ఇండియాలో అతిపెద్ద సాఫ్టువేర్ ఎగుమతుల సంస్థ టాటా కన్సల్టెన్సీ (TCS) ఈ ఆర్థిక సంవత్సరానికి గాను రూ.12 మధ్యంతర డివిడెండ్ అందించింది. మంగళవారం సమావేశమైన బోర్డు.. రూపాయి ముఖ విలువ కలిగిన ప్రతి షేరుకు రూ.12 లేదా 1200 శాతం మధ్యంతర డివిడెండ్ను చెల్లించడానికి పచ్చజెండా ఊపింది.
ఈ నెల 24వ తేదీ నుంచి ఇందుకు సంబంధించి చెల్లింపులు జరపనున్నట్లు బీఎస్ఈకి సమాచారం ఇచ్చింది. 12 శాతం డివిడెండ్ అంటే రూ.4,503 కోట్లు అవుతుంది. ఇండియాలో టాప్ టెక్ కంపెనీ అయిన టీసీఎస్లో టాటా సన్స్ వాటా 72 శాతంగా ఉంది. డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్తో కలుపుకుంటే డివిడెండ్ అమౌంట్ రూ.5,400 కోట్లు అవుతుంది.

గత మూడేళ్ల కాలంలో టీసీఎస్ రూ.30,089 కోట్ల డివిడెండ్ను ఇచ్చింది. గత అయిదేళ్లలో రూ.54,133 కోట్ల డివిడెండ్ అందించింది. 2019-20 ఆర్థిక సంవత్సరానికి గాను టీసీఎస్ ప్రాఫిట్ రూ.31,472 కోట్లుగా ఉంది. కాగా, టాటా గ్రూప్లోని 11 మేజర్ కంపెనీల డెబిట్స్ (ఫైనాన్షియల్ కంపెనీలు మినహాయిస్తే) 2018లో రూ.2.22 లక్షల కోట్లు కాగా, 2019 ఆర్థిక సంవత్సరంలో రూ.2.46 లక్షల కోట్లుగా ఉంది.
More From GoodReturns

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications