దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ కంపెనీ సామ్సంగ్ డ్రాగన్ చైనాకు గట్టి షాక్ ఇచ్చింది. ఆ దేశంలో గల మొబైల్, ఐటీ డిస్ప్లే ప్రొడక్షన్ యూనిట్ తరలిస్తామని తెలిపింది. నోయిడాలో ఏర్పాటు చేస్తున్నామని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. శామ్సంగ్ కంపెనీకి తగిన వసతులు కల్పిస్తామని పేర్కొన్నారు. దేశంలో ఏర్పాటు చేసే మొదటి హై టెక్నిక్ ప్రాజెక్టు ఇదీ అని తెలిపారు. ప్రపంచంలో ఇప్పటివరకు రెండు యూనిట్లు ఉన్నాయని.. ఇదీ మూడో యూనిట్ అని వివరించారు.
నోయిడాలో ఏర్పాటు చేయబోయే యూనిట్తో 510 మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభించనుంది. వందలాది మందికి పరోక్షంగా ఉపాధి కలగనుంది. ఇప్పటికే నోయిడాలో శామ్సంగ్ కంపెనీకి చెందిన మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంది. దీనిని 2018లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించిన సంగతి తెలిసిందే.

నోయిడాలో శామ్సంగ్ డిస్ ప్లే ప్రైవేట్ లిమిటెడ్కు యూపీ ప్రభుత్వం శుక్రవారం అనుమతి ఇచ్చింది. ప్రోత్సాహకాలను కూడా ఇస్తామని ప్రకటించింది. యూనిట్ కోసం శామ్ సంగ్ కంపెనీ రూ.4 వేల 825 కోట్లను వెచ్చించనుంది. ఎకో విధానంలో డిస్ ప్లే యూనిట్ ఉంటుంది. దేశంలో మొబైల్ వినియోగం పెరుగుతోన్న క్రమంలో.. యూనిట్ నెలకొల్పడం వల్ల ప్రయోజనం ఉంటుంది.
యూపీ ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీ 2017 పాలసీ ప్రకారం శామ్ సంగ్ కంపెనీకి స్టాంప్ డ్యూటీ మినహాయింపు ఉంటుంది. ప్రాజెక్టుకు ప్రభుత్వం ఐదేళ్లపాటు రూ.250 కోట్ల ఆర్థిక సదుపాయం కల్పిస్తోంది. అలాగే కేంద్ర ప్రోత్సాహకం కింద రూ.460 కోట్లు కూడా వర్తిస్తాయి.
More From GoodReturns

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ప్రయోగశాలలో పండించిన బంగారం వచ్చేస్తోంది.. ఇక పసిడి తవ్వకాలకు గుడ్ బై చెప్పడమే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు: క్రూడ్ ఆయిల్ పతనం తర్వాత బంగారం, వెండి ధరలు ఇలా..



Click it and Unblock the Notifications