హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఉద్యోగులకు శుభవార్త. ఉద్యోగుల పీఆర్సీ అమలు దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. పది, పన్నెండు రోజుల్లో ఈ అంశంపై నివేదిక ఇవ్వాలని పే రివిజన్ కమిషన్ (PRC)ను ప్రభుత్వం ఆదేశించింది. ఉద్యోగుల వేతనాల పెంపు కోసం 2018లో పీఆర్సీని నియమించింది. అప్పటి నుంచి వేతనాల పెంపుపై వేతన సవరణ సంఘం అధ్యయనం చేస్తోంది. 2018 జూన్ 1వ తేదీ నుంచి పీఆర్సీ అమలు కోసం ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. తాజా ఆదేశాల నేపథ్యంలో ఉద్యోగులకు వేతన వరం లభించే అవకాశముంది.

నాడు 43% ఫిట్మెంట్
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు వేతన సవరణ కోసం పది పన్నెండు రోజుల్లో నివేదికను సమర్పించాలని సీఎం కేసీఆర్ పీఆర్సీని ఆదివారం ఆదేశించారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత ఉద్యోగులకు 43% ఫిట్మెంట్తో 2015 ఫిబ్రవరి ఐదో తేదీన వేతన సవరణను కేసీఆర్ ప్రకటించారు. 2014 జూన్ మొదటి తేదీ నుంచి అమలులోకి వచ్చింది. పీఆర్సీ గడువు 2019 జూన్ 30న ముగిసింది. జూలై 1వ తేదీ నుంచి వేతన సవరణ జరగాలి. దీనికి రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది మే 22న పీఆర్సీని నియమించింది.

మధ్యంతర భృతికి నో.. పీఆర్సీయే...
తొలి మూడు నెలల్లోనే పీఆర్సీని నియమించాలని ప్రభుత్వం ఆదేశించింది. కానీ ఇప్పటి వరకు నివేదిక అందలేదు. పీఆర్సీ నివేదిక ఆలస్యమవుతోందని, రాష్ట్ర అవతరణ దినోత్సవం కానుకగా ఉద్యోగులకు 2018 జూన్ 2న మధ్యంతర భృతి ప్రకటిస్తామని కేసీఆర్ హామీ ఇచ్చి, ఆ తర్వాత వెనక్కి తగ్గారు. మధ్యంతర భృతి కోసం ఉద్యోగ, ఉపాధ్యాయ, గెజిటెడ్ అధికారుల సంఘాలు కోరుకున్నప్పటికీ నేరుగా కొత్త వేతన సవరణకే సీఎం కేసీఆర్ మొగ్గు చూపుతున్నారట. దీంతో పీఆర్సీ నివేదికను కోరినట్లుగా తెలుస్తోంది.

ఎంత పెంచింతే రాష్ట్రంపై ఎంత భారం...!
ప్రభుత్వ అధ్యయనాలు పూర్తయ్యాయి. తెలంగాణలో మూడున్నర లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు, రెండు లక్షలమందికి పైగా పెన్షన్ దారులు ఉన్నారు. వేతన సవరణ ద్వారా ఎంత పెంచితే ప్రభుత్వంపై ఎంత ఆదాయం అవుతుందో ఆర్థిక శాఖ ఇప్పటికే నివేదించింది.

తీపి కబురు ఎప్పుడో?
పీఆర్సీ నివేదిక వస్తే, దానిపై ప్రభుత్వం ఉపసంఘం లేదా ఉన్నతస్థాయి కమిటీని నియమిస్తుంది. ఆ కమిటీ ఉద్యోగ సంఘాలతో చర్చించి నివేదిక వచ్చాక తుది నిర్ణయం తీసుకుంటారు. ప్రస్తుత పీఆర్సీ నిర్ణయం కొత్త ఏడాది లేదా సంక్రాంతి కానుకగా వెలువడే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. లేదా వెంటనే నిర్ణయం తీసుకోవాలని కేసీఆఱ్ భావిస్తో తీపి కబురు కూడా త్వరలో అందవచ్చునని తెలుస్తోంది.
More From GoodReturns

Hyderabad: మధ్యప్రదేశ్ కొండల్లో కొత్త హైవే.. హైదరాబాద్ ప్రయాణికులకు ఇక విమాన వేగంతో ప్రయాణం!

Bengaluru: ఐటీ రేసులో రివర్స్ గేర్! బెంగళూరును దాటేసిన హైదరాబాద్.. లేటెస్ట్ రిపోర్ట్ ఇది!

Hyderabad: ఇక ట్రాఫిక్ టెన్షన్ లేదు! సిటీలో కొత్త అండర్ పాస్, స్టీల్ బ్రిడ్జికి లైన్ క్లియర్! ఎక్కడంటే..

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..



Click it and Unblock the Notifications