రక్షాబంధన్ పండుగ రోజున సోదరి తన సోదరుడికి రాఖీ కడుతుంది. రాఖీ పండుగ సమయంలో రక్షను కట్టడంతో పాటు నోరును తీపి చేయడం సంప్రదాయం. స్వీట్స్/మిఠాయిలకు కూడా యమ గిరాకీ ఉంటుంది. రాఖీపౌర్ణమి రోజున స్వీట్స్ పరిశ్రమ అధిక డిమాండ్ కారణంగా కస్టమర్లతో కళకళలాడుతుంది. కానీ ఈసారి కరోనా మహమ్మారి స్వీట్ వ్యాపారాన్ని భారీగా దెబ్బతీసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

రూ.5,000 కోట్ల వ్యాపార నష్టం
రాఖీ పౌర్ణమి సమయంలో దేశవ్యాప్తంగా రూ.10,000 కోట్ల మేర వ్యాపారం జరుగుతుంది. అయితే కరోనా కారణంగా ఈసారి ఇది సగానికి పడిపోతుందని స్వీట్ ఇండస్ట్రీ అంచనా వేస్తోంది. వ్యాపారం ఈసారి రూ.5,000 కోట్లకు పడిపోవచ్చునని పెడరేషన్ ఆఫ్ స్వీట్స్ అండ్ నమ్కీన్ మ్యానుఫ్యాక్చరర్స్ డైరెక్టర్ అన్నారు. అంటే రూ.5,000 కోట్ల వ్యాపార నష్టం ఉండవచ్చునని ఆందోళన వ్యక్తం చేశారు.

సందడి కరువు
సాధారణంగా రక్షాబంధన్ ఒకటి రెండు రోజుల ముందు నుండి స్వీట్ షాపులు కొనుగోలుదారులతో కిటకిటలాడుతాయి. కానీ ఈసారి గతంలో వలె సందడి కనపిించలేదని చెబుతున్నారు. ముఖ్యంగా దేశంలోని ముఖ్య నగరాల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయని, దీంతో సాధ్యమైనంత వరకు కొనుగోళ్లకు దూరంగా ఉంటున్నారని, ప్రత్యామ్నాయం వైపు చూస్తున్నారని చెబుతున్నారు.

ఆన్లై రాఖీ ఆర్డర్.. బహుమతుల పైనా ప్రభావం
కరోనా, సామాజిక దూరం కారణాలతో చాలామంది ప్రయాణాలను పక్కన పెట్టి ఆన్లైన్ లేదా ఇతర మార్గాల్లో సోదరుడి వద్దకు వెళ్లకుండానే రాఖీలను పంపించారు. ఆన్ లైన్ ఆర్డర్ ఇవ్వడం ద్వారా సోదరులకు రాఖీలు పంపించారని, ప్రతిగా బహుమతులు పంపే వ్యాపారం పైన కూడా కరోనా ప్రభావం పడిందని చెబుతున్నారు. కాగా, రక్షాబంధన్ నుండి జన్మాష్టమి వరకు దేశంలో స్వీట్స్ అమ్మకాలు ఉంటాయి. సేల్స్లో 25 శాతం రక్షా బంధన్ సమయంలోనే ఉంటాయి. ఇప్పుడు ఆశించిన బిజినెస్ లేకపోవడంతో ఆశలు జన్మాష్టమిపై ఉన్నాయి.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications