకోవాలని యోచిస్తోంది.

హైదరాబాద్ కేంద్రంగా..
పెప్సికో తన గ్లోబల్ బిజినెస్ సర్వీసెస్ సెంటర్ 2019లో హైదరాబాద్లో ప్రారంభించింది. అప్పట్లో 250 మంది ఉద్యోగులు ఇందులో పనిచేసేవారు. అయితే ప్రస్తుతం 2,800 మంది ఉద్యోగులు అక్కడ పనిచేస్తున్నారు. వీరికి మరో 1200 మందిని అదనంగా జోడించి మెుత్తం ఉద్యోగుల సంఖ్యను 4,000కు చేర్చాలని కంపెనీ ప్లాన్ చేస్తోంది. ఇదే విషయాన్ని కంపెనీ సైతం దావోస్లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సందర్భంగా వెల్లడించింది.

ఇటీవల కేటీఆర్..
పెప్సికో EVP కార్పొరేట్ వ్యవహారాల రాబర్టో అజెవెడో ఇటీవల తెలంగాణ పరిశ్రమలు & వాణిజ్య శాఖ మంత్రిని కలుసుకున్నారు. గ్లోబల్ బిజినెస్ సర్వీసెస్ సెంటర్ను వేగంగా విస్తరించడం పట్ల మంత్రి కేటీఆర్ సైతం సంతోషం వ్యక్తం చేశారు. భవిష్యత్ పెట్టుబడులకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా సహాయాన్ని అందజేస్తుందని కేటీఆర్ హామీ ఇచ్చారు. నీటి సమర్ధవంతమైన వినియోగంలో మెరుగుదల, ప్లాస్టిక్ రీసైక్లింగ్ మొదలైనవి ఇందులో ఉన్నాయి.

కంపెనీ ఉత్పత్తులు..
PepsiCo శీతల పానీయాలు మాత్రమే కాక డోరిటోస్ నాచోస్, పొటాటో చిప్స్, క్వేకర్ వోట్స్ వంటి ఉత్పత్తులను తయారు చేస్తోంది. కంపెనీ అమెరికా వ్యాప్తంగా 1.29 లక్షల మంది ఉద్యోగులను కలిగి ఉంది. అలాగే ప్రపంచవ్యాప్తంగా కంపెనీకి దాదాపుగా 3.9 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు. కంపెనీ పెరుగుతున్న ముడి పదార్థాల ధరలకు అనుగుణంగా ఉత్పత్తుల ధరలను సైతం పెంచుతోంది. ధరలు పెరుగుతున్నప్పటికీ కిరాణా దుకాణాల్లో ఆహారం, పానీయాలకు డిమాండ్ పెరుగుతూనే ఉంది.
More From GoodReturns

Bengaluru: హైదరాబాద్ దూసుకొస్తున్నా.. బెంగళూరు క్రేజ్ తగ్గట్లేదు ఎందుకు?

Bengaluru: ఐటీ రేసులో రివర్స్ గేర్! బెంగళూరును దాటేసిన హైదరాబాద్.. లేటెస్ట్ రిపోర్ట్ ఇది!

Hyderabad: ఇక ట్రాఫిక్ టెన్షన్ లేదు! సిటీలో కొత్త అండర్ పాస్, స్టీల్ బ్రిడ్జికి లైన్ క్లియర్! ఎక్కడంటే..

Hyderabad: షాపింగ్, వెల్నెస్, గ్యాస్ట్రోనమీ.. హైదరాబాద్ బ్రాండింగ్ మార్చబోతున్న మూడు కీలక స్తంభాలు!

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..



Click it and Unblock the Notifications