దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ కంపెనీ సామ్సంగ్ డ్రాగన్ చైనాకు గట్టి షాక్ ఇచ్చింది. ఆ దేశంలో గల మొబైల్, ఐటీ డిస్ప్లే ప్రొడక్షన్ యూనిట్ తరలిస్తామని తెలిపింది. నోయిడాలో ఏర్పాటు చేస్తున్నామని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. శామ్సంగ్ కంపెనీకి తగిన వసతులు కల్పిస్తామని పేర్కొన్నారు. దేశంలో ఏర్పాటు చేసే మొదటి హై టెక్నిక్ ప్రాజెక్టు ఇదీ అని తెలిపారు. ప్రపంచంలో ఇప్పటివరకు రెండు యూనిట్లు ఉన్నాయని.. ఇదీ మూడో యూనిట్ అని వివరించారు.
నోయిడాలో ఏర్పాటు చేయబోయే యూనిట్తో 510 మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభించనుంది. వందలాది మందికి పరోక్షంగా ఉపాధి కలగనుంది. ఇప్పటికే నోయిడాలో శామ్సంగ్ కంపెనీకి చెందిన మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంది. దీనిని 2018లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించిన సంగతి తెలిసిందే.

నోయిడాలో శామ్సంగ్ డిస్ ప్లే ప్రైవేట్ లిమిటెడ్కు యూపీ ప్రభుత్వం శుక్రవారం అనుమతి ఇచ్చింది. ప్రోత్సాహకాలను కూడా ఇస్తామని ప్రకటించింది. యూనిట్ కోసం శామ్ సంగ్ కంపెనీ రూ.4 వేల 825 కోట్లను వెచ్చించనుంది. ఎకో విధానంలో డిస్ ప్లే యూనిట్ ఉంటుంది. దేశంలో మొబైల్ వినియోగం పెరుగుతోన్న క్రమంలో.. యూనిట్ నెలకొల్పడం వల్ల ప్రయోజనం ఉంటుంది.
యూపీ ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీ 2017 పాలసీ ప్రకారం శామ్ సంగ్ కంపెనీకి స్టాంప్ డ్యూటీ మినహాయింపు ఉంటుంది. ప్రాజెక్టుకు ప్రభుత్వం ఐదేళ్లపాటు రూ.250 కోట్ల ఆర్థిక సదుపాయం కల్పిస్తోంది. అలాగే కేంద్ర ప్రోత్సాహకం కింద రూ.460 కోట్లు కూడా వర్తిస్తాయి.
More From GoodReturns

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

క్రెడిట్ కార్డ్ లాంజ్ యాక్సెస్ నిబంధనలు మారాయి: ప్రయాణికులకు షాక్

JD Vance: ముగిసిన చర్చలు! ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ఇరాన్.. యుద్ధం మళ్లీ మొదలైనట్టేనా?

Personal loan: బ్యాంకులు మీ లోన్ అప్లికేషన్ను ఎందుకు తిరస్కరిస్తున్నాయి? అసలు గుట్టు విప్పిన ఆర్థిక నిపుణులు!

బంగారం ధరల ఈ స్థాయికి వస్తేనే కుప్పకూలుతాయి..లేదంటే 7 వేల డాలర్ల పైమాటే, స్విస్ బ్యాంక్ నుంచి సంచలన నివేదిక..

Trading: యుద్ధం మీద బెట్టింగ్.. గంటల్లోనే లక్షాధికారులు! అసలేం జరిగిందంటే..

బెంగళూరు రియల్ ఎస్టేట్.. మెట్రో బ్లూ లైన్ రాకతో ఈ ఏరియాలో ఇళ్ల కోసం ఎగబడుతున్న ఇన్వెస్టర్లు..



Click it and Unblock the Notifications