కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు మార్చి 25వ తేదీ నుండి ప్రారంభమైన లాక్ డౌన్ ఆంక్షలు క్రమంగా సడలిస్తోంది కేంద్ర ప్రభుత్వం. కంటైన్మెంట్ ప్రాంతాల్లో తప్పితే మిగతా ప్రాంతాల్లో దాదాపు ఆర్థిక వ్యవస్థలు కొన్ని నిబంధనలతో తెరుచుకున్నాయి. ముఖ్యంగా దేశ స్థూల జాతియోత్పత్తిలో దాదాపు 27 శాతం వాటా కలిగి ఉన్న ఐదు రాష్ట్రాలు ప్రపంచంలోని అతిపెద్ద లాక్ డౌన్ నుండి నెమ్మదిగా బయటపడుతున్నాయి. ముఖ్యంగా ఈ రాష్ట్రాలు తెరుచుకోవడం భారత ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణకు శుభసూచకమని ఎలారా సెక్యూరిటీస్ ఇంక్ స్టడీలో తేలింది.

కీలక ఐదు రాష్ట్రాల్లో పుంజుకున్న కార్యకలాపాలు
కేరళ, పంజాబ్, తమిళనాడు, హర్యానా, కర్ణాటక రాష్ట్రాల్లో ఆర్థిక కార్యకలాపాలు క్రమంగా పుంజుకుంటున్నాయి. విద్యుత్ వినియోగం, ట్రాఫిక్ మూవ్మెంట్, హోల్ సేల్ మార్కెట్లలో వ్యవసాయ ఉత్పత్తుల రాక, గూగుల్ మొబిలిటీ డేటా ఆధారంగా పుంజుకుంటున్నట్లు అర్థమవుతోందని పేర్కొంటున్నారు. కరోనా కేసులు గుజరాత్, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో రోజురోజుకు పెరుగుతున్నందున ఆ రాష్ట్రాల్లో అప్పుడే పికప్ అయ్యే పరిస్థితి కనిపించడం లేదు.

ప్రభుత్వం ఇచ్చే అతిపెద్ద ఆర్థిక ప్యాకేజీ ఇదే!
కరోనా అదుపులో ఉన్న ప్రాంతాల్లో జూన్ 8వ తేదీ నుండి షాపింగ్ మాల్స్, రెస్టారెంట్లు, ప్రార్థనాస్థలాలు తెరుచుకోవడానికి వెసులుబాటు కల్పించింది కేంద్ర ప్రభుత్వం. లాక్ డౌన్ను దశలవారీగా ఎత్తివేస్తోంది. కేంద్రం ఇటీవల రూ.21 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీని ప్రకటించింది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో సాధారణ ఆర్థిక కార్యకలాపాలు తిరిగి ప్రారంభమయ్యేందుకు ప్రభుత్వం ఇచ్చేదే అతిపెద్ద, అతిముఖ్యమైన ఆర్థిక ప్యాకేజీ అని ఎలారా సెక్యూరిటీస్ ఇంక్ ఎనకమిస్ట్ గరిమా కపూర్ చెప్పారు. అంటే ఆర్థిక కార్యకలాపాలు తిరిగి ప్రారంభమైతే అంతకుమించిన ప్యాకేజీ లేదని అభిప్రాయపడ్డారు. ఆర్థిక కార్యకలాపాలు తిరిగి ప్రారంభమవుతున్నప్పటికీ, ఇంకా పుంజుకోవాలన్నారు.

విద్యుత్ డిమాండ్
వ్యవసాయ కార్యకలాపాల నుండి వచ్చిన డిమాండ్ మేరకు హర్యానా, పంజాబ్ రాష్ట్రాలు విద్యుత్ను మెరుగుపరిచాయి. దేశ రాజధాని ఢిల్లీలో కూడా విద్యుత్ డిమాండ్ పెరుగుతోంది. గూగుల్ సెర్చ్ పోకడలను పరిశీలిస్తే కన్స్యూమర్స్ కొత్త జీవన విధానానికి అనుగుణంగా వినియోగ విధానాలను మారుస్తున్నట్లుగా ఉందని తెలిపారు.

ఈ సేవలపై దృష్టి
సెలూన్ సేవలు, ఎయిర్ కండిషనర్స్, ఎయిర్ ట్రావెల్, బైక్స్, వ్యాక్యూమ్ క్లీనర్స్ వాషింగ్ మిషన్స్ కోసం డిమాండ్ పెరిగినట్లుగా గూగుల్ సెర్చ్ పోకడలు పరిశీలిస్తే అర్థమవుతోందని చెబుతున్నారు. లాక్ డౌన్ ప్రకటించిన కొత్తలో భయంతో చాలామంది సోప్స్, గ్రాసరీ ఐటమ్స్, ఫార్మసీ ఐటమ్స్ కొనుగోలు చేశారు. ఇప్పుడు అలాంటి పరిస్థితి కనిపించడం లేదు. ఇయర్ ఫోన్స్, హెయిరాయిల్, ల్యాప్టాప్స్, మొబైల్ ఫోన్స్, జ్యువెల్లరీ, మోప్స్, టాయ్స్, మైక్రోఓవెన్స్ వంటి వాటిని చూస్తున్నారు.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!



Click it and Unblock the Notifications