ఆ 14 గంటలు RTGS నుండి డబ్బులు ట్రాన్సుఫర్ చేయలేరు, RBI ట్వీట్
అధిక మొత్తంలో ట్రాన్సాక్షన్స్ కోసం జరిపే RTGS (రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్) సేవల్లో అంతరాయం ఏర్పడనుంది. ఈ శనివారం అర్ధరాత్రి 12 గంటల నుండి ఆదివారం (ఏప్రిల్ 18) మధ్యాహ్నం గం.2 వరకు మొత్తం 14 గంటల పాటు ఈ సేవలు అందుబాటులో ఉండవని భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) గురువారం ట్వీట్ చేసింది. టెక్నికల్ సమస్యల కారణాలతో ఈ సేవల్ని తాత్కాలికంగా నిలిపివేయనున్నట్లు వెల్లడించింది.
'ఏప్రిల్ 17న బిజినెస్ సమయం ముగిసిన తర్వాత RTGS వ్యవస్థలో సాంకేతికంగా కొత్త మార్పులు చేపడుతున్నాం. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 18న మధ్యాహ్నం రెండు గంటల వరకు ఈ సేవలు అందుబాటులో ఉండవు. నెఫ్ట్ సేవలు మాత్రం యథావిధిగా కొనసాగుతాయి' అని ఆర్బీఐ పేర్కొంది.
రూ. 2 లక్షలు అంతకంటే ఎత్తువ ట్రాన్సాక్షన్స్కు RTGS సేవలను ఉపయోగిస్తారు. అయితే, ఇందులోని డిజాస్టర్ రికవరీ టైంను మెరుగుపరిచేందుకు RTGS సాంకేతిక వ్యవస్థలో ఆర్బీఐ మార్పులు చేస్తోంది. గత ఏడాది డిసెంబర్ 14 నుండి RTGS సేవలను ఆర్బీఐ 24×7 అందుబాటులోకి తెచ్చింది.