కరోనా మహమ్మారి చాలామంది చాలామంది ఉద్యోగాలు పోయేందుకు కారణం అవుతోంది. చాలా కంపెనీలు పింక్ స్లిప్స్ ఇవ్వడం లేదా వేతనాలలో కోత విధించడం చేస్తున్నాయి. రైడ్ హెయిలింగ్ ఉబెర్ అయితే ఇటీవల ఏకంగా 3,700 మంది ఉద్యోగాలను జూమ్ ద్వారా తెలియజేసి, తొలగించింది. ఉద్యోగం నుండి తీసివేస్తున్నట్లు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తెలిపారు.

టెలికాన్ఫరెన్స్ ద్వారా ఉద్యోగాల కోత వెల్లడి
ఉద్యోగులతో సమావేశాల కోసం ఉబెర్ పాపులర్ టెలి కాన్ఫరెన్స్ సాఫ్టువేర్ జూమ్ ఉపయోగిస్తుంది. గత వారం కూడా ఇలాగే ఈ టెలికాన్ఫరెన్స్ సాఫ్టువేర్ ద్వారా ఉద్యోగులతో మాట్లాడి, వారిని తొలగిస్తున్నట్లు తెలిపింది. ఇందుకు సంబంధించి ఇంటర్నేషనల్ మీడియాలో వార్తలు వచ్చాయి. ఓ వెబ్ సైట్ ఓ వీడియో కాల్ను కూడా సంపాదించింది.

వర్క్ ఫ్రమ్ హోమ్
ఉద్యోగుల తొలగింత బాధాకరమైన విషయమని, కానీ కరోనా కారణంగా ప్రస్తుత అనూహ్య పరిస్థితుల్లో ఇది వాస్తవరూపం దాల్చుతోందని ఉబెర్ ఓ న్యూస్ వెబ్ సైట్తో వెల్లడించిందట. దాదాపు అన్ని దేశాల్లో, నగరాల్లో ఎంతోమంది ఇంటి నుండి పని చేస్తున్నారని గుర్తు చేసింది. తాము ఉదారంగా ఇతర ప్యాకేజీ, ప్రయోజనాలు కల్పించడంపై దృష్టి సారించినట్లు తెలిపిందిత.

మీకు ఇదే చివరి పని దినం
కాగా లీకైన వీడియోలో... అరిజోనా స్కాట్స్డేల్కు చెందిన ఉబెర్స్ ఫోనిక్స్ సెంటర్ ఆఫ్ ఎక్సలెంట్ హెడ్ రుఫిన్ చెవలౌ మాట్లాడారు. ఉబెర్ బిజినెస్ బాగా పడిపోయిందని, దాదాపు సగానికి పైగా పడిపోయిందని వీడియో కాన్ఫరెన్స్లోని వ్యూయర్స్తో చెబుతున్నారు. ట్రిమ్ వ్యాల్యూమ్ తగ్గిపోయాయని, ఇది చాలా క్లిష్టమైన, జీర్ణించుకోలేని వాస్తవమన్నారు. ఎంతోమంది వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారని, ఇలాంటి స్థితిలో బిజినెస్ లేదని చెప్పారు. దీంతో 3,500 మంది ఉద్యోగులను తొలగిస్తున్నామని చెప్పారు. మీరు ఎంతో చేశారని, ఉబెర్లో మీకు ఇదే చివరి పని దినం అని సూటిగా చెప్పారు.

ఇలాంటి కాన్ఫరెన్స్లో ఉండలేం.. ఉబెర్ ఉన్నతాధికారి ఉద్వేగం
46 దేశాల్లో మొత్తం 3,700 మంది ఉద్యోగులను తొలగించారు. వీరందరికీ జూమ్ ద్వారా తెలియజేశారు. ఇది వినడానికి చాలా కష్టమని తనకు తెలుసునని రుఫిన్ చెవలౌ ఉద్వేగానికి గురయ్యారు. ఇలాంటి కాన్ఫరెన్స్లో ఉండాలని ఎవరూ కోరుకోరని, ఇలాంటి పరిస్థితుల్లో ఈ బాధాకర వార్తను సాధ్యమైనంత త్వరగా చెప్పాల్సిన పరిస్థితి అన్నారు.

ఏప్రిల్లో 80 శాతం డౌన్
ఏప్రిల్ నెలలో ఉబెర్ వ్యాపారం 80 శాతం క్షీణించింది. అదే సమయంలో ఉబెర్ ఈట్స్ పుడ్ డెలివరీ మాత్రం పెరిగింది. ఈ సంక్షోభాన్ని అధిగమించడంపై దృష్టి సారించినట్లు ఉబెర్ సీఈవో దారా ఖోస్రోషాహి అన్నారు. సంక్షోభం నేపథ్యంలో తన మూలవేతనం వదులుకుంటున్నట్లు చెప్పారు. కఠిన నిర్ణయాలు అవసరమని, తమ పెట్టుబడుల్లో కొన్నింటిపై సమీక్షిస్తామని చెప్పారు.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!



Click it and Unblock the Notifications