PM Kisan: పీఎం కిసాన్ డబ్బులు వారు తిరిగి ఇచ్చేయాల్సిందే.. ఎందుకంటే
కేంద్ర ప్రభుత్వం 2019లో రైతలకు అండగా నిలిచేందుకు పీఎం కిసాన్ సమ్మాన్ యోజన పథకం తీసుకొచ్చింది. ఈ పథకంలో భాగంగా నాలుగు నెలలకు రెండు వేల చొప్పున సంవత్సరానికి రూ.6 వేలు అన్నదాతల ఖాతాలో జమా చేస్తున్నారు. ఇప్పటికే 11 విడతులుగా రైతుల ఖాతాల్లో డబ్బు జమా చేసింది. త్వరలో 12వ విడత నిధులు విడుదల చేయనున్నారు.
యూపీ నుంచి అత్యధికంగా
ఈ పథకం పొందాలంటే కొన్ని నియమనింబంధనలు ఉన్నాయి. ఈ పథకానికి ప్రభుత్వ ఉద్యోగులు, పదవీ విరమణ పొందిన ప్రభుత్వ ఉద్యోగులు, ఇన్ కామ్ ట్యాక్స్ కట్టేవారు అనర్హులు. అయితే చాలా అనర్హులు ఇప్పటి వరకు డబ్బులు పొందారు. వీరంతా డబ్బులు తిరిగి ఇవ్వాలని కేంద్రం స్పష్టం చేసింది. అనర్హుల జాబితా ఉత్తరప్రదేశ్కు చెందిన రైతులు అధిక సంఖ్యలో ఉన్నారు.
భూలేఖ్ మార్కింగ్
ఈ పథకం కింద ఇప్పటి వరకు ఈ రైతులకు ఇచ్చిన మొత్తాన్ని ప్రభుత్వం రికవరీ చేయనుంది. కిసాన్ సమ్మాన్ నిధి 12వ విడత ఈ నెలాఖరులోగా విడుదల చేయనున్నారు. భూలేఖ్ మార్కింగ్, ఆన్-సైట్ వెరిఫికేషన్ PM కిసాన్ పోర్టల్లో అప్లోడ్ చేసిన రైతులకు మాత్రమే డబ్బులు జమా చేయనున్నారు. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద రెండు కోట్ల 85 లక్షల మంది రైతుల లబ్ధి పొందుతున్నారు.
21 లక్షల మంది
ఇందులో 21 లక్షల మంది రైతులను అనర్హులుగా గుర్తించారు. ఈ పథకం కింద ఇప్పటివరకు వారికి ఇచ్చిన మొత్తాన్ని రైతుల నుంచి రికవరీ చేయాలని నిర్ణయించారు. చాలా మంది లబ్ధిదారులు ఆదాయపు పన్ను చెల్లించడం వల్ల అనర్హులుగా ప్రకటించారు.
ఆ జాబితాల మీరు పేరు ఉందా..
ఆ జాబితాల మీరు పేరు ఉందా..
1.ముందుగా మీరు PM కిసాన్ పథకం యొక్క అధికారిక వెబ్సైట్కి వెళ్లాలి.
2.ఆ తర్వాత ఫార్మర్ కార్నర్పై క్లిక్ చేయండి.
3.ఇప్పుడు మీరు వాపసు ఎంపికపై క్లిక్ చేయాలి.
4.ఇప్పుడు మీరు మీ ఆధార్ నంబర్, బ్యాంక్ నంబర్, మొబైల్ నంబర్ను నమోదు చేయాలి.
5.ఇప్పుడు మీరు క్యాప్చా కోడ్ను పూరించాలి. ఆ తర్వాత గెట్ డేటాపై క్లిక్ చేయండి.
ఈ మెసేజ్ స్క్రీన్పై కనిపిస్తుంది.ఈ ప్రాసెస్ చేసిన తర్వాత, మీ స్క్రీన్పై 'యు ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఏ రీఫండ్ అమౌంట్' అనే మెసేజ్ మీకు కనిపిస్తుంది. అలా రాస్తే ఆ డబ్బు తిరిగి ఇవ్వాల్సిన పనిలేదు. అదే సమయంలో, రీఫండ్ ఎంపిక కనిపిస్తే, మీరు డబ్బును తిరిగి ఇవ్వవలసి ఉంటుంది.