కరోనా మహమ్మారి నేపథ్యంలో మహారాష్ట్ర సహా పలు రాష్ట్రాల్లో లాక్డౌన్, ఇతర ఆంక్షలు విధిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలోను కేసులు వేగంగా పెరుగుతున్నాయి. దీంతో ఇక్కడ లాక్డౌన్ విధించాలా వద్దా అనే అంశంపై తెలంగాణ కేబినెట్ రేపు (మంగళవారం, మే 11) నిర్ణయం తీసుకోనుంది. ఈ మేరకు చీఫ్ మినిస్టర్ కార్యాలయం నుండి సోమవారం ఓ ప్రకటన వెలువడింది.
కరోనా ఉధృతి తగ్గడం లేదని, వివిధ రాష్ట్రాల్లో కేసులు వేగంగా పెరుగుతున్నాయని దీంతో కొన్ని రాష్ట్రాలు లాక్ డౌన్, కఠినమైన ఆంక్షలు విధిస్తున్నాయని, అలాగే తెలంగాణ రాష్ట్రంలోను లాక్ డౌన్కు సంబంధించి వివిధ వర్గాలు, వ్యక్తులు, నిపుణుల నుండి భిన్నమైన సూచనలు, సలహాలు వస్తున్నాయని, ఈ నేపథ్యంలో రేపు మధ్యాహ్నంరెండు గంటలకు తెలంగాణ కేబినెట్ సమావేశమై ఓ నిర్ణయం తీసుకుంటుందని పేర్కొన్నారు.

అయితే, అంతకుముందు వారం ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు తెలంగాణ వ్యాప్త లాక్డౌన్ వార్తలను కొట్టి పారవేశారు. పూర్తిస్థాయి లాక్ డౌన్ పెడితే కోట్లాదిమంది సామాన్య ప్రజలపై తీవ్రమైన ప్రభావం పడుతుంది. వారి బతుకులు కష్టంగా మారుతాయి. ఈ నేపథ్యంలో లాక్ డౌన్ ఉండదని వార్తలు వచ్చాయి. అయితే రేపు కేబినెట్ లాక్ డౌన్ పైన చర్చించి నిర్ణయం తీసుకోనుంది. లాక్ డౌన్ పెడితే మాత్రం తెలంగాణ సామాన్య ప్రజలు గతంలో వలె ఇబ్బందులు పడే పరిస్థితులు రావొచ్చు. అలాగే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై భారం పడుతుంది. అయితే ప్రజల ప్రాణాలు కాపాడేందుకు లాక్ డౌన్ సరైన ఎంపిక అని కొందరు చెబుతున్నారు.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..



Click it and Unblock the Notifications